tag:blogger.com,1999:blog-39424241637325322412024-02-08T12:43:11.921-08:00† దేవుని వాక్యముUnknownnoreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-3942424163732532241.post-29781980959486484652014-02-28T06:45:00.000-08:002014-02-28T07:23:04.490-08:00క్రీస్తు యేసుగా ప్రకటితము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: #20124d; font-size: x-large;">క్రీస్తు యేసుగా ప్రకటితము</span></div>
<div style="text-align: center;">
<span style="font-size: x-large;"><span style="color: #0c343d;">సాధన క్రమము</span> </span> </div>
<blockquote dir="ltr" style="margin-right: 0px;">
<blockquote dir="ltr" style="margin-right: 0px;">
<blockquote dir="ltr" style="margin-right: 0px;">
<blockquote dir="ltr" style="margin-right: 0px;">
<blockquote dir="ltr" style="margin-right: 0px;">
<blockquote>
<div align="center">
<span style="font-size: large;"> </span></div>
<div align="center">
<span style="font-size: large;"> </span></div>
</blockquote>
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/arpana.html"><span style="color: #992211; font-size: large;">అర్పణ</span></a><br />
<span style="font-size: large;"></span><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/foreword.html"><span style="color: #992211; font-size: large;">ముందుమాట</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/Praise-the-Lord.html"><span style="color: #992211; font-size: large;">ప్రభు స్తుతి</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/1.Rakshana.html"><span style="color: #992211; font-size: large;">1.రక్షణ</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/2.Anyajanulu.html"><span style="color: #992211; font-size: large;">2.అన్యజనులు</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/3.shareeraanusaarulu-aathmaanusaarulu.html"><span style="color: #992211; font-size: large;">3.శరీరానుసారులు - ఆత్మానుసారులు</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/4.vishwaasulu.html"><span style="color: #992211; font-size: large;">4.విశ్వాసులు</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/5.Shareeraanusaaramunu-nirasinchuta.html"><span style="color: #992211; font-size: large;">5. శరీరానుసారమును నిరసించుట</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/6.dharmashaastramu-neethi.html"><span style="color: #992211; font-size: large;">6.ధర్మశాస్త్రము - నీతి</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/7.Devuni-chitthamu.html"><span style="color: #992211; font-size: large;">7. దేవుని చిత్తము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/8.Maargamu-Sathyamu-Jeevamu.html"><span style="color: #992211; font-size: large;">8. మార్గము-సత్యము-జీవము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/9.Shareeramu-Aathma.html"><span style="color: #992211; font-size: large;">9. శరీరము - ఆత్మ</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/10.Vairaagyamu.html"><span style="color: #992211; font-size: large;">10. వైరాగ్యము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/11.Paricharya-Pravachanamu.html"><span style="color: #992211; font-size: large;">11. పరిచర్య - ప్రవచనము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/12.Hrudayamu-Antahkarana.html"><span style="color: #992211; font-size: large;">12. హృదయము - అంత:కరణ</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/13.Vishwaasamu-valana-daivamu.html"><span style="color: #992211; font-size: large;">13. విశ్వాసము వలన దైవము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/14.Saadhana-Kramamu.html"><span style="color: #992211; font-size: large;">14. సాధన క్రమము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/15.Prema-Maargamu.html"><span style="color: #992211; font-size: large;">15. ప్రేమ మార్గము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/16.Dhairyamu-Shodhana.html"><span style="color: #992211; font-size: large;">16. ధైర్యము - శోధన</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/17.Aasheervaadamu.html"><span style="color: #992211; font-size: large;">17. ఆశీర్వాదము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/18.Konda-Meeda-Prasangamu.html"><span style="color: #992211; font-size: large;">18. కొండ మీద ప్రసంగము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/19.Adrushtavanthulu.html"><span style="color: #992211; font-size: large;">19. అదృష్టవంతులు</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/20.Moukthikamu.html"><span style="color: #992211; font-size: large;">20. మౌక్తికము</span></a><br />
<a href="http://devunivaakyamu.blogspot.in/2014/02/21.Saadhana-Kramammu-Punascharana.html"><span style="color: #992211; font-size: large;">21. సాధనాక్రమము పునశ్చరణ</span></a><span style="font-size: large;"></span></blockquote>
</blockquote>
</blockquote>
</blockquote>
</blockquote>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-48492721435155647002014-02-28T05:50:00.001-08:002014-02-28T05:53:25.233-08:0021. సాధనాక్రమము పునశ్చరణ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;"><b> సాధనాక్రమము </b></span><span style="font-size: large;"><b><span style="font-size: large;"><b> (పునశ్చరణ)</b></span></b></span></div>
<div style="text-align: justify;">
<span style="font-size: large;"><b><span style="font-size: large;"><b> </b></span> అన్యజనులైన వారు శరీరానుసారుల లక్షణములనెరిగి మరియు అవిశ్వాసుల లక్షణములను తెలిసికొని, యీ లక్షణములు దేవుని ఇచ్ఛకు వ్యతిరేకమైనందున, విడువ వలెనని ప్రయత్నము చేయవలెను. దురాశ, దుష్ట కార్యములనుండి విడుదల పొందినను, దేవుని యందు విశ్వాసము లేనివారికి అపవిత్రత, కాముకత్వము, లోభత్వము మొదలైనవి యుండును. విశ్వాసుల లక్షణములనెరిగి, దేవుని వైపుకు తిరుగవలెను. ఈ విశ్వాసము క్రియల వరకే పరిమితముకాక, హృదయపూర్వకముగా ఉండవలెను. నిబంధన గ్రంథములో వివరించిన క్రీస్తు లక్షణముల నెరిగి క్రీస్తుగా మారవలెను. అన్యజనులు మొదట అవిశ్వాసులుగా నైనా మారి, తరువాత తహతో సాధన చేసి విశ్వాసులుగా మారవలెను, పిదప క్రీస్తు లక్ష్యముగా తహతో సాధన చేసి క్రీస్తు గా మారవలెను. ఎందుకనగా క్రీస్తు కాని వారందరికిని మంచి చెడు క్రియలకు తగిన మంచి చెడు ఫలితములను, మరణమునకు తీర్పు లభించుచున్నది. మరణమును తప్పించుకొనవలెనిన క్రీస్తు గా మారుటకు తహతో ప్రయత్నము చేయవలెను. ఎందుకనగా క్రీస్తుగా మారిన వారికి ఏవిధమైన తీర్పు ఉండదు. కనుక క్రీస్తు లక్ష్యముగా సాధన చేసి మరణమునకు తీర్పు లేని పరలోక రాజ్యమందు చేరి యుండుటకు లక్ష్యమును యేర్పాటు చేసికొనవలెను. <br /><br /> అన్యజనుడైన వాడు తన దుష్ట కార్యముల నుండి విడుదల పొంది, విశ్వాసము వలన అవిశ్వాసులనుండి కూడా విడుదల కావలెను. హృదయపూర్వక విశ్వాసము చేత శరీరానుసారమైన సమస్త క్రియలను చేయుట నుండి విడుదల కావలెను. కాని తనకు తప్పని సరియైన శారీరక క్రియలను ఆత్మానుసారముగా చేయుచూ, క్రీస్తు లక్ష్యమును సాధించవలెను. క్రీస్తు అనుభవము పొందినప్పుడు మాత్రమే మరణమునకు తీర్పు ఉండదు. పరలోకమందు మరణమునకు తీర్పు ఉండదు. కనుక మరణమును జయించిన క్రీస్తు గా మారి, క్రీస్తు నందే మేల్కొని యుండవలెను. క్రీస్తు యొక్క అనుభవమును నిరంతరమును పొందియుంటూనే, మరల అన్యజనులలోను, అవిశ్వాసులలోను, విశ్వాసులలోను ఉన్నటు వంటి అనుభవములను తనకు అంటకుండా గ్రహించవలెను. <br /><br /> మరణమును జయించిన క్రీస్తు స్థితికి మూలమైనది యేసు స్థితి. ఈ యేసు స్థితిని లక్ష్యములోనుంచు కొనుచు, శరీర క్రియలు చేయుచున్నను, తన క్రీస్తు స్థితిని పోషించుకొనుచుండవలెను. ఈ విధముగా చేయుచున్న యెడల క్రీస్తు యేసు లో ప్రవేశించును. ఏక కాలములో యేసు స్థితిని, క్రీస్తు స్థితిని అనుభవించు చుండును. క్రీస్తు స్థితి లో తాను శరీరముగా నుండి శారీరక క్రియలను జరుపుచున్నను, తాను ఆత్మనని క్రీస్తు స్థితిని తన అనుభవములో కొనసాగించును. ఈ స్థితిని అందుకొనుటకు తను ఆత్మానుసారము జీవించుచూ, తుదకు తనను నడుపునది ఆత్మయేనని, శరీరానుసారమైన అనుభవమునుండి విడుదల పొందును. అయినను, శరీర క్రియలు తనచే జరుపబడుచున్న విషయమును అనుభవింపక, యేసు స్థితి యొక్క అనుభవములో ఆనందముగా నుండును. ఈ స్థితిలో పైన చెప్పినట్టి క్రీస్తు జీవితమును, తన లక్ష్యమైన యేసు స్థితిని ''అరమరికలు లేని ఆనందము'' అను అనుభవమును ఏక కాలములో పొందుచుండును. అనగా ఏక కాలములో క్రీస్తు స్థితిని మరియు యేసు స్థితిని అనుభవించు చుండును. <br /><br /> అనేకత్వమును అనుభవమునిచ్చు శారీరక క్రియల జ్ఞానము తనకు నశించినను, సర్వ వ్యాపకమైన, ఒక్కడే అయిన యేసు స్థితి అనుభవములో నిరంతరము ఉన్నందువలనను, తన కంటే అన్యమైన, <br /><br /><br /><br /> రెండవది లేనిదై యున్నది కనుక ఒక చెంపమీద కొట్టినప్పుడు, ఆ క్రియను విస్మరించి యుండును. కనుక అతడు తిరిగి ఏ క్రియను ప్రతీకారముగా చేయడు మరియు తన తలపులో సైతం కలుగను కూడ కలుగదు. అప్పుడు మాత్రమే అతడు రెండవ చెంప చూపగలడు.<br /><br /> ఈ విధముగా పరిపూర్ణమైన యేసు స్థితిలోనుండుటనే ''యేసు యీ సాధకుని తనలోనికి చేర్చుకొనుట'' యందురు. పరలోక రాజ్యమునందు స్థిరనివాసము యేర్పడవలెననిన, తండ్రియును, తనయుడును, పరిశుద్ధాత్మగానున్నచో ఒక్కటేననియు, యేసునందు చేర్చుకొనబడిన సాధకుడును దేవుని ఆత్మను ధరించిన వాడైనందును, అతడు కూడా పరిశుద్ధాత్మయేనను జ్ఞానము నొందవలెను.<br /><br /> యెహోవా స్థితి అవ్యక్తమునై యుండి, కుమారుని పంపినప్పుడు తండ్రియై తండ్రి రూపములో సర్వ వ్యాపకమై యుండెను. తనయుడు చేయు క్రియలు తండ్రిచే నడిపినవే నను జ్ఞానము కలిగినవాడు యేసు స్థితి నుండి విడుదల పొందును. యేసు రెండవ రాకడతో తనకు పరలోక రాజ్యమందు శాశ్వత నివాసము స్థిరమగును. తండ్రియైన యెహోవా తనకు ప్రతినిధిగా యేసు క్రీస్తు అను నరుని మనలను మరణము నుండీ రక్షించుట కొరకు మన మధ్యకు పంపెను. క్రీస్తు స్థితిని మరియు సర్వవ్యాపక స్థితియైన యేసు స్థితిని అందుకొనుటకు శిలువపై క్రీస్తుగా మరణించి, యేసుగా పునరుత్థానమైన విధమును మనకు సాదృశ్య పరచెను. మనము దీని వివరము గ్రహించి, అనుసరించిన యెడల ఆయన వలె ఆయన పునరుత్థానములోను ఐక్యత నొందెదము. ఈ క్రియ శిలువపై జరిగినందువలన, శిలువను గుర్తుగా గ్రహించి సాధన చేయవలెను. ఆయన కార్యములన్నియు మనలను సైతాను బంధమునుండి విమోమనము చేయుటకును, మనలను మేల్కొలుపుటకును ఉద్దేశించ బడినవి. దానికి తగిన సహనము, త్యాగము, ప్రేమ, కరుణలను తన జీవితములోనే మనము గ్రహించునట్లు అందుకై తాను బలియర్పణ గావించెను. ఈ సాధన క్రమము మనలను చివరికి పరిశుద్ధాత్మగా, సర్వవ్యాపకముగా మార్చి, పరలోక రాజ్యమును పొందునట్లు చేయును.<br /><br />పుష్పాంజలి<br /><br /> ఓ పరిశుద్ధాత్మ స్వరూపా! నీవు ప్రాణులకు ఆధారము, బుద్ధికి ప్రేరణవు, ప్రాణమునకు పోషకుడవు. చరాచరములన్నియు నీ యందు కుదురుకున్నవ్ష్మి నీవు సర్వము నందు చొచ్చుకొని యున్నవాడవు, కాని దేనిని అంటని వాడవై సత్యముగా ఉన్నావు. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందముగా ఉన్న వాడవు. అట్టి పరిశుద్ధాత్మ అయిన నిన్ను శరణు జొచ్చితిని. నీ ప్రేమ దృక్కులతోను, నీ దయా వీక్షణములతోను నన్ను అభిషేకించుము, ప్రభూ!<br /><br /> ఓ దేవాదిదేవా! నా జీవన విధాతవు నీవని యెరుగనైతిన్ష్మి నీ న్యాయస్థానమున జరుగు తీర్పును శిరసావహించు సహనమును నా నుగ్రహించుము. నీవే మార్గమని యెరుగ నా స్వంత మార్గములో నడచితిని. శరీరానుసారుడనైతిని. నిజమునకు సర్వశక్తిమంతుడవు నీవేనని యిప్పుడు తెలిసికొంటిని. అహంకారుడనై చీకటిలో నడచితిన్ష్మి సత్యమును ఎరుగనైతిని. నీ సత్యస్వరూపములోనికి నన్ను నడిపించుము తండ్రీ!<br /><br /> ఓ రుణామయా! నా బుద్ధి గుహయందు జ్ఞాన జ్యోతిని వెలిగించుము. నా హృదయ మందిరమందున్న నిన్ను నా కెరిగింపుము. నా జీవితమంతయు నీకే సర్వ సమర్పణ చేయగల సమాధానమును నా కొసంగుము.<br /><br /> ఓ ప్రేమ స్వరూపా! నా కరణత్రయము పవిత్రముగను, నా కాయ త్రయము పావనముగను కాలత్రయము నా భవమును దాటించునట్లు నన్ను ఆదరించుము. అనుగ్రహించుము. ఆశీర్వదించుము.<br /><br /><br /><br />కరణత్రయము వ చేతలలో, మాటలలో, తలంపులలో జరుగు క్రియలు<br /><br />కాయత్రయము వ స్థూల శరీరము, సూక్ష్త శరీరము, కారణ శరీరము<br /><br />కాలత్రయము వ భూత, భవిష్యత్, వర్త మాన కాలములు<br /><br /></b></span></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-17933581679931100092014-02-28T05:46:00.000-08:002014-02-28T05:53:12.499-08:0020. మౌక్తికము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;"><b>20. మౌక్తికము<br /><br /> ''ఆది యందు వాక్యముండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.''<br /><br /> - (యోహాను 1:1.)<br /><br />ఆది:<br /><br /> ఆదియనగా సృష్టికి ఆరంభము. అంతకు ముందు సృష్టే లేదు. ఆది యందు వాక్యముండెను. వాక్యమనగా శబ్దము. వాక్యమందు శబ్దము మొదట అవ్యక్తముగా నుండి తరువాత సృష్టిగా వెలువడెను. అవ్యక్తము అనాహత శబ్దము. ఇందు సృష్టి వెలువడుటకు అవసరమైన మూడు గుణములు సమముగా ఉండెను. ఆ మూడు గుణములు సామ్యముగా, సమతూకముగా ఉన్నప్పుడే సృష్టికి ఆది. ఆ మూడు గుణముల మిశ్రమ విజృంభణ వలన సృష్టి కొనసాగుచున్నది.ఈ స్థితియే దేవుని మహిమ పరచుట. ఈ మహత్తే దేవుని సత్తా. కనుక వాక్యము దేవుడగుట జరిగెను. అనగా ఆయన (మహత్తు) ''ఆది యందు దేవుని వద్ద ఉండెను.'' ( వాక్య రూపముగా దేవుని వద్ద ఉండెను.) - (యోహాను 1:2).<br /><br /> దేవుని నుండి సృష్టి ఆవిర్భవించెను. ''సమస్తమును ఆయన మూలముగా కలిగెను.'' - (యోహాను 1:2). ఈ దేవుడు మూడు గుణముల మిశ్రమముతో సృష్టిని ఏర్పరచెను.<br /><br />వాక్యము: <br /><br /> ఆది యందు సృష్టి కలుగుటకును, తదుపరి సృష్టి కొనసాగుటకును వాక్యమే ఆధారము. వాక్యము సృష్టికి పూర్వము దేవుని వద్ద ఉండెను. కనుక దేవుడు సృష్టి ఉన్నను, లేకున్నను కలడు. దేవుడు ఉన్నాడు అను ఈ స్థితి ఎప్పుడును ఉన్నది. ఇది చలించదు. కాని చలింప జేయు శక్తి మంతము. ఇది అదృశ్యము. ఇట్టి స్థితి యందు ప్రకృతికి మూలరూపమైన వాక్యమందలి వ్యాపక శక్తి వెలివడుటకు యత్నించెను. కదలిక లేని దేవుడు అట్లే ఉండగా వ్యాపక శక్తిచే వాక్యము కలిగెను. కాని వాక్యము సమీకరించబడిన కర్షణతో దేవుని సత్తా మూలముగా ఉండెను. అందు వలన వాక్యము ప్రకృతిగా సృష్టిగా వ్యక్తమగుటకు కారణమాయెను. మూలముగా నున్న దేవుని పురుషుడందురు. ఈ ప్రకృతి పురుషుల స్థితియే సృష్టికి ప్రథమ రూపమాయెను. ఇట్లు అవ్యక్తము నుండియే మహత్తు వాక్యముగా సృష్టి కలిగెను. ఈ మహత్తు వాక్యము కంటే వేరు కాదు. అయినను మహత్తే వ్యక్త సృష్టికి ఆది ఆయ్యెను. నుక సత్తాగా నున్న దేవుడైన పురుషుడు శక్తిగా వ్యక్తమైన ప్రకృతికి ఆధారమాయెను. కనుక ఆధారమైన వాడు దేవుడు. ఆధేయమైన మహత్తే , (వాక్యమే) దైవ సృష్టి అయ్యెను. <br /><br />సృష్టి :-<br /><br /> మొదట దేవుడు ప్రకాశవంతుడు. ఆయన అనాహత శబ్దముగా వాక్యమాయెను. వాక్యమునందు ఆకర్షణ అను ప్రకృతి కలిసెను. ఈ మూడింటి కలయికయే మాయ. ఇట్టి స్థితియందు దేవుని ప్రకాశము ప్రతిఫలించెను. మాయ రెండు విధములు అయ్యెను. (1) శుద్ధ సత్వ మాయ <br /><br />(2) మలిన సత్వ మాయ. దేవుని ప్రకాశము శుద్ధ సత్వ మాయపై పడి ప్రతి ఫలించగా ఈశ్వర స్థితి (ఆత్మ, బ్రహ్మ , యేసు, ప్రభువు) ఉద్భవించెను. ఇట్టి విశ్వ శక్తి సృష్టి, పోషణ(రక్షణ), లయములకు అధిపతి. మలిన సత్వ మాయ యందు ప్రతిఫలించిన దేవుని ప్రకాశము జీవులుగా యేర్పడెను. ఈ మలిన సత్వమనగా, సత్వ గుణము, రజోతమో గుణములతో మిశ్రమమై మలిన మగుట. తమోగుణ లక్షణ మేమనగా అజ్ఞానము, అవిద్యలచే తనకు మూలమైన దేవుని దర్శింప లేకుండుట. రజో గుణ లక్షణమేమనగా త్రిగుణముల వలన కలిగిన సృష్టిలో సృష్టికర్తకు బదులుగా భ్రాంతిచే సృష్టిని, సఙృష్టియందు వ్యక్తముగా నున్న పదార్ధములనే అనుభవించుట మరియు భ్రమచే విషయములందాసక్తితో సుఖ దు:ఖములకు లోనగుట. దీనిని అజ్ఞానమందురు. ఈ అజ్ఞానమే సాతాను సంబంధము. <br /><br /> ఈ విధముగా దేవునిచే మహత్తు వలన మూడు గుణములలో ఒక్కటైన సత్వగుణము యొక్క అంశ ఈశ్వరుడుగాను, రెండవదైన రజస్సు యొక్క అంశ జీవుడుగాను యేర్పడెను. ఇక మూడవదైన తమస్సు యొక్క అంశవలన జగత్తు యేర్పడెను.<br /><br /> జగత్తు ఏర్పడుటకు ముందుగా విశ్వశక్తి అయిన మహత్తునుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఆవిర్భవించెను. ఈ తన్మాత్రలు పంచీకరణము చెందగా పంచ భూతములాయెను. పంచ భూతములనగా ఆకాశము, వాయువు , అగ్ని, జలము, పృథ్వి. ఇవి ఎట్లు యేర్పడినవనగా శబ్ద తన్మాత్ర నుండి సూక్మ్ష ఆకాశము కలిగెను. శబ్ద, స్పర్శ తన్మాత్రల వలన సూక్ష్మ వాయువు కలిగెను. శబ్ద, స్పర్శ,రూప తన్మాత్రలవలన సూక్ష్మ అగ్ని కలిగెను. శబ్ద, స్పర్శ,రూప, రస తన్మాత్రల వలన సూక్ష్మ జలము కలిగెను. శబ్ద, స్పర్శ,రూప, రస, గంధ తన్మాత్రల వలన సూక్ష్మ పృథ్వి పుట్టెను. <br /><br /> ఈ సూక్ష్త ఆకాశము రెండు అర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక వాయువుతోను, రెండవ పరక అగ్ని తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను. <br /><br /> సూక్ష్మ వాయువు రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక అగ్ని తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను. <br /><br /> సూక్ష్మ అగ్ని రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక జలముతోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను. <br /><br /> సూక్ష్మ జలము రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక అగ్నితోను, నాల్గవ పరక పృథ్వి తోను కలిసెను. <br /><br /> సూక్ష్మ పృథ్వి రెండు ఙఅర్ధ భాగములై అందు ఒక అర్ధ భాగము అట్లుండగా మిగిలిన అర్ధ భాగము నాలుగు భాగములై ఒక పరక ఆకాశముతోను, రెండవ పరక వాయువు తోను, మూడవ పరక అగ్నితోను, నాల్గవ పరక జలము తోను కలిసెను. <br /><br /> ఈ విధముగా ఆకాశము యొక్క ఒక అర్ధ భాగము తన రెండవ అర్ధ భాగములో మిగిలిన నాలుగు భూతముల యొక్క పరకలతో కలిసి ఆకాశ భూతమయ్యెను. అట్లే వాయు భూతము, అగ్ని భూతము, జల భూతము, పృథ్వీ భూతములయ్యెను. దీనినే పంచీకరణ అందురు. ఇట్లు సృష్టి అయ్యెను.<br /><br /> ఇంను తామసాంశమందు సత్వగుణము వలన అంతరింద్రియములైన జీవుడు (జ్ఞాత)యు, మనస్సు, బుద్ధి, చిత్తము అను అంత:కరణ చతుష్టయమును మరియు వినుట, స్ప్రృశించుట, చూచుట, రుచి వాసనలను ఎరుగుటకు సాధనములైన పంచ జ్ఞానేంద్రియములును కలిగెను.అటులనే తామసాంశ యందు రజోగుణము వలన పంచ ప్రాణములైన సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణ వాయువు, అపాన వాయువు కలిగెను మరియు వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అను పంచ కర్మేంద్రియములు కలిగెను. <br /><br /> తామసాంశములో తమోగుణము పైన చెప్పిన పంచీకరణ వలన పంచ భూతములై మానవుని శరీరము కూడా ఆ పంచ భూతముల చేతనే ఏర్పడెను. అయితే పంచ భూతముల రూపములు ఈ దేహ మందు రక్తము, మాంసము, చర్మము, రసము, ఎముకలు, మూలిగ, మెదడుగా కనబడుచున్నవి.<br /><br /> ఈ విధముగా జగత్తున్ను , మానవుని దేహమున్ను, ఇంద్రియములును ఏర్పడెను.<br /><br /> ఇట్టి సృష్టిని మహత్తు వాక్యము ద్వారా ఆరు దినములలో క్రమముగా చేసి, తాను చేసిన సృష్టినిచూచి బాగున్నదని ఊరకుండెను. ఆమెన్! ఏడవ రోజున విశ్రాంతి నొందెను.<br /><br /> దేవుని సత్తా వలన సర్వము పై విధముగా కలిగెను. అనగా ''సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండ కలుగ లేదు.'' - (యోహాను 1:13).<br /><br />ఆదాము, అవ్వ:<br /><br /> వాక్యముగా నున్న ఆత్మయే పరిణామము చెందినది గావున, ఆ ఆత్మ సర్వ వ్యాపకము. సర్వమునకు ఆత్మ ఆధారమై ఉన్నది. దేవుని సత్తాయే ఆత్మ చైతన్యము. ఆత్మ అను చైతన్యముండుట వలన ఇంద్రియములు చేతనములై ఇంద్రియ వ్యాపారము చేయు చున్నవి. దేహము జడము కావున నశించు చున్నది. ఆత్మ నశించుట లేదు.<br /><br /> ఇట్టి జడ, చైతన్యముల కలయికతో ఏర్పడినదే జీవుడనెడి చేతనత్వము. పరిణామ క్రమమున తొలి మానవుడు ఆదాముగా సృజించ బడెను. ఆదాము నందలి చైతన్యము దేవుని ఆత్మయే. అందు వలన ఆదాము శరీరానుసారముగా కాక, దేవుని పోలి ఉన్నవాడయ్యెను. దేవుడు మానవుని సృజించినప్పుడు వానిని పరిపూర్ణునిగా, తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసెను. ''దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను''(ఆది 1:27). ఈ ఆదాము చైతన్య రూపమైన వాడుగా ప్రకాశవంతమైన వాడుగ నుండి దేవుని సత్తాను నిరంతరము ఎరిగియే ఉండెను. <br /><br /> ఆదాము అను పురుషుని నుండి ప్రకృతి కార్య రూప సంబంధముగా స్త్రీ రూపముగా, అవ్వగా సృజించ బడెను. వీరిద్దరును తమలో తాము ఆత్మగానే యుండిరి. అందు వలన దేవుని కిష్టులైరి.<br /><br /> ఆదాము, అవ్వలు సృజించ బడిన విధముగానే జీవ పరిణామ నిమిత్తమై సాతాను కూడా సృజించ బడెను. సాతాను అనగా నేను జీవుడను అను అజ్ఞానము. ఈ అజ్ఞానము ముందుగా అవ్వను ఆకర్షణ , మోహము అను వాటిచే ప్రభావితము చేసెను. ఎందుకనగా అవ్వ ప్రకృతి స్వరూపము, కార్య రూపము. అవ్వ మూలముగా ఆదాము ప్రేరేపించ బడెను. సాతానుకు ఇద్దరును లోబడిరి. అజ్ఞాన మూలము తమో గుణము. కావున ఆకర్షణ, మోహముల భ్రమచే దేవుని మరచిరి. రజో గుణము వలన దేవునిచే సృష్టించ బడిన వాటిని అనుభవించుట మొదలిడిరి. ''దేవుని సత్యమును, అసత్యమునకు మార్చి, సృష్టి కర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి.'' - (రోమా 1:25) . ఈ అనుభవమునకు లోనై దురాశ వలన అజ్ఞాన పూర్వక జీవితమనెడి పాపము చేసిరి. ఇట్టి దేహాభిమానము అనెడి పాపము వలన వారి దేహములు మరణమునకు తీర్పు తీర్చ బడెను. వారి సంయోజన క్రియల మూలముగా ఆదాము సంతానము వృద్ధి పొందెను. ఆదాము, అవ్వలు దేవుని ఆజ్ఞను సాతాను మూలముగా అతిక్రమించి నందున, ఆదాము సంతానము కూడా అజ్ఞానులైరి మరియు శరీరానుసార క్రియలు జరుపుకొనుచు, వారి వారి మంచి పనులకు సుఖమును, చెడ్డ పనులకు దు:ఖమును పొందుచు, మరణించు చున్నారు. దైవమును మరచి యున్నందున వీరందరును సుఖ దు:ఖముల ననుభవించుచు, మరణించుచు అజ్ఞానమును వీడరైతిరి. ఎందు కనగా వారు తమ మనస్సులో దైవమునకు చోటియ్యక పోయిరి, గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. అజ్ఞానముతో ఉండిరి అనగా వారు చీకటిగా ఉండిరి. దేవుడు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చుండెను. కాని చీకటి దానిని గ్రహింప కుండెను. ఈ విధముగా మానవులు చీకటిగా నుండి దేవుని ఆత్మచే ప్రకాశించ బడుచున్నారు. కాని వారు తమను ప్రకాశింపజేయు వెలుగును గుర్తింప కున్నారు. కారణమేమనగా భ్రమ వలన కలిగిన భ్రష్ట మనస్సు మూలముగా వారి మంచి చెడు క్రియలకు తగిన ఫలితమును సుఖ దు:ఖ రూపములో వారి శరీరముతో అనుభవించుచున్నారు. అట్టి అనుభవము శరీరానుసారమై నందున వారి ఇంద్రియములను ప్రకాశింపజేయు దేవుని వెలుగును యెరుగకున్నారు. వారి శరీర తాదాత్య్మత మూలమున వారిని నడిపించుచున్న దేవుని ఆత్మను గుర్తెరుగక, మరచి యున్నారు.<br /><br />అజ్ఞానులు :-<br /><br /> ఆదాము మొదటి వాడు. అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించెను. ఒక మనుష్యుని ద్వారా అజ్ఞానము(పాపమును), అజ్ఞానము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిన్నీ సంప్రాప్తమయ్యెను. మనుష్యులు అజ్ఞానులై యుండిరి. వారు ఆత్మ కలిగి యుండియు, దాని నెరుగనైరి. ఆత్మయే మనుష్యునికి ఆధారమై ఉన్నది. మనుష్యునిలో అది ఆంతర్య పురుషునిగా ఉన్నది. కనుక ఆత్మయే మనుష్యుని నడిపించుచున్నది. లోపల నున్న ఆంతర్య పురుషుడు మేలు చేయవలెనని కోరు చున్నాడు. కాని బాహ్య పురుషుడైన శరీంరేంద్రియములు, ఆంతర్య పురుషుని ప్రేరణను వినక, చేయవలసిన మేలు చేయకున్నాడు. చేయ కూడని కీడు వద్దని ప్రేరణ కలిగినను, కీడునే చేయుచున్నాడు. శరీరానుసారులు ఈ విధముగా బాహ్య పురుషునిగానే పని చేయుచున్నారు. ఈ ప్రపంచ మందు గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయములను యితర పదార్ధముల ద్వారాను, ఇతరుల ద్వారాను, ఈ బాహ్యమును పురుషుడు అనుభవించుచున్నాడు. వాటిపై దురాశను పెంచుకొని స్వార్ధ పరుడైనాడు. ఈ స్వార్ధము వలన ఎప్పుడును తన సుఖము కొరకును, దు:ఖ నివారణ కొరకును నిరంతరము శ్రమ పడుచుండును. ఈ శ్రమతో తన కోరికలను తీర్చుకొనుటకు ప్రయాస పడుచు వేదన పడుచుండును. ఫలితముగా సుఖమును గాని, దు:ఖమును గాని పొందును. తాను చేయు ప్రయత్నములు ఫలించుట కొరకు తపన పడుచూ మరియు ఆ పనులు జరుగుచున్నప్పుడు కలగిన ఫలితములచే ప్రేరణ పొందుచు పనులు చేయు చుండును.<br /><br /> కాని దేవుని ఉగ్రత దినమందు, మనుష్యుడు చేయు పనులను బట్టి మంచి గాని, చెడు గాని ఫలితములనిచ్చుచు, మరణమునకు ఆ దైవము తీర్పు నిచ్చును. ఈ విధముగా మనుష్యుడు జరుపు క్రియలను, అతని సుఖ దు:ఖముల అనుభవములను మరియు మరణమును, అతని యొక్క అజ్ఞానమై ఉన్నవి. ఈ అజ్ఞానులైన మనుష్యులే ఆదాము సంతానము.<br /><br />ధర్మశాస్త్రము:-<br /><br /> ధర్మశాస్త్రమనగా మంచి చెడు పనుల గురించియు, వాటి ఫలితముల గురించియు తెలుపునది. ఈ ధర్మశాస్త్రమును ఆత్మానుసారముగా ఎరుగక అజ్ఞానులైన నరులు మరణమునకు తీర్పు తీర్చ బడుచున్నారు. ఈ ధర్మశాస్త్రమును అమలు పరచు అధికారము తండ్రియైన యెహోవా తన కుమారుడైన యేసు క్రీస్తునకు అప్పగించెను. మానవులు అజ్ఞానము నుండి విడుదల పొందవలెనని యెహోవా ప్రేమతో ధర్మశాస్త్రమును నియమించెను. తాను అనుభవించు వానిపై తృప్తి కలిగినను, వైరాగ్యము కలిగినను లేక భరించ నలవిగాని దు:ఖమును పొందినను, తనకు కలిగిన గుణ పాఠము ద్వారా తన అజ్ఞానమును విడచును. కనుక ధర్మశాస్త్రము తన అజ్ఞానమును బయలు పరచును. దీనిని తెలిసిన నరులు శరీరానుసారముగా కాక, ఆత్మానుసారముగా జీవించి జ్ఞానమును పొందగలరు మరియు మరణమును తప్పించు కొందురు. కాని ఎక్కువ మంది నరులు ధర్మశాస్త్రమును ఆత్మానుసారముగా నెరుగరు.<br /><br />తీర్పు :-<br /><br /> అయినను కొందరు ధర్మశాస్త్రము నెరిగియు, వారి పాపేచ్ఛ వలన, శరీరమే సత్యమని భ్రమింతురు. అందు వలన, యింకను స్వార్ధము వలన దురాశకు లోబడుదురు. ఈ దురాశ కారణమున నరులు తమ్ము తాము కాముకత్వమునకు అప్పగించు కొనుచున్నారు. కాని ధర్మశాస్త్రము వలన వారు చేయు మంచి పనులకు మంచి ఫలితమును (సుఖము) చెడు పనులకు చెడు ఫలితమును (దు:ఖము) అనుభవించుటకు క్రీస్తు న్యాయ దినమందు వారికి తీర్పు తీర్చ బడుచున్నది. ఈ తీర్పు వలన వారికి ఈ శరీరము ఏర్పడుచున్నది. ఈ శరీర అభిమానమే అజ్ఞాన మూలము. ఇట్టి శరీరమునకు మరణము తప్పదు. కన తీర్పునకు లోబడినచో అది మరణమును ఇచ్చును. తీర్పును తప్పించునది జ్ఞానమే. జ్ఞానమనగా దేవుని ఎరుగుట. అజ్ఞానమనగా శరీరేచ్ఛ, పాపేచ్ఛల మూలమున శరీరానుసారము జీవించుట. శరీరానుసారులు తీర్పును తప్పించుకొన జాలరు.<br /><br />ప్రవక్తలు:-<br /><br /> శరీరానుసారులైన వారందరును జ్ఞానము పొంద వలెననిన, వారికి మొదట దేవునిపై విశ్వాసము కలుగ వలెను. దేవుని ఋజువు పరచుటకు సాక్షియు, దేవుని చేరుటకు మార్గమును కావలసి వచ్చెను. భ్ర్రష్టులైన మనుష్యులను వారి పాపము నుండి రక్షించుటకు, దేవుని వద్ద నుండి అనేక ప్రవక్తలు పంప బడిరి. వీరు దైవ జనులు. మనుష్యులను పాపము నుండి విమోచన నొందించుటకు, ఈ ప్రవక్తలు దేవుని గూర్చియు, జ్ఞానమును గూర్చియు ప్రబోధించు చుండిరి. <br /><br />ప్రబోధ (దేవుడు) :-<br /><br /> యెహోవాయే దేవుడు. అద్వితీయ దేవుడు (కీర్తన 86:8), లోకమును, పరిపూర్ణతను సృష్టించెను (కీర్తన 89:11). మనుష్యుని నివాస స్థలము దేవుడే (కీర్తన 90:1). యుగయుగములకు యెహోవాయే దేవుడు (కీర్తన 90:2). దేవుడే అందరికి ఆశ్రయము (కీర్తన 91:9). సదాకాలము ఉన్నవాడు దేవుడే (కీర్తన 93:2). <br /><br /><br /><br />ప్రబోధ (జ్ఞానము) :- <br /><br /> ''నా (దేవుని) మాటలన్నియు నీతి కలవి (దేవుని నీతి). అవి అన్నియు అవివేకికి తేటగాను, తెలివి నొందిన వానికి యదార్ధముగాను నున్నవి ''(సామెత 8:8-9). ''నీతి మరణము నుండి రక్షించును. యదార్ధవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము'' (సామెత 11:4,5,30). ''నీతిమంతుల వెలుగు తేజరిల్లును'' (సామెత 13:9). ''నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' (సామెత 4:18). ''నీతిని అనుసరించు వానిని దేవుడు ప్రేమించును '' (సామెత 15:9). ''నీతి మార్గము నందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు'' (సామెత 12:28). సత్యవాదులు నీతిగల మాటలు పలుకుదురు (సామెత 12:17). ''నీతిమంతులు ఆశించినది వారికి దొరకును. నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును'' (సామెత 10:24,28,31).<br /><br /> నీతిమంతులు జ్ఞానమును కలిగి యుందురు. దేవుని మాటలు విని, అంగీకరించి, ఆజ్ఞలను విని అంగీకరించి, దాచుకొను వారు ధన్యులు. యెహోవా జ్ఞానమును గూర్చి యీలాగు చెప్పెను. '' నా కుమారుడా, నీవు నామాటల నంగీకరించి, నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనుము. జ్ఞానమునకు నీ చెవినొగ్గి హృదయ పూర్వకముగా వివేచన నభ్యసించిన యెడల దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నీతి మంతుల ప్రవర్తనలను అనుసరించుచుందువు'' (సామెత 21:5,19,20). ''దయను సత్యమును ఎన్నడును నిన్ను విడచి పోనీయకుము. స్వబుద్ధిని ఆధారముగా చేసికొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము'' (సామెత 3:3-5). జ్ఞానమును విడువక ఉండిన అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన యెడల అదినిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించు కొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.<br /><br /> ఈ విధముగా పాతనిబంధన కాలమందున్న జనులకు దైవజనులైన ప్రవక్తలు సందేశము లిచ్చు చుండిరి. కాని ఇవన్నియు భక్తి, విశ్వాసములను పెంచునవే కాని, వారికి జ్ఞానోదయము కలుగుట లేదు. అందువలన దైవమైన యెహావా మరేదైనా ప్రణాళికను ఏర్పరచ వలసి వచ్చినది. ఇంకను దైవము వైపు మరలని పాపులు, అన్యజనులు మిక్కిలిగా నుండిరి. అద్వితీయుడైన యెహోవా ఒక్కడే దేవుడని విశ్వసించక అన్యదేవతల విగ్రహములను ఆరాధించు చుండిరి. అజ్ఞానమును కొంతయైనను బాపుటకు యెహోవా తన ఆజ్ఞలను మోషె ద్వారా ఈ విధముగా ప్రకటించెను (నిర్గమకాండ 20:1-17). <br /><br />దేవుని ఆజ్ఞలు :- <br /><br />1.నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీతండ్రిని , తల్లిని సన్మానించుము.<br /><br />2.నర హత్య చేయకూడదు.<br /><br />3.వ్యభిచరించ కూడదు.<br /><br />4.దొంగిల కూడదు.<br /><br />5.నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకకూడదు.<br /><br />6. నీ పొరుగు వాని యిల్లు ఆశింపకూడదు.<br /><br />7. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, దాసుడనైనను, అతని యెద్దునైనను, అతిని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు.<br /><br />8. దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని(శరీరావయవములకును పాపమునకును దాసుడైన శరీరానుసారుడే ఐగుప్తదేశము).<br /><br />9.నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.<br /><br />10. యే యితర రూపముల విగ్రహారాధన చేయక నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడునై యున్నాను.<br /><br />యేసు క్రీస్తు - యోహాను:<br /><br /> ''యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను.'' (మత్తయి 11:13). ప్రాచీన కాలము అనగా ''యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలును ఉండిరి, అప్పుటి నుండి దేవుని రాజ్యసువార్త ప్రకటించ బడుచున్నది.'' (లూకా 16:16).<br /><br /> అయినను ఈ కాలమంతయు అజ్ఞాన కాలమయ్యెను. మనుష్యులు వారి ప్రాచీన స్వభావమును వీడి జ్ఞానము నొందకుండిరి. అందువలన యెహోవా అన్యజనులైనను, అవిశ్వాసులైనను, విశ్వాసులైనను అందరికిని దేవుని వాక్యము అందునట్లు యోచించెను. తనకు ప్రతినిధిగా దైవ కుమారుడైన యేసు క్రీస్తు అను నరుని పంపెను. ఇతను తన వలెనె సత్య స్వరూపమై ఉండెను. జ్ఞానమును పొందుటకు అచంచల మార్గమును బోధించుటకు తన జీవితమునే మార్గముగా చూపెను. నరుడు దేవుడగుటకు ప్రేమ మార్గమును చూపెను. యెహోవా దేవునిగాను, తండ్రిగాను ఉండి కుమారునికి సర్వాధికారమిచ్చెను. తండ్రి అదృశ్యుడు, దైవకుమారుడు నరుని వలె గోచరించును. ఈ కుమారుడు దైవాంశ సంభూతుడగుటచే సత్యమును నిత్యజీవమును అయి ఉన్నాడు మరియు వెలుగై ఉన్నాడు. <br /><br /> నరుని రూపములో నున్న దైవమే యీ కుమారుడు. ఇతడే యేసు క్రీస్తు. అదృశ్యుడైన తండ్రి కార్యమును నెరవేర్చుటకు ఈ యేసు ప్రభువు అను నరుని మార్గముగా చేసెను. అయినను ఈ అజ్ఞానులైన మనుష్యులు వారి వంటి మనుష్యుడే అని భావించ వచ్చును కనుక, తండ్రియైన యెహోవా తన కుమారుని గురించి సాక్ష్యమిచ్చుటకు యోహాను అను మరొక నరుని ముందుగా పంపెను. ఆ నరుడు అందరి వంటి వాడు కాడు. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.<br /><br /> చైతన్య స్వరూపుడైన దేవుని మూలముగా వచ్చిన యోహాను అను జ్ఞాని, అజ్ఞానులైన మనుష్యులందరు నమ్మునట్లుగా ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. వెలుగే జ్ఞానమైనందున, నరులకు జ్ఞానము కలిగించగల దైవ కుమారుని గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. ఈ యోహాను కూడా దేవుని చైతన్యమును కలిగి ఉన్నందున అతడు అనుభవించుచున్న దానినే సాక్ష్యమిచ్చెను. వెలుగై ఉండలేదు కాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఎందుకనగా వెలుగు దైవము యొక్క లక్షణము. కాని దైవము అదృశ్యము. అందు వలన యోహాను వెలుగై ఉండలేదు కాని ఆ వెలుగును అనుభవించుచున్న జ్ఞాని గాను, సాక్షిగాను రావలసి వచ్చెను.<br /><br /> యేసుక్రీస్తునకును వాక్యమునకును భేదము లేదు. ఆ వాక్యమే శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దీనినే యోహాను తెలియజేయుచున్నాడు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు గనుక ముందటివాడాయెనని ఎలుగెత్తి చెప్పెను. వాక్యమెప్పుడును సర్వకాలములయందు ఉండును గాన, వాక్యమే యేసైనందున, ఆ యేసు శరీరధారిగా వెనుక వచ్చుచున్నను, దేవుని ఆత్మగా సనాతన పురుషుడై ఉన్నాడు. అందువలన ఆయన కంటె ప్రముఖులు లేరు. ఆయన నిత్యుడు, సర్వోన్నతుడు, సత్య స్వరూపుడు.<br /><br /> దేవుని, ఈ ఆత్మను తెలిసికొనుటయే జ్ఞానము. అజ్ఞానులు దేవుని ఆత్మను ఎరుగరు. అందుకే ఒక అనుభవ జ్ఞానియైన యోహాను వంటి సద్గురువు యొక్క సాక్ష్యము కావలసి వచ్చెను. ప్రవక్తలను పూర్వము జనులు కొంత వరకు నమ్ము చున్నందున, యోహాను అను ప్రవక్తను దేవుడు ఈ కార్యమునకు వినియోగించెను. అందు వలన యోహాను దైవ కుమారునికి సాక్ష్యమిచ్చెను. యేసుకు బాప్తిస్మము ఇచ్చుట ద్వారా అందరికి తెలియ పరచెను. <br /><br />బాప్తిస్మము :- <br /><br /> బాప్తిస్మము అనగా నూతన జన్మ. శరీరానుసారులైన వారు, తాను ఆత్మనే యని భావించుచు, శరీర సంబంధ క్రియలను చేయుటలో దుష్క్రియలు జరుపక సత్క్రియలనే జరుపుటను ఆత్మానుసార జీవనమందురు. ఈ ఆత్మానుసార జీవనము గడుపుటకు మనుష్యులకు దేవుని ఆజ్ఞానుసారులైన వారికి బోధ, పరిచర్యల ద్వారా ప్రవక్తలచే బాప్తిస్మము ఇచ్చుట సంప్రదాయము. బాప్తిస్మము పొందిన వారు పవిత్రజీవనము జరపుచు చివరకు పవిత్రులు గావలెను. ఈ పవిత్రతనొందిన పూర్ణ స్థితి యేసు క్రీస్తు స్థితి. కాని దైవ కుమారుడు ఇట్టి పూర్ణమైన స్థితిలోనే జన్మించెను. అందువలన ఆయనకు బాప్తిస్మము ఇవ్వవలసిన అవసరమే లేదు. అజ్ఞానము వలన, తల్లితండ్రుల వలన జన్మించిన వారు అపవిత్రులు. వీరికే బాప్తిస్మము ద్వారా నూతన జన్మ అవసరము. క్రీస్తు ఒక కన్యక గర్భము నుండి జన్మించిన తేజో రూపము. ఈయన పాపేచ్ఛ వలన జన్మించ లేదు, మరియు మంచి చెడుల ఫలితములను అనుభవించుటకు పుట్టలేదు. మనుష్యులను మరణము నుండి తప్పించ గల వెలుగై ఉండెను. ఇట్టి పవిత్ర జననమైన క్రీస్తుకు కన్యక గర్భము ఒక సంకేతము. అయినను, మనుష్యులకు ఆత్మానుసార జీవనమందు విశ్వాసము కొరకు, క్రీస్తుకు కూడా బాప్తిస్మము యివ్వబడెను.<br /><br /> ఈ విధముగా, ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా తన కార్యక్రమమును ప్రారంభించుటకు సామాన్యుని వలె బాప్తిస్మము నొందెను.<br /><br />రక్షణ : ఆదాము సంతానములైన వారు అన్యజనులు, అవిశ్వాసులు, విశ్వాసులు మొదలుగా గలరు. వారికి కలిగిన మరణము నుండియు మరియు వారి మంచి చెడు క్రియలకు తగిన ఫలితమును అనుభవించ వలసిన తీర్పు నుండియు వారు రక్షణ నొందుటకు యేసుక్రీస్తు దిగి వచ్చెను. తానే మార్గమై ఆయనను సాదృశ్యపరచుకొనుచు, మనలను ఆయనతో ఐక్యత పరచుకొనమని బోధించెను. ప్రేమ మార్గమును చూపెను. జ్ఞానమును ప్రవచింపజేసెను. సిలువపై క్రీస్తుగా మరణించి, యేసుగా పునరుత్థానమైన విధమును గ్రహించి మనలను అట్లు ఐక్యత పరచుకొనమనెను.<br /><br /> శరీరానుసారులు ఆత్మానుసార జీవితమునకు మారవలెనని బోధించి, ఆత్మయే నడిపించుచున్నదన్న విశ్వాసము నొందమనెను. ఆ విశ్వాసము హృదయపూర్వకము కావలెనని ప్రబోధ చేసెను.<br /><br />క్రీస్తు : ఆత్మానుసార జీవనమునకు ఫలితము క్రీస్తుగా మారుట. క్రీస్తుగా మారిన వారికి ధర్మశాస్త్రము వర్తించదు. ఎందుకనగా ''విశ్వసించు ప్రతివానికి నీతి (దైవనీతి) కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు'' (రోమా 10:4). క్రీస్తైన వారు మరణమునకు తీర్పుతీర్చబడరు మరియు క్రీస్తుయేసు లోనికి ప్రవేశింతురు. ప్రభువైన యేసు అట్టివారిని తనలో చేర్చుకొనును. <br /><br />క్రీస్తుయేసు - యేసుక్రీస్తు : సాధన చేత క్రీసుయేసుగా నున్న వారు యేసునందు చేర్చుకొన బడగా, క్రీస్తుయేసే యేసుక్రీస్తని ఒకే ఒక్క ఐక్యత స్థితిని కలిగియుందురు. <br /><br />పరిశుద్ధాత్మ : యెహోవా పరిశుద్ధాత్మ. యేసు ప్రభువునకును, తండ్రికిని బేధము లేనందు వలన యేసు కూడా పరిశుద్ధాత్మయే. సాధకుడు యేసునందు ఐక్యత స్థితిని పొందుట వలన, అతడు కూడా పరిశుద్ధాత్మయే. ఈ విధముగా తండ్రియు, కుమారుడును, సాధకుడును పరిశుద్ధాత్మగా ఒక్కటే. దీనిని త్రిత్వమందురు.<br /><br />పరలోకరాజ్యము : పరలోక రాజ్యనివాసమనగా యెహోవా యొక్క ఆదిమూల స్థితి, యేసు ద్వారా తండ్రి స్థితిని పొందిన సాధకుడు పరిశుద్ధాత్మగా సంచకరువు ముద్ర నొందును. యేసు రెండవ రాకడ భూమిపైగాక సాధకుని హృదయములో జరుగును. సంచరువు ముద్రనొందిన వారికి పరలోక రాజ్యనివాసము శాశ్వతమగును. <br /><br />బాల యేసు : క్రీస్తు పశువుల పాకలో జన్మించెను. పాక అనగా శరీరము. పశువులు అనగా తమోగుణము, రజోగుణము, సత్వగుణము అను మూడు గుణములు. పాకలోని పరిసరములు మలమూత్రములతో కూడినదియు, మేయ వలసిన గడ్డి, త్రొక్కివేసిన గడ్డితో కూడి యుండును. అటులనే ఈ పాక అను శరీరమందు కూడా తినుచున్న ఆహారము, జీర్ణమైన ఆహారము, మల మూత్రములు, రక్తమాంసములు, ఎముక మూలిగలు, శుక్ల శోణితములు మొదలగునవి ఉండును. ఈ శరీరమునకు ఆధారమైన జీవము ఆత్మకు స్ధానము. అనగా భ్రూమధ్యము లేక భ్రుకుటి. అక్కడ నుండి, ఈ శరీరమునకు కావలసిన చైతన్యమయిన వెలుగును, అన్ని అవయవములకును ఇంద్రియములకును హృదయస్ధానము నుంచి అందించ బడుచున్నది. ఈ వెలుగే బాలయేసు. ఈ బాలయేసు జన్మించడమనగా పరిశుద్థాత్మ శరీరమును ధరించి జీవుల రక్షణ, మార్గదర్శమునకై క్రీస్తుగా జననము. మానవులలో క్రీస్తు జననమనగా నూతన జన్మ. ఇదియే ఆత్మానుసారుల లక్ష్యము. ఈ లక్ష్యమునకు, అనగా బాలయేసు జననమునకు త్రోవ చూపు నక్షత్రము, ఆత్మానుసారులకు మార్గమై, వెలుగై ఉన్నది. ఇట్లు స్వయం ప్రకాశము అందరి యందు వ్యాపకముగా సమిష్టిని రక్షించు యేసై ఉన్నది. క్రీస్తు యేసునందు లేపబడిన సాధకులు ప్రభువైన యేసు సాదృశ్యముగా పరిచర్యను చేయుచు యేసు వలన ఈ వెలుగును ఏడు దీపముల ద్వారా ఏడుస్థానములందలి వెలుగును గుర్తింప జేయుచు, యేడు అజ్ఞాన ఆవరణములను దాటించును. ఏడు బూరల ధ్వనిని గుర్తిరచుచు యదార్ధమైన సత్యమును చూపించును. పరలోక సామ్రాజ్యమునందు యెహోవా లేక తండ్రి స్థితియందు ఉదయించిన యేసుగా,అనగా కడపటివాడుగా, అనగా ఒకే జన్మ, ఒకే మరణముగా సుస్థిర స్ధానము నందును. అనాహత శబ్ధమైన దేవుని వాక్యమును చేర్చును. అనగా ఏడు జ్ఞాన భూమికలను దాటించును. ఈ సాధనా ప్రయాణమునకు వెలుగు నిచ్చునది భ్రుృకుటి వద్ద సమీకరించ బడిన పరిశుద్థాత్మనుండి వ్యాపించిన ప్రకాశము. అది పశువుల పాకలో జన్మించిన బాల యేసుగా పిలువ బడుచు పూజింపబడుచున్నది. <br /><br /> జ్ఞానులైన వారు ఒంటెను వాహనముగా చేసికొని పరలోకమును స్ధిరపరచెడి నక్షత్రము చూపించిన మార్గములో ప్రయాణము చేసిరి. చివరకు పశువుల పాకలో జన్మించిన క్రీస్తును దర్శించిరి. అనగా ఏడవ జ్ఞాన భూమిక దాటుచున్న సాధకులు వారియొక్క భ్రుకుటి స్ధానమందు బాల యేసును దర్శించిరి. ఒంటె వాహనమనగా ఒంటె వలె పై చూపుతో పరలోకమనెడి దైవమును దర్శించుట. ఒంటె వలె ఎండ వానలను, ఉష్ణ శీతలములను ఓర్చుకొనుటయు మరియు ఎన్ని దినములకైనను ఆకలి దప్పికలులేక జీవించగలుగుట. సాధకులు ఒంటె వలె, సర్వకాల సర్వావస్థల యందు శరీర, లోక విషయములను విస్మరించుచు, ఓర్చుకొనుచు పరిశుద్థాత్మ అనెడు లక్ష్యమును చేరుట యందు మాత్రమే ధ్యాస యుంచుకొందురు. అందువలన సత్యమైన నేను అనెడు వెలుగు అయిన చూపు (మార్గము) ద్వారా లోకమను ఎడారిని (జీవ భావమును) దాటి ఒయాసిస్సు వంటి నిత్యజీవమును జేరి ఈ జ్ఞానులు అనుభవపూర్వకముగా వారి యందే దర్శించిరి. జీవజలముతో సమానమైన బాలయేసు దర్శనముతో సంతుష్టిచెందిరి. అనేక కానుకలు సమర్పించిరి, అనగా వారి అజ్ఞాన సంబంధమైన దాని నుండి సంపూర్ణముగా విడుదల పొందిరి. <br /><br /> ఆమెన్!</b></span></div>
<div style="text-align: justify;">
<span style="font-size: large;"><b><br /><br /><br /> అనుభందము <br /><br /> భక్తి టి.వి ఛానల్ నందు 13.02.2008 మధ్యాహ్నము బైబిల్ వాక్యములు వివరించబడినది. మంచి వాక్యములే తెలుపబడినవి. '' ఒక చెంప మీద కొట్టిన రెండవ చెంప చూపించ వలెను.'' అని సెలవిచ్చిరి. సామాన్య జనులకు అంతటి ఓర్పు కలుగుటకు ఏమి చేయవలెనో, దానిని కూడా వివరించినచో బాగుండెడిదని ఆలోచన మాకు కల్గినది. ఈ ఆలోచన నిద్రపోనీయక, అర్ధ రాత్రి లేచి కూర్చునేటట్లు చేసినది నూతన నిబంధన గ్రంధమును పరిశీలించి, ప్రభువు యిచ్చిన స్ఫూర్తి తో మీకు తెలియజేయు వాక్యములు ఎంచుకొనిన తరువాతగాని శాంతి నొందలేదు. మరునాడు యీ వివరణను తయారు చేయుట జరిగినది.<br /><br /> ఈ లోకములో నిజమైన క్రీస్తు గా నున్న వారు అరుదు. దేవుని విషయములో అన్యజనులుగా నున్నవారే ఎక్కువ. మతావలంబకులు సంఖ్యలో ఎక్కువైననూ విశ్వాసములో తక్కువే. వీరు శరీరానుసారమే జీవించుచున్నారు. క్రమముగా వీరినడతను మార్చనిదే వీరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపు ఓర్పు, ధైర్యము పొంద జాలరు. విశ్వాసులు కానంత వరకు వీరు అన్యజనులే.<br /><br /> అన్యజనులనగా '' జారత్వము, అపవిత్రత, లోభత్వము కలిగినవారు. కృతజ్ఞతా వచనములు ఉచ్ఛరించనివారు. పోకిరి మాటలు , సరసోక్తులు ఉచ్ఛరించువారు. తగవు, వ్యభిచారము, విగ్రహారాధన చేయువారు '' ( ఎఫెసీ 5.38) జారత్వమనగా మంచితనము నుండియు దేవుని చిత్త ప్రకారము నడచుకొనుట నుండియు చెడువైపుకు జారిపోయినవారు. అపవిత్రత అనగా దేవునికి వ్యతిరేకముగా సైతాను సంబంధముగా నుండుట. లోభత్వమనగా తనకు కలిగిన దానిని ఇతరుల మేలుకొరకు ఉపయోగించని మనస్సు కలవారు, వీరు శరీరేచ్ఛతో, పాపేచ్చతో స్వార్ధపరులై యుందురు.<br /><br /> '' అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడినవారు, నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే మోహము, కాముకత్వమునకు అప్పగించుకొనువారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించి అజ్ఞానము వలన (దేవుని) మరచిన వారైయున్నారు. (ఎఫెసీ 4. 18-24)<br /><br /> మోహమనగా మూఢత్వము, సోమరితనము. కాముకత్వము అనగా కోరికలను పెంచుకొనుచు, తృప్తి లేక అశాంతితో జీవించుట. వీరు మూఢ విశ్వాసులై యుండి, స్వార్ధము, దురాశ వలన వారి శరీర సుఖములకై ప్రయాస పడుచుందురు. వీరు పూర్తిగా శరీరానుసారులే.<br /><br /> ''శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.'' (యోహాను 3. 6-8 ) కనుక శరీర మూలముగా జన్మించిన వారందరు క్రొత్తగా జన్మించవలెను మరియు ఆ దినము నుండి ఆత్మానుసారముగా జీవించవలెను.<br /><br /> ''శరీరానుసారులు శరీర విషయములు మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మవిషయము మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై యున్నది.'' (రోమా 8. 5-14 ) <br /><br /> ఈ వాక్యముల ద్వారా శరీరానుసారుడు ఆత్మానుసారుడి గా మారవలసి యున్నది. నిత్య జీవము లక్ష్యము కావలెను. ''తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తు వాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంటను కోయును.'' (గలతీ 6.7,8 )<br /><br /> <br /><br /><br /><br /> <br /><br /><br /><br /> క్షయము అనగా క్షీణించి నశింపజేయు మరణమునకు తీర్పు. అక్షయ మనగా దేవుని ఆత్మచే ధరింపబడు మనుష్యుని ఆత్మ. శరీరము సత్యమనుకొనినచో ఈ ఆత్మ 'డేరా' వంటి శరీరమను వస్త్రమును ధరించుకొనును. శరీరము నశించును కనుక అది క్షయము. ఆత్మయే నడిపించుచున్నదని శరీర భావన విడచినచో ఆత్మ శరీరమను వస్త్రమును విడచి దిగంబర ఆత్మయగును. వెనువెంటనే ఈ దిగంబరాత్మ దేవుని ఆత్మను ధరించు కొనును. అప్పుడది పరిశుద్ధాత్మ యగును. అపుడు ఈ ఆత్మ అక్షయమైన నిత్య జీవముగా నుండును. <br /><br /> శరీరము మానవ నిర్మిత గుడారము. ఆత్మ దేవునిచే నిర్మించబడిన శాశ్వత నివాసము. భూమి మీద '' మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయిననూ (నరుని) చేత పని కాక దేవుని చేత కట్ట బడినదియు, నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. (2 కొరంథీ 5.1 )<br /><br /> '' పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై (దిగంబరాత్మపై) ధరించుకొన అపేక్షించుచు దీనిలో (శరీరములో) మూల్గు చున్నాము.'' ( 2 కొరంథీ 5.2 )<br /><br /> శరీర మనగా బాహ్య పురుషుడు, మనుష్యాత్మ అనగా ఆంతర్యపురుషుడు. <br /><br /> ''బాహ్యపురుషుడు కృశించుచున్ననూ, ఆంతర్యపురుషుడు దినదినమూ నూతన పరచబడుచున్నాడు.''<br /><br /> (2 కొరంథీ 4.16)<br /><br /> బాహ్యపురుషుడుగా వ్యవహరించుచున్న శరీరము రక్తమాంసములతోనూ, ఎముక మూలిగలతోనూ నిర్మించబడియున్నది. ఇది మనుష్యుని చేతి పనిగానే నిర్మితమైనది.<br /><br /> ఇది పుట్టినట్లు కనబడి, పెరిగి, కృశించి, నశించుచున్నది. అందువలన ఇది అనిత్యము, క్షయము. <br /><br /> అటులనే ప్రాణమును పోవును. ఇది కూడా అనిత్యమే కాని ఆంతర్యపురుషునిగా నున్న ఆత్మ అక్షయము, నిత్యము. ఇది మార్పు చెందక నిత్య నూతనముగా నుండును. ఇట్టి నిత్య జీవమును పొందవలెననిన శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జీవించవలెను.<br /><br /> బాహ్యపురుషుడు అనబడు యీ శరీరము, తన యింద్రియముల ద్వారా మంచి చెడు పనులను చేయుచూ, తగిన ఫలితములను పొందుచున్నది మరియు మరణము నకు తీర్పు తెచ్చుకొనుచున్నది. ఆంతర్య పురుషుడు ఎప్పుడును మేలు క్రియలను చేయమనియే ప్రేరేపించును. కీడు చేయవద్దని అనుకొనును కానీ, స్వార్ధముతో మేలు క్రియలు చేయక చేయవద్దనుకొనిన కీడునే చేయునది మనలోనే నివశించు పాపము. ఆంతర్యపురుషుని మాట విననిదేదో మనలో నివశించుచున్నది. దాని పేరే పాపము.<br /><br /> '' మేలైనది చేయవలెననెడి కోరిక నాకు కలుగుచున్నదిగాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయ గోరు మేలు చేయక , చేయ గోరని కీడు చేయుచున్నాను. నేను కోరన దానిని చేసిన యెడల దానిని చేయునది నాయందు నివశించు పాపము గాని , నేను కాదు''. ( రోమా 7.17-20 )<br /><br /> నేను అని పిలువబడువాడు ఆంతర్యపురుషుడు. నేను యిచ్ఛయించనివి చేయువాడు పాపేచ్ఛ వలన, తన ఇంద్రియముల ద్వారా బాహ్యపురుషుడే జరుపుచున్నాడు. '' వేరొక నియమము ( పాప నియమము)నా అవయవములలోనున్నట్లు కనబడుచున్నది. అది నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది.<br /><br /><br /><br /> మనస్సు విషయములో దైవ నియమము నకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడై యున్నాను''. (రోమా 7.22-25 )<br /><br /> కనుక ఆంతర్య పురుషుడైన నేను ఆత్మను, కాని బాహ్య పురుషుడిగా వ్యవహరించుచున్న నేను పాపనియమమునకు లోబడి మంచి చెడు పనులకు తగిన ఫలితములు అనుభవించుచు, మరణమును పొందుచున్నాను. కనుక శరీరము నేను అను భావమునుండి విడుదల పొందవలెను. దీని కొరకు ఆత్మానుసారముగా జీవించవలెను మరియు ఆంతర్య పురుషునిగా అనుభవము పొందవలెను. అప్పుడే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూప గలడు. శరీరానుసారుడు ఆవిధంగా చేయలేడు. ఇట్టి మార్పు కొరకును ఆత్మానుసారమునైన జీవనము కొరకు, క్రీస్తు మార్గమే శరణ్యము. క్రీస్తు యేసు సాదృశ్యమైన మార్గము ప్రేమ మార్గము. దీనికి సహనము, ఓర్పు, ప్రేమ, నిరీక్షణ అవసరము. క్రీస్తు ప్రేమికులు శత్రువునైనను శిక్షించ పూనుకొనినచో వాడు తిరిగి శరీరానుసారమైన క్రియ చేసిన వాడగును. <br /><br /> అందువలన ''ఎదిరించు వారు తన మీదకు తామే శిక్ష తెచ్చు కొందురు.'' (రోమా 13.2 ) <br /><br /> అను వాక్యానుసారము మరల మరణమునకు తీర్పు పొందును. <br /><br /> ''అందువలన ఒకనికొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చియుండవద్దు, మరి యే ఆజ్ఞ అయినను ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెనను వాక్యములో సంక్షేపముగా యిమిడి ఉన్నది. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. ( రోమా 13.8-10)<br /><br /> క్రీస్తైన వాడే అట్లు ప్రేమించగలడు. కనుక క్రీస్తుగా మారుటకు యత్నించవలెను. దీనికి మార్గమేమనగా <br /><br /> 1. ''జీవము గల దేవుని వైపునకు తిరుగవలెను.'' (అపొ.కా 14.15 )<br /><br /> 2. ''విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్ధమైన హృదయముతో మనము దేవుని <br /><br /> సన్నిధానమునకు చేరుదము'' ( హెబ్రి 10.22 )<br /><br /> 3. ''మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించ <br /><br /> బడినది.'' (రోమా 5. 1-5)<br /><br /> 4. ''నీ దేవుడైన ప్రభువున నీ పూర్ణ హృదయము తోనూ, నీ పూర్ణ మనస్సు తోనూ, నీ పూర్ణశక్తితోనూ, <br /><br /> నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను.'' (లూకా 10.27 )<br /><br /> 5. క్రీస్తు యేసు తాను శిలువ వేయబడి అవమానింపబడి బాధింప బడినప్పుడు క్రీస్తు గా <br /><br /> మరణించబోవు సమయమున, తనను హింసించు వారి కొరకు ఈ లాగున ప్రార్ధించెను.<br /><br /> '' తండ్రీ.. వీరు ఏమి చేయు చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపు'' మనెను. ( లూకా 6.5 ) <br /><br /> అట్టి ప్రేమను మనమునూ శత్రువుల యెడ చూపవలెను. అప్పుడు మాత్రమే ఒక చెంప మీద కొట్టిన రెండవ చెంప చూప వీలగును.<br /><br /> '' ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము.''(రోమా 6.5) <br /><br /> ఇట్టి ఐక్యతే మన లక్ష్యము. దీనిని సాధించుటయే మన అంతిమ గమ్యము. క్రీస్తు గా మారిన వాడు <br /><br /> క్రీస్తు యేసు మార్గమైన ప్రేమ వలన తన యొక్క క్రీస్తు స్థితినే అందరిలోను చూడగలడు. ఎందుకనగా <br /><br /> ''క్రీస్తే సర్వము మరియు ఆ క్రీస్తే అందరిలోనున్న వాడై యున్నాడు.'' ( కొలస్సి 3.11 )<br /><br /><br /><br /> అట్టి క్రీస్తు స్థితి అనుభవించు వానికి శరీరానుసారమైన భేదములు కనిపించవు. క్రీస్తు చైతన్యమే సర్వమూ నిండియున్నట్లు కనిపించును. మన వెలుపల, లోపల ఆ క్రీస్తు చైతన్యమే యున్నది.<br /><br /> '' మనము ఆయన యందు బ్రతుకు చున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము.''<br /><br /> (అ.పొ.కా. 17.28 )<br /><br /> ''ఆయన మనలో ఎవరికిని దూరముగా నున్నవాడు కాదు.'' (అ.పొ.కా. 17.27 )<br /><br /> వాక్యమే దేవుడు కనుకను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. కనుక ఆయన దేవుని వాక్యముగా నుండెను. ఆ దేవుని వాక్యము సజీవమై ....... ప్రాణములను, కీళ్ళను, మూలిగను విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.'' (హెబ్రి 4.12 ) <br /><br /> ''మనము యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువ బడిన వారము.'' (యూదా 1.1 )<br /><br />అందువలన మనము క్రీస్తు యేసు నందు ప్రవేశింతుము. ఎందుకనగా<br /><br /> '' దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరె యెంచు కొనుడి.''<br /><br /> (రోమా 6.11)<br /><br />అని వాక్యము మరియు '' తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.''<br /><br /> (యోహాను 4.23)<br /><br /> ''పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా నుండెదరు. (మత్తయి 5.48)<br /><br />అందువలన క్రీస్తు యేసు నందు ప్రవేశించినవాడు ఆయన యందు చేర్చుకోబడును.<br /><br /> '' నేను మిమ్మును చేర్చుకొందును.'' (2 కొరింథి 6.18) అని దేవుని వాక్యము. అట్టివారు ఆయన పునరుత్థానములో ఐక్యత పొందిన వారగుదురు. వారికి సంచకరువు ముద్ర వేయబడి, పరలోక రాజ్యమందు వారికి శాశ్వత నివాసము యేర్పాటు జరుగును.<br /><br /> లక్ష్యము, గమ్యము మరియు శరీరాత్మల భేదములను వివరించనిదే మనుష్యుడు తాను మారుటకు ప్రయత్నించడు కదా.. అందువలన మీరు ప్రవచించిన వాక్యము పైవిధముగా స్ఫూర్తి నిచ్చుటకు మీ ద్వారా ప్రభువు కృపావరము మాయందు కలిగినది. ఇట్లు సంభవించుట అను అదృష్టమునకు మీరే కారణమైనందున మీకు అనేకముగా వందనములు తెలియజేయుచున్నాము.</b></span></div>
<div style="text-align: justify;">
<br />
<br />
<span style="font-size: large;"><b><br /></b></span></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-9528385537293491162014-02-28T05:31:00.001-08:002014-02-28T05:31:19.160-08:0019. అదృష్టవంతులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;">19. అదృష్టవంతులు<br /><br /> అదృష్టవంతులైన మీరు ఏమి చేయవలెను? ''తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేప బడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన యెడల ఆయన పునరుత్థాన సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై యుందుము.''(రోమా 6:4,5) ''కనుక దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్ములను మీరే యెంచు కొనుడి.''(రోమా 6:11)<br /><br /> ''దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువ బడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని యెరుగుదుము. వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ఱయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చెను. ఎవరిని నీతి మంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను'' (రోమా 8:28-30). ''మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు.'' (అపొ.కా.1:5,8).<br /><br /> ''మీ యొద్ద నుండి పరలోకమున చేర్చుకొన బడిన యీ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఆయనతో చెప్పెను'' (అపొ.కా.1:11). యేసు యొక్క యీ రాకడ పరిశుద్ధాత్ములైన వారికి పరలోక రాజ్య నివాసమును సిద్ధము చేయును. <br /><br /> ''ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము'' (2కొరింధి 6:2). ''మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడచుకొను నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించు కొనుడి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి యెల్లప్పుడును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి'' (ఎఫెసి 5:15-17,19-21).<br /><br /> ''తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానము, విశ్వాసముతో కూడిన ప్రేమయు, సహోదరులకు కలుగును గాక! మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికి కృప కలుగును గాక!'' (ఎఫెసి 6:23-24).<br /><br />ఆమెన్ !</span> </div>
<div style="text-align: justify;">
<span style="font-size: large;"><br /><br /><br /><br /><br /></span></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-37912725458238026492014-02-28T05:27:00.002-08:002014-02-28T05:27:38.787-08:0018. కొండ మీద ప్రసంగము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;">18. కొండ మీద ప్రసంగము</span><br /><br /><span style="font-size: large;"> ''యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతివ్యాధిని, రోగమును స్వస్ధపరచుచు గలిలయ యందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్ధపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేేము, యూదయయను ప్రదేశముల నుండియు యోర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.'' </span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః </span><br /><br /><span style="font-size: large;">సమాజ మందిరమనగా ఇంద్రియములతో కూడిన దేహము. మందిరములలో బోధించుట అనగా పరిశుద్థ పరచబడిన హృదయములందు నాటుకొనునట్లు బోధించుట. దేవునిరాజ్యమనగా సర్వవ్యాపకమైన పరిశుద్ధాత్మ. సువార్తయనగా దేవునివాక్యము. వాక్యమే దేవుడు కనుక, సువార్తను ప్రకటించుటయనగా దేవుని ప్రతిష్టించుకొనుట. వ్యాధి అనగా సాతాను ప్రేరణకులోబడుట. రోగమనగా దాని వలన కలిగిన మంచి చెడులకును, మరణమునకు తీర్పు తెచ్చుకొనుట. స్వస్థపరచుటయనగా మరణము నుండి రక్షణనొందుట. గలిలయయనగా అంతఃకరణము, ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించెను అనగా ఆయన ఆత్మ అందరిలోను, అంతటా వ్యాపించియుండెను. అనగా క్రీస్తు చైతన్యము వ్యాపకమయ్యెను. నానావిధములైన రోగములనగా సుఖదుఃఖములలోను డచిీడవరికి మరణించుటలోనూ పీడింపబడుట. వ్యాధిగ్రస్తులనగా శరీరానుసారులు. దయ్యము పట్టినవారనగా సాతాను వలన భ్రష్టులైనవారు.చాంద్రరోగులనగా మనస్సాక్షి లేనివారు. పక్షవాయువుగలవారనగా ప్రాచీన స్వభావముకలిగిన ఆదాము సంతానము నుండి సంక్రమించిన శరీరానుసారులు. గలిలయ, దెకపొలి, యెరూషలేేము, యూదయయను దేశములు అనగా అంతఃకరణము మరియు ఇంద్రియములు సంచరించుచోటు. యెర్దాను(నది)కి అవతలనుండి యనగా అంతఃకరణ వ్యవహహారప్రవాహమునకు ఆవలనున్న అని అర్ధము. దేవదూతలు అనగా ఇంద్రియాధిష్ఠాన దేవతలు. బహుజనసమూహములు అనగా అనేక విధములైన శరీరానుసారులును, అవిశ్వాసులును, విశ్వాసులును, క్రీస్తుగా మారు మనస్సు నొందినవారును ఆయనను వెంబడించెను.అనగా దేవుని వాక్యనుసారము క్రీస్తు యేసును వెంబడించిరి. </span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః </span><br /><br /><span style="font-size: large;"> ఇంద్రియములతో గూడిన శరీరము నందున్నట్టి హృదయము నందునాటుకొనునట్లు బోధించుచు, సర్వవ్యాపకమైన పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానమును సువార్తగా ప్రకటించుచు, వారి హృదయములలో దేవుని ప్రతిష్ఠింపజేయుచుండెను.సాతాను ప్రేరణకు లోబడి మంచి చెడు పనులు చేయుట వలన వారికి కలిగిన సుఖ దుఃఖ ఫలితములతోను,మరణముతోను పీడింపబడుచున్నవారికి రక్షణ నొసంగుచుండెను. నరుల అంతఃకరణములందున్న ఆంతర్య పురుషులందరిలోను ఆయన దేవుని ఆత్మగా వ్యాపించుచుండెను. అట్టి వ్యాపించియున్నట్టి క్రీస్తు చైతన్యము ద్వారా రక్షణనొందు నిమిత్తము, అనేకులు వెంబడించసాగిరి. వారిలో సాతాను వలనభ్రష్టమైన వారును, మనస్సాక్షిలేనివారును, ఆజ్ఞాతిక్రమణము వలన పాపులైన ఆదాముసంతానమును, ప్రాచీన స్వభావముగల శరీరానుసారలును గలరు. వీరేగాక, అవిశ్వాసులును, విశ్వాసులును, క్రీస్తుగా మారుమనస్సు నొందిన వారు కూడా ఆయనను దేవుని వాక్యానుసారము వెంబడించిరి.</span><br /><br /><span style="font-size: large;"> ''ఆయన జనసమూహములను చూచి కొండ యెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధించసాగెను.'' (మత్తయి 5ః1,2)</span><br /><br /><br /><br /><span style="font-size: large;">అర్ధముః</span><br /><br /><span style="font-size: large;"> ఆయన అనగా క్రీస్తు యేసు. జనసమూహమనగా శరీరానుసారులు,అవిశ్వాసులు,ఆత్మానుసారులు, మారుమనస్సు నొందినవారు. కొండయనగా దైవీస్థానమైన భ్రూమధ్యస్థానముయెక్కి కూర్చుండుట యనగా తన శరీర ఇంద్రియక్రియల నుండి భ్రూమధ్యమునకు యెక్కి తానైన ఆత్మస్థితిలో కూర్చుండుట.ఆయన శిష్యులనగా మారుమనస్సు నొంది,క్రీస్తును సాధించినవారు. నోరు తెరచి బోధించుట యనగా దైవప్రతినిధియైన క్రీస్తు యేసు మాట్లాడుటకు నోరుతెరువగా, తండ్రియే ఆ నోటి ద్వారా బోధించుట.</span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః</span><br /><br /><span style="font-size: large;"> క్రీస్తు యేసుగా నున్న ఆయన అన్యజనులు, అవిశ్వాసులు, ఆత్మానుసారులు, మారుమనస్సు నొందినవారు. మొదలగువారిని చూచి, తానైన ఆత్మస్థితికి యెక్కి కూర్చుండగా, మారుమనస్సు నొంది క్రీస్తుగా మారినట్టి శిష్యులు మాత్రము ఆయనకును మరియు ఆయన ఆత్మస్థితికిని సమీపముగా రాగలిగిరి. అప్పుడాయన శారీరకముగా నోరు తెరువగా, ఆనోటినుండి తన భ్రూమధ్యమందున్న దైవమే వాక్యానుసారము బోధింపసాగెను. కనుక కొండ మీద ప్రసంగమంతయు దేవుని ప్రత్యక్ష వాక్యము మరియు వేదప్రమాణము. దేవుని వాక్యము బహుజనులందరికినీ అందించబడినప్పటికిని, వారి వారిసాధనను బట్టి వారికవసరమైన మేరకు ఆవాక్యము వారి అంతరంగ పురుషునికి క్రీస్తు చైతన్యము ద్వారా అందించబడెను. అదృష్టవంతులు వారు ఉన్న స్థితి కంటే ఆపై స్థితిని సాధించుకొనుచున్నారు. </span><br /><br /><span style="font-size: large;">ప్రసంగముః</span><br /><br /><span style="font-size: large;"> ''ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది.'' (మత్తయి 5ః3)</span><br /><br /><span style="font-size: large;">అర్ధముః</span><br /><br /><span style="font-size: large;"> దీనత్వమనగా సిగ్గు అభిమానములను వదలి,పరులనుండి లోక సంబంధమైన వాని కొరకు యాచించుట. ఆత్మవిషయమై దీనుల అనగా, ఆత్మగా నుండుట కై మరియు పరిశుద్ధాత్మచే అభిషేకించ బడుటకు ఆయనను (దైవమును)అర్ధించుట, అందుకొరకై, శరీరాభిమానము నుండియు, ' నేను,నాది' అనుదాని నుండియు విమోచనము నొందుట. పరలోకరాజ్యమనగా నిత్యము,శాశ్వతమునై,తిరిగి మరణమునకు తీర్పులేకుండట. </span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః </span><br /><br /><span style="font-size: large;">లౌకిక విషయముల కొరకు గాక, ఆత్మానుభవము, కొరకుశరీరానుసారమైన వాటిని మరియు దేహభిమానమును విడచి, దేవుని కృపావరములకొరకు విశ్వాసముతోను, నిరీక్షణతోను అర్ధించుచు ఓర్పు,సహనములతో ఆ ప్రార్ధనను నిరంతరము కొనసాగించువారే ఆత్మవిషయమై దీనులు. వీరు ధన్యులు. ఎందుకనగా పరలోకరాజ్యము వారిదే, అనగా వారు నిత్యము, శాశ్వతము అయిన దైవస్వరూపులగుదురు మరియు మరణమునకు తీర్పు నుండి రక్షించబడుదురు.</span><br /><br /><span style="font-size: large;"> ''దుఃఖ పడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు'' (మత్తయి 5ః4)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః దుఃఖమనగా పశ్చాత్తాపము వలన జనించిన ఆర్తి. ఓదార్చబడుట అనగా పాపము నుండి విమోచనకొరకు రక్షణ.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః పాపేచ్ఛనుండి విడుదల పొందుచు, అంతకుముందు, వారు చేసిన మంచి చెడు క్రియలకు పశ్చాత్తాప పడుట వలన వీరు దేవుని అనుగ్రహమునకు పాత్రులగుదురు. అట్టి పశ్చాత్తాప జనకమైన దుఃఖమే దేవుని కొరకు తపనను. ఆర్తిని కలిగించును. వీరు ధన్యులు, ఎందుకనగా వీరు ఓదార్చబడుదురు. ఈ ఓదార్పు ఆత్మానుభవమునకు త్రోవయగును. శరీరానుసారులు పశ్చాత్తాపమువలన ఆత్మానుసారులగుదురు. తిరిగి శరీరానుసారమైన క్రియలు జరుపరు.అందువలన మారుమనస్సు నొందుదురు. దీనికి ఆయన అనుగ్రహము అవసరమైయున్నది. అట్టిదే ఓదార్పు.</span><br /><br /><span style="font-size: large;"> ''సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతత్రించుకొందురు''.(మత్తయి 5ః5)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః సాత్వికులనగా సత్వగుణ సంపన్నులును, దైవమునకు దాసులైయుండు వారును. భూలోకమును స్వతత్రించుకొనుట యనగా పాపము నుండియు, మరణమునకు తీర్పునుండియు విమోచన నొంది ఈ భూమిపైననే బంధములేక జీవించుట.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః తమస్సు వలన దేవుని మరచియుందురు.రజస్సు వలన సాతానుకులోబడి శరీరానుసారక్రియలు జరుపుచుందురు. సాత్వికమైనవారు దైవార్పణ భావముతో ఆత్మానుసారులగుదురు. </span><br /><br /><span style="font-size: large;"> కనుక సాధనచే,తమోగుణమును, రజోగుణమును అధిగమించినట్టి సాత్వికులు ధన్యులు. ఎందుకనగా వారు దైవానికిదాసులై ప్రవచనమును గైకొనుటకు సిద్ధపడియున్నారు. అట్టివారు ఇతరులకు సుఖశాంతులనొసంగుచూ, వారును సుఖశాంతులనొందుదురు.ఆత్మ సంబంధమైయుందురు. అందువలనవారికి శరీర, లోకసంబంధమైన వాటియందు ఆసక్తియుండదు. మనలనుచెరపట్టి బంధించువన్నియు శరీరానుసారమే. కాని వీరు ఆత్మానుసారులైైనందున బంధము నుండి విమోచనయై ఈభూలోకమును స్వతత్రించుకొందురు, అనగాదీర్ఘశాంతము నొందెదరు.</span><br /><br /><span style="font-size: large;"> ''నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు,వారు తృప్తిపరచబడుదురు''.(మత్తయి5ః6)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః నీతియనగా ధర్మశాస్త్రమునకు అతీతమగు దేవుని నీతి. ఆకలిదప్పులనగా ఆత్మానుసారముగా నుండి, ఆత్మానుభవము కొరకు తపన, తహ చెందుట, ఆకలియనగా నిరీక్షణ, దప్పికయనగా దేవుని వాక్యము వినవలెనను తహతహ, తృప్తి పరుచుటయనగా దేవుని ఆత్మచే అభిషేకించబడి తపనను చల్లార్చుట.</span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః సాధకుడైనవారు ఆత్మానుసారము జీవించుచు,ఆత్మానుభవము కొరకు తపనజెందుచు, </span><br /><br /><span style="font-size: large;"> దానికొరకు దేవుని సహాయమును పొందుటకు ప్రార్ధన చేయుదురు. వారు తీవ్రమైన ఆకలి,దప్పిక కలిగినప్పుడేలాగు అన్నపానములకై తపించుచుందురో, ఆలాగుననే క్రీన్తు యేసులోనికి ప్రవేశించుటకై తపనపడుదురు. అట్టివారు ధన్యులు. ఎందుకనగా వారు ఆయనయందు చేర్చుకొనబడుదురు. ఇదియే తృప్తిపరచబడుట.</span><br /><br /><span style="font-size: large;"> ''కనికరముగలవారు ధన్యులు,వారు కనికరము పొందుదురు.'' (మత్తయి 5ః7)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః కనికరము అనగా దీనులైనవారిపై కలుగునది. కనికరము పొందుట అనగా కనికరము కొరకు దీనులగుట.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః కనికరము సాత్వికముకంటే గొప్పది.కనికరము మనస్సులోనుండి జనించునదికాదు. </span><br /><br /><span style="font-size: large;"> దేవుని ప్రేమ వలన విశాలపరచబడిన అంత:కరణలో సహజముగా జనించునది కనికరము. శరీరానుసారమైన కారణములు లేకనే అందరునూ ఆత్మీయులేయను స్ధిరమైన భావన కలిగినచో దీనులైన శత్రవుల యందును కనికరము పుట్టును. ఇట్టి హృదయశుద్ధి కలవారు ఆత్మవిషయమై దీనులైనందువలన యేసు క్రీస్తు వారిని కనికరించి తనయందుజేర్చుకొనును. వారు ధన్యులు, కనుక కనికరమనునది క్రీస్తు లోనికి నడిపించును.ఆపై దయామయుడైన ప్రభువు వారిని తన యందు జేర్చుకొనుటవలన కనికరము చూపును.</span><br /><br /><span style="font-size: large;"> ''హృదయ శుద్ధిగలవారు ధన్యులు,వారు దేవుని చూచెదరు.'' (మత్తయ 5ః8)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః హృదయశుద్ధియనగా సంకుచితమైన అంతఃకరణను విశాల పరుచుకొనుట ద్వారా జరుగునది. దేవుని చూచుట యనగా ఆయనను ప్రత్యక్షతపరచుకొనుట.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః ధైర్యముతోను, శోధనతోను, ప్రేమతోను కూడిన ఆత్మానుసారమైన జీవితము వారియొక్క సంకుచితమైన అంతఃకరణ విశాల పరచబడును మరియు హృదయశుద్ధి జరుగును. అట్టివారు ధన్యులు. ఎందుకనగా వారు లోకసంబంధమైన, వాటినుండియు శరీరసంబంధమైన వాటినుండియు విమోచన పొందుదురు మరియు ఆత్మ సంబంధకులగుదురు. కనుక వారి పరిశుద్ధమైన హృదయములలో దైవము యొక్క ప్రత్యక్షతగలుగును. </span><br /><br /><span style="font-size: large;"> ''సమాధానపరచు వారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.'' (మత్తయ 5ః9)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః సమాధానమనగా దైవము విషయములోను, దైవసాక్షాత్కారమార్గములోను హృదయపూర్వకవిశ్వాసముగలిగి, దానిని సాధించుకొనుటకు కట్టుబడియుండుట.దేవుని కుమారులనగా, యేసుక్రీస్తును తండ్రి తనకుమారుడని ప్రకటించిన విధముగానే వారును ఆయనతో సమానముగా దేవుని కుమారులనబడుట. </span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః వారు శరీరానుసారముగాకాక, పరిశుద్ధాత్మలక్ష్యముగా ఆత్మానుసారముగా జీవించుచు,</span><br /><br /><span style="font-size: large;"> లక్ష్యముపై చెదరనిగురి కలిగియుందురు మరియు ప్రవచనానుసారము సాధన మార్గముపై ఎట్టి అనుమానములేని వారైయుందురు. ఈవిధమైన నిశ్చయముతో కట్టుబడియుండి నిరీక్షించుటయే సముధానము. వీరు ధన్యులు. ఎందుకనగా వీరు క్రీస్తుయేసునందు ప్రవేశించి, యేసుక్రీస్తునందు చేర్చుకొనబడుదురు. అప్పుడు వీరును ఆయన స్వరూపులై, ఆయనవలే దేవుని కుమారులనబడుదురు.</span><br /><br /><span style="font-size: large;"> ''నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.'' (మత్తయి 5ః10)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః నీతియనగా ధర్మశాస్త్రము వర్తించని అతీతమైన దేవుని నీతి.హింసింపబడుటయనగా క్రీస్తుగా మారుమనస్సునొందినప్పటికిని, పూర్వపుక్రియల వలన కలిగిన ఫలితములు యింకను బాధించుచుండుట. పరలోకరాజ్యమనగా శాశ్వత నివాసము మరియు మరణమునకు తీర్పులేని స్థితి.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః దేవుని నీతికి లోబడిన వారి క్రియలు దేవుని నిర్ణయానుసారముండునని వారికి </span><br /><br /><span style="font-size: large;"> తెలిసియుండుదురు.ఇక అవన్నియు వారి నిర్ణయములు ఎన్నటికినికావు గనుక, వారు చేయుపనులు మంచివి గాని, చెడ్డవిగాని, వారికి వర్తించవు. ఇట్టి స్థితిలో క్రీస్తు న్యాయస్థానమందున వారు తీర్పునుండి తప్పించబడిన వారైయుందురు. అయినను పూర్వము వారుచేసిన మంచి చెడు క్రియలు వారి వారి చిత్తములతోనే జరిపించబడుచుండును.వాని ఫలితములు వారిని హింసించుచునే యుండును. ఇట్టి హింసలు,వారిని క్రీస్తుస్థితి యందుండుటకు పరీక్షలని యెంచి,ఇదియును తమమంచికేయని ఊరకయుండువారును,ప్రతిచర్యజరుపుటకు సాతానువలన ప్రేరణ పొందనివారును ధన్యులు.ఎందుకనగా ఇట్టి స్థితిలో వారు శాశ్వతమైన పరలోకరాజ్యనివాసమునకు తగినవారై యుందురు మరియు హక్కుదారులై యుందురు.</span><br /><br /><span style="font-size: large;">''నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్లపలుకు నప్పుడు మీరు ధన్యులు; సంతోషించి,ఆనందించుడి,పరలోకమందు మీ ఫలము అధికమగును.ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.'' (మత్తయి 5:11,12) </span><br /><br /><span style="font-size: large;">అర్ధముఃనా నిమిత్తము అనగా దేవునిఆత్మను సాధించునిమిత్తము. జనులు అనగా సాతాను ప్రేరితజనులు. నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకుటయనగా విశ్వాసులను లోబరుచుకొనుటకై, వారినిహింసించుచు, దైవమార్గము అసత్యమని తెలుపుచు వెంబడించుట. సంతోషించి, ఆనందించుట యనగా, పూర్వపు మంచిచెడు క్రియల ఫలితములను అనుభవించుట ద్వారా,దేవుని చిత్తమును నెరవేర్చినవారై వారు విమోచనము నొందుచున్నారని సంతోషము. పరలోక మందు ఫలము అధికమగ అనగా,యిట్టి సాధన వారి క్రీస్తు స్థితి చెదరకుండునట్లు వారికిది పరీక్షయని యెంచుట మరియు ఇక వారి సాధన పురోగమించుట.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః దేవుని పరిశుద్ధాత్మచేత అభిషేకించబడుటకు సాధకుడుచేయు ప్రయత్నమునకు సాతాను వలన ప్రేరితులైన జనులు వారిని నిందించుచు, హింసించుచు, దైవమునకు వ్యతిరేకమైన సాక్ష్యములతో ప్రలోభపెట్టుచు,అడ్డుపడుచుందురు.ఇట్టివన్నియు తన హృదయపూర్వక విశ్వాసమునుండి చెదరకుండునట్లు తనను క్రీస్తు నందు ప్రతిష్టితమగుటకు పరీక్షలని యెంచుచుండవలెను. అట్టివారు స్థిరమైయున్నచో వారు ధన్యులు. ఎందుకనగా వారి సాధన పరలోక రాజ్యనివాసమునొందు మార్గమును సరళమగునట్లు అంతకంతకు వృద్ధిచెంది, అధికఫలమిచ్చును. ఇట్టిఫలము సిద్ధించవలెననిన, ఎట్టికఠినమైన హింసలనైనను, పరీక్షలనైనను ఎదుర్కొని, అవియన్నియు తనను పరలోకమునకు జేర్చుటకు అవసరమైనవని తెలిసి సంతోషించుచు, ఆనందించుచు, సాధనను ఉత్సాహముతో కొనసాగించవలెను. </span><br /><br /><span style="font-size: large;"> ''మీరు లోకమునకు ఉప్పై యున్నారు; ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు''.</span><br /><br /><span style="font-size: large;">(మత్తయి 5ః13)</span><br /><br /><span style="font-size: large;"> అర్ధముః లోకమునకు ఉప్పు అనగా శరీరానుసారమైనవారికి ఆధారమైన తెలివి; నిస్సారమనగా అవివేకము. త్రొక్కబడుటయనగా తిరిగి మరణమునకు తీర్పులోనికి వచ్చుట; పారవేయుటయనగా దేవుని చేరక వ్యర్ధమగుట. దేనికిని పనికిరాదు అనగా మనుష్యుని జన్మ నిరర్ధకమై నరకములోనికి త్రొక్కివేయబడుట.</span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః ఏపదార్ధమైనను ఉప్పులేనిచో రుచించదు. రుచిలేని పదార్ధమును పారవేయుదుము గాని అనుభవించము. అట్లు పారవేయబడిన పదార్ధములన్నియు మంటిలోనికి త్రొక్కివేయబడును. ఇక అవి దేనికీపనికిరాదు. అటులనే దేవుని ఆత్మచేఅభిషేకించబడుటకు అందరును ఆయనచే నియమింపబడి పిలువబడినవారే. దానినెరుగని వారు అవివేకులు, బుద్ధిహీనులు.కనుక సారవంతమైన ఉప్పు అందరికినీ కావలసియున్నది. వివేకమనగా దేవుని తెలిసియుండి, ఆత్మానుసారముగా జీవించు తెలివి. అట్టి వివేకమను సారవంతమైనఉప్పులేనివారు బుద్ధిహీనులు.వీరి శరీరానుసార జీవితము వ్యర్ధము.వివేకము లేని మనుష్యులు మరణమునకు తీర్పు చెప్పబడుదురు. కావున వీరు దేవునికి దూరముగా విసిరివేయబడినవారును, మరణముచే త్రొక్కబడినవారును అగుదురు.ఉప్పును నిస్సారమనిన,వారి వివేకము లోకానుసారమైనదేగాని దైవానుసారముకానిది. లోకానుసారమైన బుద్ధి సాతానుప్రేరితము మరియు వ్యర్ధము. దైవానుసారమైనబుద్ధి వారి హృదయములను శుద్ధపరచి,వారి ఆత్మలు పరిశుద్ధాత్మచే అభిషేకించబడినట్లు చేయును.</span><br /><br /><span style="font-size: large;"> ''మీరు లోకమునకు వెలుగై యున్నారు,కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అదియింటనుండు వారి కందరికిని వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు''. (మత్తయ 5ః14,15)</span><br /><br /><span style="font-size: large;">అర్ధముః వెలుగు అనగా ప్రకాశము. కొండమీద నుండు పట్టణమనగా భ్రూమధ్య స్థానము. మరుగై యుండనేరదు అనగా తప్పక అనుభవములోనికి వచ్చును. కుంచము క్రింద దీపము పెట్టుట అనగా ఆ వెలుగువలన ప్రయోజనము లేకుండుట. దీపస్తంభము మీద పెట్టుట అనగా, అంతటను కనబడునట్లు పెట్టుట.</span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః దేవుని ప్రకాశము నరుల భ్రూమధ్యస్థానమందు వెలుగుచున్నది. అజ్ఞానమను కుంచముచే ఆవెలుగు ప్రకాశము ఇంద్రియములపై బడుటలేదు. అందువలన దేవుని మరుగుపరచెను. అజ్ఞానమను కుంచమును తీసివేసి, ఆవెలుగు అందరకిని కనబడునట్లు దీపమును దీపస్తంభముపై పెట్టినట్లుగా, అజ్ఞానమునువిడచి, భ్రూమధ్యస్థానమును స్థంభముపై నిలబెట్టినచో ఆవెలుగు దేవుని మరుగుచేయదు.అనగా ఆత్మానుభవము కలుగును.</span><br /><br /><span style="font-size: large;"> ''అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును; అడుగు ప్రతివాడును పొందును; వెదుకువానికి దొరుకును; తట్టువానికి తీయబడును'' (మత్తయి 7:7,8).</span><br /><br /><span style="font-size: large;">అర్ధముఃఅడుగుటయనగా జ్ఞానముకొరకు అర్ధించుట. వెదుకుటయనగా జ్ఞానముకొరకు వెదకుట. తట్టుట యనగా పరిశుద్ధపరచబడిన హృదయద్వారమును తట్టుట. తీయబడుటయనగా హృదయద్వారము తెరువబడుట. అడుగు ప్రతివాడును పొందుననగా ఆత్మానుభవమును పొందును. వెదుకువానికి దొరకుననగా పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానము లభించును. తట్టువానికి తీయబడుననగా, జ్ఞానముతో వారి హృదయమును శోధించిన, దైవ సాక్షాత్కారమునకు అడ్డుగానున్న తెర తీయబడును.</span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః ఎవరైతే పరిశుద్ధమైన జ్ఞానముతో ఆయన సాక్షాత్కారము కొరకు ప్రార్ధింతురో, వారికి సత్యము యొక్క అనుభవము అనుగ్రహించబడును. సత్యస్వరూపజ్ఞానము కొరకు అన్వేషించువారికి </span><br /><br /><span style="font-size: large;"> ఆ సత్యము అనుభవములో సిద్ధించును. పరిశుద్ధపరచబడిన హృదయ ద్వారమును ఎవరు తట్టగలరో వారికి అక్కడనే దైవసాక్షాత్కారమునకు అడ్డుగానున్న తెరతీయబడును. సమర్ధులైన వారెవరైనను, అట్టిప్రతివానికిని సత్యము, జ్ఞానము, అనుభవము అనునవి తప్పక సిద్ధించును.</span><br /><br /><span style="font-size: large;"> ''నాశనమునకు పోవు ద్వారము వెడల్పును,ఆదారి విశాలమునై యున్నది.జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై యున్నది. దానికనుగొనువారు కొందరే''.</span><br /><br /><span style="font-size: large;"> (మత్తయి 7:13,14)</span><br /><br /><span style="font-size: large;">అర్ధముః నాశనమునకు పోవుద్వారమనగా శరీరానుసారము.ఇది సాతాను వలన యేర్పడినది. జీవమునకు పోవు ద్వారమనగా ఆత్మానుసారము. ఇది క్రీస్తుయేసను నరుడైనవాడును, మార్గము, సత్యము, జీవము తానైనవాడును యేర్పాటు చేసిన ప్రేమమార్గము. </span><br /><br /><span style="font-size: large;"> తాత్పర్యముః సాతానుచే యేర్పడిన మార్గము వెడల్పును, విశాలమునై యున్నది. అన్యజనులును, అవిశ్వాసులును అయిన అందరికిని ఈ ద్వారము అందుబాటులో నుండి ప్రలోభపెట్టుచున్నది. కాని దీని ప్రవేశమువలన పాపము,నరకము, మరణమునకు తీర్పు మొదలగునవి కలిగి బాధించును. క్రీస్తు యేసును నరుడు తానే మార్గము, సత్యము జీవమునైయుండును. ఈ ద్వారము ఇరుకు, సంకుచితమైయున్నది. ఇందు ప్రవేశించువారు దేవునిచిత్తముగా పరీక్షించబడుదురు.పరీక్షలలో నిందలు,అవమానము, హింసయెదుర్కొందురు.చివరకు సిలువ వేయబడుదురు.అయినను వీటిని లెక్కచేయని ధైర్యవంతులుకొందరే. వారుమాత్రమే ఈ ద్వారమును ప్రవేశించగలరు. ప్రేమ, కరుణ, ఓర్పు, శాంతి, దైవార్పణలతోనిండిన మరియు విశాలపరచబడిన అంత:కరణ గలిగినవారే యీ ద్వారమున ప్రవేశించగలరు.వారు సత్యానుభవమునొందుదురు. అన్యజనులు ప్రవేశించజాలరు.</span><br /><br /><span style="font-size: large;">''ఆ కొండ మీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను''. (మత్తయి 8:1)</span><br /><br /><span style="font-size: large;">అర్ధముః కొండదిగుటయనగా తిరిగి శరీరభావన లోనికి వచ్చుట. బహుజనసమూహములనగా అన్యజనులు, అవిశ్వాసులు, విశ్వాసులు, వెంబడించుటయనగా శరీరానుసారముగా వెంబడించుట.</span><br /><br /><span style="font-size: large;">తాత్పర్యముః యేసుప్రభువు తన దైవీస్థితి నుండీ దిగి వచ్చెను.ప్రవచనము పూర్తి అయ్యెను. ఇప్పుడు ఆయనను శరీరానుసారులు వెంబడించసాగిరి.ప్రవచనమును మాత్రము ఆయన శిష్యులైనవారు మాత్రమే వెంబడించిరి.ప్రభువు యొక్క ప్రవచనమునకు లోబడినవారు, వారి వారి స్థితులను బట్టి తెలిసికొని, కొంతవరకు మార్పుచెందిరి.ఆయన మహిమను గుర్తించినవారు ఆశతో వెంబడించిరి. వ్యాధులనుండియు, రోగముల నుండియు విమోచన కొరకు క్రియామూలమైన విశ్వాశముతో వెంబడించిరి. ప్రవచనము ప్రకారము వెంబడించినవారు కొందరే. వారందరును కలసి బహుజనులుగా వారికి సాధ్యమైన పద్ధతిలో వెంబడించి తగిన ఫలితమును పొందిరి.</span><br /><br /><br /></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-89850651311974288052014-02-28T05:25:00.000-08:002014-02-28T05:25:17.218-08:0017. ఆశీర్వాదము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;"> 17. ఆశీర్వాదము<br /><br /> అన్యజనులకు విశ్వాసము కలుగునట్లును, విశ్వాసులు క్రీస్తుగా మారుటకును, క్రీస్తైన వాడు పరిశుద్ధ పరచుటకును ప్రభువు ద్వారాను, అపొస్తలుల ద్వారాను మనము దేవుడైన తండ్రిచేత ఆశీర్వదించ బడి యున్నాము. <br /><br /> ''ఆత్మ మిమ్ము పరిశుద్ధ పరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచు కొనెను.''(2థెస్స 2:13) యేసు క్రీస్తు యొక్క మహిమను(చైతన్యమును) పొంద వలెనని ఆయన అపొస్తలుల సువార్త వలన మిమ్మును పిలిచెను. మరియు ''మీ హృదయములను ఆదరించి, ప్రతి సత్కార్యమందును ప్రతి వాక్యమందును మిమ్మును స్థిర పరచు గాక!'' (2థెస్స 2:17). దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక! <br /><br /> హృదయములను ఆదరించుట అనగా పరిశుద్ధాత్మ సత్యమని విశ్వసించుట, మరియు మనస్సునకు సంబంధించిన వన్నియు సాతాను సంబంధమైన అజ్ఞానము అని వాటిని విడచుట ఈవిధముగా హృదయములను ఆదరించ గలరు. సత్కార్యమనగా శాశ్వతమైన దేవుని తెలిసికొను సాధన. దీని వలన హృదయ ద్వారములు తెరువ బడును. ఈ ద్వారములు తెరువ బడినచో దేవుని ప్రతి వాక్యము మనయందు స్థిరపడును. అప్పుడు మాత్రమే ఆయన యందు చేరగలము. అందు కొరకు మన హృదయములు స్పందించ వలెననియు ఆయన అనుగ్రహమే కావలెను. ఇట్టి ఆశీర్వాదమే మనకు లభించుచున్నది.<br /><br /> ''సమాధాన కర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక!'' (2థెస్స 3:16). ''పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు కొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండును గాక!'' (కొలస్సి- 4: 14,15)<br /><br /> సమాధాన కర్త యనగా లక్ష్యమే తానయిన వాడును, అనుగ్రహించు వాడును అయియున్నవాడు. అన్నియు ఆయన వల్లనే కలిగి, ఆయన చేతనే జరుపబడుచున్నవని తెలిసి, సాతానుకు లోబడక ఉండునట్టి సాధకుని సంసిద్ధతను బట్టి ఆయన క్రీస్తు యేసుగా మేలు కొలుపుట అనెడి సమాధానము నిచ్చు కర్తగా నున్నాడు. ఈ విధముగా సాధనా సంపత్తి కలిగి, హృదయ పూర్వక విశ్వాసులైన సాధకులకు సదా ఆయన ఆశ్వీర్వాదము అందుచున్నది.<br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-49935889977935419942014-02-28T05:23:00.003-08:002014-02-28T05:23:54.115-08:0016. ధైర్యము - శోధన<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">16. ధైర్యము - శోధన<br /><br /> ''యేసు మన కొరకు ప్రతిషఙ్ఠంచిన మార్గము, అనగా నూతనమైనదియు, జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా యేర్పరచ బడినదియు నైన మార్గము'' (హెబ్రి 10:19). దీని ప్రవేశమునకు దైర్యము కలిగి ఉండుము. ''కాబట్టి నీవు దైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన యెడల నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడచు కొందువు'' (1రాజులు 2:2-3). <br /><br /> ధైర్యముతో శోధన చేయ వలెను. శరీర శ్రమలును, మానసిక వేదనలును కలుగుచున్నను, ధైర్యముతో ప్రేమతో సత్క్రియలు జరుప వలెను. శోధన చేయుటకు కావలసిన వివేకము ప్రేమలు ధైర్యము మూలముగా వచ్చును. <br /><br /> ''దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గము కంటె వాడిగా ఉండి, ప్రాణములను, కీళ్ళను, మూలిగను విభజించు నంతమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది''. (హెబ్రి 4:12). <br /><br /> దేవుని వాక్యము దేవునికి సూచకము. దేవుడు తాను సృష్టించిన ప్రతి అణువులోను చొచ్చుకొని వ్యాపకమై యున్నాడు. మనుష్యులలో కనుపించు అవయవములలో నుండి, కనిపించని ఇంద్రియములలోనికిని, హృదయములోనికి చొచ్చి వాని తలంపులను, ఆలోచనలను శోధించుచున్నాడు. మనమును యీ జ్ఞానముతో ప్రేరణ కలిగినచో మనలో గొప్ప శోధన కలుగును. శోధన ఫలితముగా దీర్ఘ శాంతమును పొందెదము. అది ప్రేమమయమై క్రీస్తుగా మార్చును. ఇదియే ఆరాధన.<br /><br /> ''అట్టి స్వేచ్ఛారాధన విషయములోను దేహ శిక్షణ విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచ బడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు'' (కొలస్సి 2:23). శరీర విషయములను త్యజించుటకు ధైర్యము కావలెను. అట్టి ధీరునికి సంబంధించిన పూర్వ దుష్క్రియ ఫలితములు చెల్లి పోవును.<br /><br /> ''వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకముంచు కొననని ప్రభువు చెప్పుచున్నాడు'' (హెబ్రి 10:17).<br /><br /> ''ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను'' (2కొరింథి 5:17). ''కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించును'' (రోమా 8:1). ఇదియే తీర్పు నుండి సంపూర్ణ రక్షణ మరియు నిత్యజీవమైన సత్యము.<br /><br /> క్రీస్తు నందున్నవాడు ఆత్మగా నున్నాడు. ఆత్మానుసార జీవనమునకు గమ్యము ఆత్మగా నుండుటయే. ఇట్టివాడు క్రీస్తు అనబడును. క్రీస్తుగా మారిన వానికి పాతకర్మల వలన కలుగు మంచి చెడుల ఫలితము ఉండదు. ఈ ఫలితమునకు క్రీస్తు న్యాయస్థానమందు తీర్పు తీర్చబడదు. పాతవి గతించినవే. పవిత్రమైనవాడే క్రీస్తైనందున, అట్టి క్రీస్తుది నూతన జన్మ. ఈ రెండవ జన్మ నొందిన వానికి పాపము అంటదు, మరణమునకు తీర్పు తీర్చ బడడు. పాపము వలన కలిగినట్టి శరీర భావము నుండి విముక్తుడైనందున ఇతడు దిగంబరాత్మ. ఇతడు శరీరమును ధరించినను, ధరించని వానితో సమానము, ఎందుకనగా, అతని క్రియలు శరీరానుసారము కాదు.<br /><br /> ఇట్టి దిగంబరాత్మగా నున్న వాడైననే అతనిపై పరిశుద్ధాత్మ కుమ్మరించ బడును. ఇతడు వెనువెంటనే క్రీస్తుయేసు నందు ప్రవేశించును. నూతన జన్మ వలన క్రీస్తుగా మారిన వాడు చేరు చోటు క్రీస్తు యేసు. తండ్రి నుండి, తండ్రి పోలికన శరీరధారియై వచ్చినవాడు యేసు క్రీస్తు. ఈ రెండును ఒక్కటియే. ఆరోహణ, అవరోహణ మార్గమును బట్టి ఇవి రెండుగా నున్నవి. అనగా తండ్రి నుండి దిగిన స్థితి యేసుక్రీస్తు, మరియు తండ్రి స్థితికి చేర్చుకొన బడిన వాడు క్రీస్తు యేసు. ఈ రెండును ఐక్యత చేయ బడిన స్థితిలో ఒక్కటియే. ఈ విధముగా క్రీస్తుయేసునందు ప్రవేశించిన వానిని యేసు నందు సారూప్య పరచి, చేర్చుకొనును. ఆయన పరిశుద్ధాత్మగానే యున్నాడు. ఇప్పుడు సాధకుడు కూడా పరిశుద్ధ పరచబడినందున, ఈ నూతన జన్మలో పరిశుద్ధాత్మగా మారిన వాడయ్యెను. సాధకుడు ఆయనతో సమానమయ్యెను. ఇద్దరును ఆ ఒక్క పరిశుద్ధాత్మయే.<br /><br /> ఇదియే ఆయన యొక్క పవిత్ర జననముతోను, జీవముతోను ఐక్యత పరచుకొనుట. సిలువపై మరణించి, పునరుత్థానమైన ''క్రీస్తుయేసు'' ''క్రీస్తు''గా మరణించి ''యేసు''గా పునరుద్ధరించ బడెను. దీని సాదృశ్యముగా సాధకుడు ఆయన సారూప్యమగును. <br /><br /> కనుక క్రీస్తుగా మరణించిన క్రైస్తవుడు ఇక జన్మించడు. దీనినే మరణము జయించిన క్రీస్తు అందురు. క్రీస్తుగా '' ఒకే జన్మ, ఒకే మరణము''. <br /><br /> పరిశుద్ధాత్మ అయిన సాధకుడు సంచకరువు అను ముద్రను పొంది, ఆయన రెండవ రాకడలో పరలోక రాజ్యమందు స్థిరమగును.<br /><br /><br /><br /><br /><br />శోధన<br /><br />1. నిజమైన అస్థిత్వము :- దేవుడు ఒక్కడే ఉనికి కలిగి యున్నాడు. అనంతుడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యము, పరిశుద్ధుడు అయి ఉన్నాడు. రెండవది ఏదియు లేక ఒక్కటిగా నున్నది దేవుడు ఒక్కడే. ఇదే నిజమైన అస్ధిత్వము.<br /><br />2. నిజమైన ప్రేమ :- అందరిలోను, అన్నింటిలోను నివసించి యున్న అనంతమైన ఆ దేవుని తెలిసి కోవాలనియు, ఆయనలో ఏకత్వము పొందాలనియు తపన పడుటయే నిజమైన ప్రేమ.<br /><br />3. నిజమైన త్యాగము:- ప్రేమించడ మంటే ఏదైనా పొందుట కొరకు కాదు. ప్రేమ కొరకు సర్వము అర్పించుటయే ప్రేమ. అందు వలన దేవుని ప్రేమించుట అనగా మన శరీరము, ప్రాణము, మనస్సు, అధికారము, ఆరోగ్యము, తుదకు జీవిత సర్వస్వము త్యాగము చేయుటయే. అదియే నిజమైన త్యాగము.<br /><br />4. నిజమైన పరిత్యాగము:- నేను మాత్రముండి పై విధముగా చేసినదే త్యాగము. కాని నేను సహితము లేకుండా పోయి, దేవునిలో కరిగి పోవుట నిజమైన పరిత్యాగము.<br /><br />5. నిజమైన జ్ఞానము:- సర్వ వ్యాపకమైన దేవుడు మంచి వారి యందును, చెడ్డ వారి యందును, సర్వజీవుల యందు ఉనికి కలిగియు, ఏకత్వముగా ఉన్నాడని అనుభవించు జ్ఞానమే నిజమైన జ్ఞానము.<br /><br />6. నిజమైన నిగ్రహము:- శరీరానుసారమైన వన్నియు సాతాను సంబంధమైనవని యెంచి, చలించక, ఆత్మానుసారముగా జీవించుటయే నిజమైన నిగ్రహము.<br /><br />7. నిజమైన సర్వార్పణ:- సాతాను వలన కలిగిన ఎట్టి విపత్తులలో నైనను, మనస్సును చలింపనీయక, మనస్సును సమతూకములో నుంచుచు, దేవుని ఇచ్ఛను ఎదిరించని విశ్వాసముతో ఎల్లప్పుడును సంతోషముగా నుండుచు, ఇంకనూ దేవుని ప్రేమించు చుండుటను విడువనిదే నిజమైన సర్వార్పణ<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-12155512196831593452014-02-28T05:21:00.002-08:002014-02-28T05:21:35.695-08:00 15. ప్రేమ మార్గము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;"><br /></span></b><br /><b><span style="font-size: large;">15. ప్రేమ మార్గము</span></b><br /><br /><b><span style="font-size: large;"> క్రీస్తు యేసు సాదృశ్యములో ఆయన మార్గమైన ఓర్పు, సహనము, ప్రేమ, నిరీక్షణలతో మనము ఆయనతో ఐక్యత పరచుకొన వలెను. అందరిలో ఆయనను దర్శించుటకు, నిజమైన విశ్వాసము మనలో కలుగ వలెను. అయినను ఆ విశ్వాసము మనలో కలుగ వలెననిన ప్రేమ ద్వారా మన హృదయములను విశాల పరచుకొనవలెను, మరియు సంకుచితత్వమును వీడ వలెను. </span></b><br /><br /><b><span style="font-size: large;"> ఎందుకనగా ''ప్రకృతి సంబంధితమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింప దగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.'' (1కొరింథి 2:14) అందు వలన అతని హృదయము సంకుచితముగా నున్నంత వరకు అతడు వాటిని గ్రహింప నేరడు.</span></b><br /><br /><b><span style="font-size: large;"> ఇంకను ''ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరమున్నది,ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెను. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టి వాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి యెట్టి వాడో పరలోక సంబంధులును అట్టి వారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము'' (1కొరింథి 15 : 14- 49).</span></b><br /><br /><b><span style="font-size: large;"> కావున మనకు తెలియుచున్నదేమనగా మంటి నుండి వచ్చిన శరీరమును ధరించి, శరీరమే నేను అనుచున్న మనుష్యుడు, ఆత్మానుసారము జీవించుచు, చివరకు ఆత్మానుభవమునొందుటకు దేవునిచే నియమించ బడెను. ఇది జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయనచే ప్రణాళిక వేయ బడెను. కనుక మనుష్యుడు, తాను పరలోక సంబంధి పోలికయు ధరించుటకు ఆశీర్వదింపబడి యుండెను. దీని కొరకు మనుష్యుడు వ్యక్తిగత శరీరమే నేను అనుభావము వలన కలిగిన స్వార్ధముచే బంధించ బడెను. ఇదియే అతని యొక్క అంత:కరణమును సంకుచిత పరచెను. అతని హృదయము పరిశుద్థము కావలెననిన, అతని సంకుచిత్వము నశించ వలెను. దీనికి క్రీసుయేసు ఏర్పరచిన ప్రేమ మార్గమే శరణ్యము. ప్రేమ వల్లనే స్వార్ధము నశించును. ప్రేమ వల్లనే త్యాగమును, త్యాగము వలన విశాల భావమును కలుగును మరియు హృదయము శుద్ధమై సమిష్టి భావన కలుగును. ఇదియే మనలను సాధారణ ప్రేమ ద్వారా దివ్య ప్రేమకు మార్చి చివరకు దైవమే యగుటకు త్రోవ చూపును.</span></b><br /><br /><b><span style="font-size: large;"> అందరు దేవుని బిడ్డలమే. అందు వలన మనమందరమును సహాదరులము. క్రీస్తు విషయమై ప్రేమ ద్వారా మనమందరము ఏకమై ఉన్నాము. అందువలన నా వారు ఇతరులు అను భేదముగాని, మిత్రులు, శత్రువులు అను భేదముగాని ఉండరాదు. ఈ యేకత్వ భావమును క్రీస్తు చూపిన ప్రేమ తోనే సాధించ గలము. వ్యక్తిగతమైన భావనను వేరు పరచును, ఆత్మ విషయముగా చూచినచో వ్యక్తిత్వము నశిఙంచి, ప్రేమ కల్గును. ప్రేమలో ఆత్మ అభిషేకింప బడును. అది పరిశుద్ధాత్మగా పరిణమించును. ఇదియే మనకు క్రీస్తు అందించిన ప్రేమ మార్గము. </span></b><br /><br /><b><span style="font-size: large;"> ''సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకరు అనురాగము కలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్ఫగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యముకాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము యిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి గాని శపించ వద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి యుండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుడి. కీడు వలన జయింప బడక మేలు(ప్రేమ) చేత జయించుము.'' (రోమా 12:10-21) ఓర్పుతో ఉగ్రతకు చోటిచ్చిన అన్ని దుష్క్రియలకు (నీవుగాక) ప్రభువే ప్రతిఫలమిచ్చు వాడగును శిక్షించుట క్రీస్తు ప్రేమికుల పని కాదు. </span></b><br /><br /><b><span style="font-size: large;"> క్రీస్తు ప్రేమికులు శత్రువునైనను శిక్షించ పూనుకొనక మేలునే చేయ వలెను. ''ఎదిరించు వారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు'' (రోమా 13:2). వారు క్రీస్తు స్థితిలో నుండక తీర్పునకు లోబడుదురు. కనుక ప్రేమయే తీర్పు నుండి రక్షించును. సర్వము తానే అయిన దేవుని యందు మనమున్నాము, మనందరిలో ఆయన ఉన్నాడు. ప్రేమచేత ఆయన సాదృశ్యములో మనలను ఐక్యత పరచుకొనుటయే ప్రేమకు ముఖ్యాంశము. ప్రేమ చేత అంత:కరణ మందున్న సంకుచితత్వము విమోచన పొందును. అప్పుడు హృదయ మందు క్రీస్తు స్థిరమగును. ''క్రీస్తయిన వానికి శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారము మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యుండుటకు పిలువ బడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మమొక్కటే, అందరికి తండ్రియైన దేవుడొక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో పతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.''(ఎఫెసి 4:4-7). కృపా వరమెట్లనిన, అన్యజనులకును, క్రియా మూల విశ్వాసులకును ముందుగా వివేకమునిచ్చును. హృదయ పూర్వక విశ్వాసులకు క్రీస్తు స్థితిని అనుగ్రహించును. క్రీస్తు యేసు నందున్న వానిని పరిశుద్ధ పరచును. పరిశుద్ధాత్మ అయిన వానికి పరలోక రాజ్య నివాసమును అనుగ్రహించును. ఇట్లు సాధన చేయువాని వాని ఆధ్యాత్మిక పరిమాణముల చొప్పున వానికి కృప యియ్యబడును.</span></b><br /><br /><b><span style="font-size: large;"> ''కాబట్టి ఆగ్రహభయముల బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము'' (రోమా 13:5). ఎందుకనగా ఆగ్రహ భయములు శరీరమూలము, మనస్సాక్షి ఆంతర్య పురుషుడుగా సత్క్రియలు జరుపును. మనస్సాక్షి కలవారికి ప్రేమ సహజము. ''అందువలన ఒకనికొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చి ఉండవద్దు. మరి యే ఆజ్ఞ అయినను ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా యిమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే'' (రోమా 13:8-9). </span></b><br /><br /><b><span style="font-size: large;"> క్రీస్తైన వాడే నిజమైన ప్రేమ కలిగి యుండును. ఎందుకనగా క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు. ఆ పైన దేవుని నీతిని అందుకొనుటకు ప్రేమ తోడ్పడును. ధర్మశాస్త్రము లౌకికాత్మ సంబంధము. నీతియందుండుట క్రీస్తు సంబంధము. లౌకికాత్మ ప్రేమ స్వార్థ పూరితము, క్రీస్తు ప్రేమ త్యాగమయ మైనది. దేవుడు తన్ను ప్రేమించిన వారికొరకై ఏవి సిద్ధ పరచెనో అవి దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలు పరచి ఉన్నాడు. ''దేవుని వలన మనకు దయ చేయ బడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము'' (1కొరింధి 2:13).</span></b><br /><br /><b><span style="font-size: large;"> దేవుని ఆత్మయే అంతటను నిండి ఉన్నది. అందు వలన మనుష్యుల ఆత్మగాఉన్నది కూడా దేవుని ఆత్మయే. దీని మహిమ వలన మనుష్యులందు ఆంతర్య పురుషునిగా, సత్యమును, ప్రేమను, సుఖమును కోరువాడై ఉన్నాడు. కాని ఆంతర్య పురుషుని ప్రబోధ వినక, సాతాను సంబంధమైన అజ్ఞానములో పడి మంచి చెడుల కర్మలు చేయుచు, మరణమునకు సిద్ధ పడుచున్నాడు. మంచి చెడుల ఫలితములున్ను, మరణమున్ను బాహ్య పురుషునికేగాని, ఆత్మకు కాదు. ప్రవచనములన్నియు దీనినే తెలుపుచున్న వాక్యములే. కనుక ''ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి యున్నవాడనని చెప్పుకొను వాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగునే తానును నడుచుకొన బద్దుడై యున్నాడు'' (1యోహాను 2:5-6). ఇదియే ప్రభువైన యేసు క్రీస్తు సాదృశ్యముగా మనము ఐక్య పరచుకొనుచు నడుచుట. నీ ప్రేమ పరిపూర్ణ మెట్లగుననిన, ''నీదేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సు తోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింప వలెననియు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింప వలెననియు వ్రాయ బడియున్నది'' (లూకా 10: 27).</span></b><br /><br /><b><span style="font-size: large;"> పూర్ణ హృదయమనగా శరీరము వలనను లౌకిక విషయముల వలనను ఉద్వేగము చెందని హృదయము. పూర్ణ మనస్సనగా దుర్నీతి, దుష్క్రియలకు తావులేక మనస్సాక్షిగా నుండు మనస్సు. పూర్ణ శక్తి యనగా ఓర్పు, సహనము, శాంతి, నిరీక్షణలను కలిగి ఆగ్రహ భయములులేని నిగ్రహ శక్తి. పూర్ణ వివేకమనగా ఉగ్రత దినమందు తీర్పునకు కారణమగు దుష్క్రియలకు దూరమై, సత్క్రియలు మాత్రము జరుపుటకు నిశ్చయతనొందిన బుద్ధి, మరియు ప్రభువు నందు విశ్వాసము వలన పక్షపాత బుద్ధి లేక అందరిని ప్రేమతో తనలో ఐక్యత పరచుకొను వివేకము. ప్రేమ ఘనమైనదియు, శ్రేష్ఠమైనదియు కావలెనని ప్రభువు మనలనందరిని ఏకరీతిగా ఎట్లు ప్రేమించెనో, మనమును ఆ రీతిగా పొరుగు వారిని ప్రేమించుటలో ఎక్కువ తక్కువలు ఉండరాదు.</span></b><br /><br /><b><span style="font-size: large;"> ''శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని'' యెహోవా చెప్పెను. (యిర్మియా 31:3). అట్టి ప్రేమ స్వరూపుడైన యెహోవా తండ్రియై తన కుమారుని ప్రేమ మార్గముగా చేసి మన కొరకు పంపెను. కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమ, కరుణలను వ్యక్త పరచి, బోధించి, సాదృశ్య పరచుకొనమని, మనకు మార్గముగా నుండెను. తనను సిలువపై మరణించునట్లు జేసిన వారిని, అవమాన పరచిన వానిని క్షమించ మని తండ్రిని వేడుకొని క్రీస్తు యేసు నిజమైన ప్రేమ అనగా నెట్టిదో నిరూపించినాడు. '' తండ్రీ! వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపు'' మనెను (లూకా 23: 34). తండ్రి ప్ర్రేమ, ప్రభువు వెల్లడించిన ప్రేమయు, శ్రేష్ఠమై నట్లే మనమును ప్రేమను వృద్ధి చేసికొన వలెను. </span></b><br /><br /><b><span style="font-size: large;"> ''నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింప వలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమింప గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు'' (యోహాను 13:34-35). శిష్యులు వ్యక్త పరచు ప్రేమను అన్యజనులు ఆదర్శముగా తీసికొని, అట్టి ప్రేమలో ప్రభువును దర్శించ గలరు. క్రీస్తు ప్రేమయనిన ఎట్టిదో వీరి వలన అందరును తెలిసికొందురు. ఇదియే క్రీస్తు మార్గము మరియు ప్రేమ మార్గము. దీనిచే హృదయములు తట్ట బడును. పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించ బడును. </span></b><br /><br /><br /><br /><b><span style="font-size: large;">దేవుని ప్రేమించుటకు ఏమి చేయ వలెను? </span></b><br /><br /><b><span style="font-size: large;"> అందరూ ఆత్మీయులే అనగా ఆత్మ సంబంధులేగాని, శరీర సంబంధులైన అన్యజనులు కాదు. శరీరములుగా తాను, పరులు అను భేదముండును గాని, ఆత్మ సంబంధులకు అట్టి భేదము ఉండదు. ఆత్మానుసారులైన వారు ఆ భేదమును ప్రేమ ద్వారా పోగొట్టు కొన వలెను. అదియే దేవుని ప్రేమించి నట్లు. ఈ విధముగా ఏకత్వానుభవమును పొంది క్రీస్తుగా మారుదురు.</span></b><br /><br /><b><span style="font-size: large;">1. తోటి మానవుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట.</span></b><br /><br /><b><span style="font-size: large;">2. మన ఆత్మీయుల పట్ల మన కెట్టి సద్భావము ఉండునో, పరుల పట్ల కూడా అట్టి సద్భావమున్నచో మనము దేవుని ప్రేమించి నట్లే. (సద్భావమనగా రెండుగా లేని ఏకత్వ భావన).</span></b><br /><br /><b><span style="font-size: large;">3.పరులలో దోషములను ఎంచుటకు బదులుగా మనలోని గుణదోషమును పరిశీలించుకొని నివారించు కొనినచో దేవుని ప్రేమించి నట్లే. (గుణ మనగా రజోగుణము, తమో గుణము, సత్వ గుణము).</span></b><br /><br /><b><span style="font-size: large;">4.మన సహాయమునకై పరులను దోచుకొనుటకు బదులు, పరుల సహాయమునకై మన స్వార్ధమును దోచి పెట్టినచో ( అనగా త్యాగము చేసినచో ) దేవుని ప్రేమించి నట్లే. (సత్వగుణము).</span></b><br /><br /><b><span style="font-size: large;">5.మనకు ప్రాప్తించిన దానిని దేవుని ఇచ్ఛగా అంగీకరించుచూ, ఓర్పుతో సంతృప్తితో, సంతోషముగా నున్నచో దేవుని ప్రేమించి నట్లే. (విషయ సమత్వము).</span></b><br /><br /><b><span style="font-size: large;">6. పరుల కష్టసుఖములను తన కష్ట సుఖములుగ భావించుచు, చేయ వలసిన సహాయమును చేయుచూ, సంతోషముగా నున్నచో దేవుని ప్రేమించి నట్లే. (శుద్ధ సత్వము).</span></b><br /><br /><b><span style="font-size: large;">7.దేవుని సృష్టిలో ఏజీవికైనను హాని చేయక, అన్నిటి యందును, దేవుని ఉనికిని భావించుచున్నచో అదియే భక్తి , అదియే విశ్వాసము, అదియే ఆరాధన. ఇట్లు ఉదయించిన ప్రేమ అనుభూతులున్నచో అది దేవుని ప్రేమించి నట్లే. (ఇట్టి విశ్వాసి క్రీస్తుగా మారును).</span></b><br /><br /><b><span style="font-size: large;"> మనము దేవుని ప్రేమించ వలసిన రీతిగా ప్రేమించ వలెననినచో పైన పేర్కొనినట్లు నిన్ను నీవు కోల్పోయి, పరులతో నీకున్న భేదమును పోగొట్టుకొన వలెను. మరియు ప్రేమను వ్యక్తి గతము నుండి సమిష్టికి చేర్చి, ఏకత్వానుభూతిని పొంద వలెను. దీని కొరకు నీవు దైవమును ప్రేమించుటయే జీవిత గమ్యమని యెంచి, దేవుని కొరకే .జీవించుచు, దేవుని కొరకే మరణించ వలెను. అప్పుడు మనము క్రీస్తు యేసు నందు ప్రవేశించి(మేల్కొని) పరిశుద్ధాత్మగా నుండెదము.</span></b><br /><br /><br /></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-23843185293328659492014-02-28T05:17:00.003-08:002014-02-28T05:17:43.286-08:0014. సాధన క్రమము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">14. సాధన క్రమము</span></b><br /><br /><b><span style="font-size: large;"> ఈ సాధన క్రమమే మరింత వివరముగా ప్రవచనముల ద్వారా తెలుపుచున్నారు. </span></b><br /><br /><b><span style="font-size: large;"> ''భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిపించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి, నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయించ వలెను. అట్టి వానిలోనే నేనానందించు వాడనని సెలవిచ్చు చున్నాడు'' (యిర్మియా 9:24). దైవము విశ్వాసులలో నున్నట్లుగానే అవిశ్వాసులలో గూడ నివసించి సంచరించును. అవిశ్వాసులలో ఉన్న అపవిత్రత, విశ్వాసులైన వారికి అంటక ఉండవలెను గాని, తండ్రిని అందరిలో దర్శించుటయే విశ్వాసము. ''నేను వారిలో(అవిశ్వాసులలో) నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి. మరియు నేను మిమ్మును (విశ్వాసులను) చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకుమారులును, కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు'' (2కొరింధి 6:18). అపొస్తలులకైతే బ్రతుకుట క్రీస్తే, శరీరముతో జీవించుటయే వారి ప్రవచన కార్యమునకు ఫల సాధనమని పౌలు చెప్పుచున్నాడు (ఫిలిప్పి 1:21,22). ఇది క్రీస్తు స్థితి చేరిన విశ్వాసికి సూచకము మరియు అట్టి క్రీస్తుగా మారిన విశ్వాసులు క్రీస్తు యేసు నందు చేర్చుకొన బడుదురు. '' క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు, ఆనందమును పొందు నిమిత్తము'' అపొస్తలులు జీవించి యున్నారు (ఫిలిప్పి 1:26). ఆత్మానుసారుడు క్రీస్తుగా మారుటయే అతడు దేవుని వైపుకు తిరుగుట. ''జీవము గల దేవుని వైపుకు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము'' (అపొ.కా 14:15). ''విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్ధమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము'' (హెబ్రి 10:22). ''నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలు పరచ బడుచున్నది'' (రోమా 1:17). ''అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియై ఉన్నది'' (రోమా 3:22). కాబట్టి విశ్వాస మూలమున యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆయన కృపయందు ప్రవేశించి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.... మనకు అనుగ్రహించ బడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించ బడియున్నది (రోమా 5:1-5).</span></b><br /><br /><b><span style="font-size: large;"> మన ''విశ్వాసమును, నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి. మీరు క్షయ బీజము(నశించు గుణము) నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము(నశించనిది, చావు పుట్టుకలు లేనిది, మార్పు చెందనిది, ఆద్యంతములు లేనిది) నుండి పుట్టింప బడిన వారు గను నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారై యుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను, మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.'' (1పేతురు 1:21-24). ఈ వాక్యమే మనకు ప్రకటించ బడిన సువార్త.</span></b><br /><br /><b><span style="font-size: large;"> నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీ మట్టుకు నీవేయుంచు కొనుము. తాను సమ్మతించిన విషయములలో తనకు తానే తీర్పుతీర్చుకొనువాడు ధన్యుడు. ''క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానమును పొంద వలెనని గురియొద్దకే పరిగెత్తు చున్నాను'' (ఫిలిప్పి 3:14). </span></b><br /><br /><b><span style="font-size: large;"> క్రీస్తుగా ప్రతిష్ఠితమై క్రీస్తుయేసు నందు ప్రవేశించిన వారు ప్రభువు నందు చేర్చుకొన బడుదురు. ఆ మీద పరిశుద్ధాత్మచే ధరింప బడుదురు. అట్లు ధరింప బడిన వారు యేసుక్రీస్తు స్వరూపమైన సంచకరువు ముద్రను పొందుదురు. వీరికి యేసు రెండవ రాకడతో పరలోక రాజ్యమందు శాశ్వత నివాసమేర్పడును. దీనికి వాక్యమేమనగా ''నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్ములను తీసికొని పోవుదును.'' (యోహాను 14:23).</span></b><br /><br /><br /><br /><br /><br /><b><span style="font-size: large;"> సాధన క్రమము</span></b><br /><br /><b><span style="font-size: large;">1. రక్షణ కోరు వాడు పరిశుద్ధ గ్రంథమును నిత్యము పఠించ వలెను. అందు చెప్పబడినట్టి ఆత్మాను సారమైన క్రియలను ఆచరించుటకు ప్రయత్నించ వలెను మరియు శరీరాను సారమైన క్రియలను విడచుటలో నిగ్రహము, పట్టుదల కలిగి ఉండ వలెను. దివ్య గ్రంథములో సూచించిన కరుణ, ప్రేమతో స్వార్ధమును జయించ వలెను. ఇంద్రియములు కోరు సుఖమునకై ప్రయాస పడరాదు. దుష్ట భావము, దుష్క్రియలు జరుపుటను నివారించుచు, పరులకు మేలు చేయు క్రియలు జరుపు చుండ వలెను. సాతాను ప్రేరణను గుర్తించుట ద్వారా నిగ్రహమును పాటించ వలెను. దీనికై దేవుని వాక్యమును సహాయముగా స్వీకరించి, దేవుని ఆజ్ఞకు విధేయులు కావలెను. తమోగుణ సంబంధమైన ఆలోచనలను నిగ్రహించ వలెను. రజోగుణ సంబంధమైన ఆలోచనలను, క్రియలను విడ నాడ వలెను. సాత్వికమును, ప్రశాంత మనస్సును, సహనమును, ఓర్పును అలవర్చు కొనవలెను. దైవేచ్ఛకు లోబడి అన్ని క్రియలను జరుప వలెను. సుఖదు:ఖములు చెందని సమ తూకమైన బుద్ధిని సంపాదించు కొనవలెను.</span></b><br /><br /><b><span style="font-size: large;">2.సజ్జనులతో స్నేహము చేయు చుండ వలెను. దేవుని యందు స్ధిరమైన విశ్వాసము కలిగి యుండ వలెను. దయ, ప్రేమ, శాంతి కలిగి యుండి అందరిని సహోదరుల వలె ఆత్మీయముగా భావించ వలెను. సచ్ఛీలత, సదాచారము పెంపొందించు కొన వలెను. శరీరానుసారమైనదేదో తెలిసి మనస్సులోను, భావములోను త్వరితముగా మార్పు తెచ్చు కొన వలెను. స్వార్ధమును నిలుపు చున్నట్టి అవయవములను, ఇంద్రియములను, మనస్సును భావ శుద్ధి ద్వారా దైవ జనునికి అర్పించి వేసి, దైవ జనుల ఆజ్ఞను అనుసరించి నడచుకొన వలెను. అక్షయుడగు దేవుడు ఒక్కడే యని, రెండవది యేదియు లేదని ఉండ వలెను. దేవుని వాక్యమునే నిత్యము హృదయమున విన వలెను. వినిని దానిని గ్రహించి వాక్యానుసారముగా జీవించ వలెను. </span></b><br /><br /><b><span style="font-size: large;">3. దేవుని వాక్యము దైవ జనులకు స్ఫూర్తి ద్వారా అందించ బడినదని యెరుగ వలెను. దేవుని వాక్యమే ప్రమాణము. వాక్యార్ధమును దైవ శక్తి ద్వారా గ్రహించ వలెను. భాషణమునకును, ప్రవచనమునకు భేదము తెలిసి, సదవగాహన చేసికొన వలెను. విపరీతార్ధమును చేయక, కుతర్కము లాడక సత్యమును గ్రహించుటకు ప్రయత్నిము చేయవలెను. క్రీస్తు నాయందు ఉన్నాడనియు, క్రీస్తు నందు మనమందరము ఉన్నామనియు, నేనే క్రీస్తు నను పవిత్ర భావముతో నిరంతరము ఉండ వలెను. నా కంతయు తెలుసు నని గర్వము లేక, పెద్దలు, జ్ఞానులు, దైవ జనులు అందించు వాక్యములను శ్రద్ధతో విని, గ్రహించ వలెను. హృదయమున స్ఫూర్తి నాశ్రయించి జీవించ వలెను.</span></b><br /><br /><b><span style="font-size: large;">4.అతి నిద్రకు, ఆకలికి లోబడక వివేకముతో చురుకుగా ఉండ వలెను. మితాహారమును, హితాహారమును భుజించ వలెను. వీటి యందలి సూక్ష్తశక్తి ప్రాణముగాను ఆహారమందలి సూక్ష్మ శక్తి మనస్సుగాను వర్తించుచున్నది కావున తినుట కొరకు బ్రతుకరాదు మరియు విషయానందముగా స్వీకరించరాదు. బ్రతుకుట కొరకే తిన వలెను. సుఖము దు:ఖము, చలి ఎండ వంటి ద్వంద్వముల విషయములో సమత్వముగా ఉండ వలెను. తనకు భాద్యత లేని చోట జోక్యము తగదు మరియు వ్యర్ధ మాటలు , వ్యర్ధ చేతలు నివారించి, మౌనము పాటించ వలెను. ఈ మౌనము మాటలలోనే గాక తలంపులలోను ఉండ వలెను. లోక విషయములలో తటస్థముగాను, ఉదాసీనముగాను ఉండ వలెను. లోకులు నీయందు దోషము లెంచుటలో నీ శీలతను పరిశీలించుకొని నిర్దోషిగా మార వలెను. బాధ్యతలను నిర్వర్తించుటకు తప్ప ఎవరితోను ఎట్టి సంబంధము కొనసాగించ రాదు. భాధ్యత వలన జరుగు పనిలో రాగ ద్వేషములు, అరిషడ్వర్గము, అహంకారము వంటివి లేకుండా చూచుకొన వలెను. అందరిలో కలిసి అన్ని పనులు చేయు చున్నను, మనస్సులో ఒంటరి తనము, అంతరమున సాక్షిగాను</span></b><br /><br /><b><span style="font-size: large;"> ఏకాంతమును అనుభవించ వలెను. దైవ జనుల యందును, సజ్జనుల యందును, సత్పురుషుల యందును, క్రీస్తు విశ్వాసుల యందును ప్రీతి కలిగి ఉండ వలెను. దు:ఖ పడుచున్న వారియందును , అజ్ఞానుల యందును, నీచ గుణములు కలవారి యందును కరుణ కలిగి ఉండ వలెను. ప్రభువు యందు భక్తి విశ్వాసములు కలిగి ఉన్నవారి యందును, క్రీస్తు మార్గములో సాధన చేయుచున్న వారి యందును స్నేహ భావము కలిగియుండ వలెను. అన్యజనులందును, అవిశ్వాసుల యందును, దుష్టక్రియలు జరుపు వారి యందును ఉపేక్ష, ఉదాసీనత్వము కలిగి ఉండ వలెను. యౌవ్వనులుగా నున్నప్పుడే సాధన మొదలు పెట్ట వలెను. అప్పుడే వార్ధక్యములో దైవారాధన యందును, దైవములో ప్రతిష్ఠితులగుటకు సాధ్య పడును. </span></b><br /><br /><b><span style="font-size: large;">5.ఎవరు నిశ్చల బుద్ధి కలిగి పైన చెప్పబడిన సాధనలు చేయు చుందురో వారు ప్రభువు నందు చేరు జ్ఞానమునకు అధికారులగుదురు. వారు వాక్యమును గ్రహించి, అనుభవములో నుంచు కొందురు. ధర్మ శాస్త్రమునకు అతీతమైన దేవుని నీతి ప్రకారము వారు క్రీస్తు న్యాయ స్థానమందు మరణమునకు తీర్పు తీర్చబడరు మరియు పరలోక రాజ్య నివాసము వారిదే!</span></b><br /><br /><br /><br /><b><span style="font-size: large;"> యేసు క్రీస్తు - క్రీస్తు యేసు (పాట)</span></b><br /><br /><b><span style="font-size: large;">ఊపిరి కన్నా చేరువటా</span></b><br /><br /><b><span style="font-size: large;">ఊహాతీతుడు తానంటా</span></b><br /><br /><b><span style="font-size: large;">ఉన్నతులకు ఉన్నతుడంటా </span></b><br /><br /><b><span style="font-size: large;">ఉన్నది మాత్రము తానంటా</span></b><br /><br /><b><span style="font-size: large;">తానే యేసు ప్రభువూ | తానే యేసు ప్రభువూ ||ఊ||</span></b><br /><br /><b><span style="font-size: large;">1. ప్రేమే అతనికి తత్త్వమటా </span></b><br /><br /><b><span style="font-size: large;"> ప్రేమించుటకే వచ్చెనటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> ప్రేమను తిరిగి కోరునటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> అందుకె మార్గము చూపెనటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> తానే యేసు ప్రభువూ | తానే యేసు ప్రభువూ ||ఊ||</span></b><br /><br /><b><span style="font-size: large;">2. కన్యక మరియ తనయుడటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> మార్గము సత్యము జీవమటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> బోధించుటకే వచ్చెనటా </span></b><br /><br /><b><span style="font-size: large;"> తానే రక్షణ మార్గమటా </span></b><br /><br /><b><span style="font-size: large;"> తానే క్రీస్తు యేసూ | తానే క్రీస్తు యేసూ ||ఊ||</span></b><br /><br /><b><span style="font-size: large;">3. తండ్రిని పోలిన తనయుడటా </span></b><br /><br /><b><span style="font-size: large;"> పాలకుడై పాలించునటా </span></b><br /><br /><b><span style="font-size: large;"> యేసును నమ్మిన చాలునటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> అతడే తండ్రిని చేర్చునటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> తానే యేసు క్రీస్తూ | తానే యేసు క్రీస్తూ ||ఊ||</span></b><br /><br /><b><span style="font-size: large;">4. నన్నే క్రీస్తుగ మార్చునటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> క్రీస్తే యేసని తెలుపునటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> పరిశుద్ధాత్మ త్రిత్వమటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> వాక్యము, దైవము తానంటా</span></b><br /><br /><b><span style="font-size: large;"> తానే క్రీస్తు యేసూ | తానే యేసు క్రీస్తూ ||ఊ|</span></b><br /><br /><br /><b><span style="font-size: large;"><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-49200838859081741782014-02-28T05:15:00.000-08:002014-02-28T05:15:10.113-08:0013. విశ్వాసము వలన దైవము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">13. విశ్వాసము వలన దైవము<br /><br /> ''నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు నా యందు నీవును (తండ్రి) నీయందు నేనును (క్రీస్తు) ఉన్నలాగున వారును (సాధకులైన నరులు) మన యందు ఏకమై యుండ వలెనని వాక్యము. వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరు ఏకమై యుండ వలెనని ప్రవచనము '' (యోహాను 17:20-21). తండ్రికిని క్రీస్తునకును, క్రీస్తుగా మారిన సాధకునికిని అనుభవములో ఏకత్వమున్నదని ప్రవచనము.<br /><br /> వాక్యమనగా దేవుని వాక్యము. వాక్యమనగా వెలుగు. వాక్యమనగా జ్ఞానము. జ్ఞానము మొదట దేవుని యొద్ద ఉండెను. అనగా వాక్యము దేవుడైన జ్ఞాన స్వరూపి యొద్ద ఉండెను. ఆయన జ్ఞానమే వాక్యములో వెలుగుగా ప్రకాశించెను. ఆ ప్రకాశమే దేవుడయ్యెను. కనుక జ్ఞాన స్వరూపియైన దేవునికిని, ప్రకాశ స్వరూపమైన దేవునికిని భేదము లేదు. స్వరూపమైన జ్ఞానము అగోచరము. ప్రకాశించు జ్ఞానము అనుభావ్యము. ప్రకాశించు జ్ఞానము వలన సర్వము సృజించ బడెను. సృజించ బడిన దేదియు ప్రకాశము లేకుండా లేదు. చీకటి యున్ననే ప్రకాశము యొక్క ఉనికి గ్రహించ గలము. అంతయూ ప్రకాశమే అయినచో, యిక రెండవది లేనందున, ప్రకాశము యొక్క అస్తిత్వము తెలియ బడదు. లోకమే చీకటి. మనుష్యుల అంత:కరణయే చీకటి. ఈ చీకటి ద్వారానే వెలుగును గ్రహించ వీలగును. <br /><br /> వెలుగును గూర్చిన జ్ఞానము శుద్ధము. చీకటిని గూర్చిన జ్ఞానము మలినము. మలినమయి నప్పటికిని, అందు జ్ఞానమే మరుగై ఉన్నది. చీకటి అనగా అజ్ఞానము. అజ్ఞానము వలన సృష్టిని అనుభవించు చున్నాము. అయినను సృష్టికి సంబంధించిన అనుభవమునకు మూలము జ్ఞానమే. ఎందుకనగా జ్ఞానమే లేకున్న వెలుగును లేదు, సృష్టియు లేదు. కలిగిన దేదియు దేవుడు లేకుండా లేదు. అందువలన అజ్ఞానమునకు జ్ఞానము ఆధారమై ఉన్నది. అనుభవము అంత:కరణకే గాని హృదయమునకు కాదు. ఎందుకనగా అంత:కరణము ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన సృష్టిని అనుభవించు చున్నాము గాని హృదయమందు నివశించు దైవమును అనుభవించ లేకున్నాము. హృదయ ద్వారము తెరవ బడినచో దివ్యానుభూతి కలుగును. అందు కొరకు అంత:కరణమునందలి విషయ మాలిన్యము తొలగ వలెను. మనస్సులో విషయమందలి ఆసక్తిని, దైవము వైపునకు త్రిప్పినచో విషయానుభవమునకు బదులుగా దివ్యానుభూతి కల్గును. ఈ విధముగా అజ్ఞానమందు ఏ తెలివి యున్నదో అ తెలివిని విషయముల నుండి వేరు చేసినచో, ఆ తెలివియే శుద్ధ తెలివి లేక జ్ఞానము. ఏ జ్ఞానము మన అంత:కరణము ద్వారా ఇంద్రియములలోనికి ప్రవేశించి, చూచుట, వినుట, తాకుట, రుచి చూచుట, వాసన చూచుట అను ఇంద్రియ జ్ఞానముగా మారుచున్నదో, ఆ ఇంద్రియములు గ్రహించిన విషయ జ్ఞానమును వదలి, వాటికి మూలమైన సాక్షి జ్ఞానమును గ్రహించు చున్నామో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానమే దేవుడు, ప్రజ్ఞానమను వాక్యము దేవుని యొద్ద స్వరూపముగా నుండెను. ఇట్లు తనయందును , ఇతరుల యందును విచారించగా, అన్ని జీవులలోను, పశుపక్ష్యాదులలోను, సర్వకాల సర్వావస్థల యందును ఈ ప్రజ్ఞానమే ఉన్నది. ఇది ఒకే తీరుగా, ఒక్కటిగా నున్నది. జీవులును, జీవుల అనుభవములును ఎన్నైనను, ఈ ప్రజ్ఞానము మాత్రము అన్నింటిలోను వ్యాపకమై, ఒక్కటిగాను, ఒక్కతీరుగాను ఉన్నది. ఈ ప్రజ్ఞానమే దేవుడు, మొదట వాక్యము దేవుని యొద్ద జ్ఞాన స్వరూపముగా నుండి, పిదప సృష్టి యందు వ్యాపకమైన ప్రజ్ఞానమైనది. ప్రజ్ఞానము దేవుడై, సృష్టిగా మారి, అట్లు మారిన సృష్టిలో, ఎరుకగాను, తెలివిగాను ఉండెను. ఆ తెలివియే శుద్ధముగా నున్నచో జ్ఞానము, మరియు అంత:కరణ మాలిన్యము ద్వారా చూచినప్పుడు కలుగు అనుభవము అజ్ఞానము. శరీరానుసారమైన అనుభవములన్నియు అజ్ఞానము, ఆత్మానుసారమైనప్పుడు, ఇంద్రియములు తమకు తాము గ్రహించి, అనుభవించునది జ్ఞానము కాదని తెలియును. సకల జీవులకును తమ తమ ఇంద్రియములు గ్రహించు తెలివికి మూలమైనది జ్ఞానము. శరీరానుసారమైన అనుభవములు అసత్యమని యెంచి, వాటి నుండి విడుదల పొందిన వాడు తుదకు ఆత్మానుభవము నొందును , అనగా జ్ఞానమును సంపాదించును, అనగా క్రీస్తుగా మారును.<br /><br /> క్రీస్తు అయిన వాడు, తాను సర్వ వ్యాపకమైన యేసుక్రీస్తులో నున్నానని యెరుగును. అట్లు యెరిగి ఆయనకును తనకును భేదము లేనట్టి అనుభవమును పొందును. తానే సర్వవ్యాపకమైనట్టి దేవుడని భావించును. ఈ భావనయే తాను దైవ స్వరూపుడనని ఆతనిని స్థిరము చేయును. ఈ విధముగా స్థిరమైన వాడు క్రీస్తు యేసు నందు ప్రవేశించును. క్రీస్తు యేసు నందు ప్రవేశించిన వాడు యేసు క్రీస్తు నందు చేర్చుకొన బడును. తండ్రి నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు గాను, ప్రజలను తన స్వరూపముగా మారునట్లు అనుగ్రహించు వాడు క్రీస్తు యేసుగాను తెలియ వలెను. ఈ నామములు రెండును తండ్రి నుండి దిగి వచ్చిన స్థితికిని, ఆయన సంపాదించిన ప్రజలను తండ్రి యొద్దకు చేర్చు స్థితికిని సంకేతము. నిజమును పరిశీలించినచో యేసుక్రీస్తే క్రీస్తు యేసు. క్రీస్తు యేసైన వాడు యేసుక్రీస్తు నందు చేర్చుకొన బడును. వీనికి భేదమేమనగా దేవుడుగా భావించుచు, దేవుడు మనలను చూచునట్లుగా, ఆయన మాటలలో ఆయన యేసుక్రీస్తు. మనము ఆయన వలెనుండి, ఆయన స్వరూపమైనప్పుడు, మనము దేవుని వైపుకు తిరిగి మాట్లాడినప్పుడు మన స్థితి క్రీస్తు యేసు. రెండు స్థితులుగా చెప్పబడినప్పటికిని, అది ఒక్కటేగాని, అనుభవములో మాత్రమే భేదమున్నది. నేను క్రీస్తు యేసును అను భావములో ''నేను'' ఉన్నది. ఈ నేను శరీరానుసారమైన అనుభవము నుండి వచ్చు చున్నది. చివరికి ఆత్మానుభవమును పొందినప్పటికిని యీ ''నేను'' సాధకుని విడువ లేదు. ఆయన అనుగ్రహము వలన యీ ''నేను'' నుండి విమోచన నొందిన వాడు తన క్రీస్తు యేసు అనుభవములో తాను దైవమే యని యెంచు చుండును. దీనినే యేసుక్రీస్తు సాధకుని తనయందు చేర్చుకొనుట యందురు. <br /><br /> ఇప్పుడు తను వేరు, యేసుక్రీస్తు వేరు అను భావన నశించును మరియు తానును ఆయన స్వరూపమే అను భావన కూడా నశించును. అనగా ఒక్కటైనట్లు తెలియ బడును. ఫలితముగా తానే సర్వవ్యాపకుడైన ప్రభువునని సదా అనుభవములో నుండును. ఇట్టి వానికి ముద్రించ బడు దానిని సంచకరువు అందురు. <br /><br /> సంచకరువు ముద్ర పొందిన వాడు తనకును తండ్రికిని భేదమును యెరుగ వలెను. అనగా యెహోవా స్థితికిని , యేసుక్రీస్తు స్థితికిని భేదము తెలియ వలెను. కనుక తండ్రి స్థితిని మరియు తండ్రి లక్షణములను గుర్తెరిగి, తానున్న యేసుక్రీస్తు స్థితితో పోల్చుకొన వలెను. అట్టి పోలికలో భేదము లేదని రెండు స్థితులును ఒక్కటేయని యెరిగి అట్లుండుటయే తండ్రిగా మారుట. ఆ తండ్రి నుండి వచ్చిన యేసుక్రీస్తు అనుభవములో ఇద్దరును ఒక్కటే యని ఉన్నది. కాని సంచకరువు ముద్రించ బడిన వానికి మాత్రము తాను యేసుక్రీస్తు అయినప్పటికిని, తండ్రి వేరనియు, పరలోక రాజ్యములోనికి తానింక ప్రవేశించలేదని యుండును. ఇట్టి వానికి అభేదత్వమును ఉపదేశించ వలెను. <br /><br /> యెహోవా జ్ఞాన స్వరూపుడును, సత్య స్వరూపుడనూ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు సత్యమును మార్గమును అయి ఉన్నందున, ఆ స్వరూప స్థితియే వ్యాపక స్థితిగా మారినది. వ్యాపకము కాని జ్ఞానము స్వరూపమనబడును. వ్యాపకమగుచున్న జ్ఞానము ప్రజ్ఞానమనబడును. ఈ ప్రజ్ఞానమే సృష్టియందంతటను వ్యాపకముగా నున్నది. ఈ ప్రజ్ఞానమే అందరిలోను, అంతట వ్యాపించి, ప్రకాశించుచున్నది. ఈ ప్రజ్ఞానమే ఇంద్రియ వ్యాపారమునకును, శరీరానుభవమునకును ఆధారమై ఉన్నది. అజ్ఞానులు శరీరేంద్రియ అనుభవములు సత్యమని భ్రమింతురు. కాని జ్ఞానులు వాని అనుభవములన్నింటికిని మూలమైన ప్రజ్ఞానమును గుర్తించి, యెరిగి అట్టి అనుభవములో ప్రతిష్ఠితులై ఉందురు. అ విధమైన ప్రతిష్ఠ తనను యేసుక్రీస్తు నందు చేర్చి, సంచకరువు ముద్ర వేయ బడుటకు కారణమై ఉన్నది. తాను ప్రజ్ఞానమై ఉన్నందు వలన, తన వ్యాపక స్థితిని అనుభవించు చుండును. ఈ వ్యాపకమునకు సృష్టి ఆశ్రయమై ఉన్నది. కాని సృష్టికి పూర్వము సత్యము ఉన్నది. ఆ సత్య స్వరూపియే యెహోవా. యెహోవా తండ్రిగా మారినప్పుడు కుమారుని వెలువరించెను. కుమారుడు రాక పూర్వము అతడు తండ్రి కాడు కాని, సత్య స్వరూపిగా శాశ్వతముగా నుండి యుండెను.యెహోవాకును, తండ్రికిని ''ఉనికి''లో భేదము లేకున్నను, కుమారుని పంపుటకు నిశ్చయమైనవానిగాను, కుమారుని ద్వారా సృష్టి యేర్పడుటకును, పరిణామమునకును, అ సృష్టి లయమగుటకును కారణమై ఉండెను. కారణముగా నున్నప్పుడు తండ్రి అని పిలువ బడినప్పటికిని, సృష్టికి పూర్వము ఆయన తండ్రిగా లేడు గాని, సత్యముగా నుండెను.<br /><br /> యేసుక్రీస్తు నందు సంచకరువుగా ముద్ర నొందిన వాడు తన సర్వ వ్యాపకత్వ అనుభవమును సృష్టి ద్వారా పొందుచున్నాడు. కాని సృష్టి యున్నను, లేకున్నను తాను తండ్రి వలె సత్యమని యెరిగిన వాడు, తన యొక్క ఉనికిని సృష్టి ద్వారానే గాక, తనకు తానే ఉన్నానని యెరుగును. ఎందుకనగా వాక్యమను ప్రజ్ఞానము దేవుడైన యెహోవా వద్ద ఉండెను. తాను వాక్యమై ఉన్నందున, తాను వ్యాపకమైన దేవుడుగా కాక, కారణమందు నిలచి యున్న దేవునిగా యెంచుకొన వలెను. దేవుడైన వాడు ఒక్కడే. కారణమందున్నను లేక కార్యమందున్నను ఒక్కడే. అనగా దేవుని యొద్దనున్న వాక్యమైనను, దేవుడైన వాక్యమైనను ఒక్కటే. అనగా జ్ఞాన స్వరూపమైనను, ప్రజ్ఞానమైనను ఒక్కటే. సృష్టియందున్న సత్యము ప్రజ్ఞాన మైన వాక్యము. సృష్టికి పూర్వమున్న వాక్యము జ్ఞాన స్వరూపము. కనుక ప్రజ్ఞాన వాక్యముగా నున్న సాధకుడు సృష్టియందున్న తానుగా గుర్తెరుగుట మాని, తనకు తానుగా సృష్టికి సంబంధములేకనే యున్నాడని గుర్తెరిగి యుండును. అటుల ఉండుటయే స్వరూప జ్ఞానము. ఈ జ్ఞాన స్వరూపము దేవుని యొద్ద వాక్యముగా నుండెను. దేవుని యొద్ద ఉండుటయే పరలోక రాజ్య నివాసము. కనుక ఈ వాక్యమే స్వరూపమైన పరిశుద్ధాత్మగా తండ్రి యొద్ద ఉన్నది మరియు ప్రజ్ఞామైన పరిశుద్ధాత్మగా యేసువద్ద నున్నది. ఇంను క్రీస్తుగా మారి క్రీస్తు యేసు నందు ప్రవేశించిన ఆత్మ ఈ పరిశుద్ధాత్మ చేతనే అభిషేకించబడి కూడా పరిశుద్ధాత్మగానే యెంచ బడి యున్నది. ఈ విధముగా ఒక్క పరిశుద్ధాత్మయే స్థితి భేదముచే అనుభవము నందు త్రిత్వమగు చున్నది. ఈ త్రిత్వము అనుభవము పొందిన వారెవరనగా ముందుగా సంచకరువు ముద్రను పొందిన వారే. ఇది వారి హృదయములో యేసు రాకడ వలన జరుగు చున్నది. దీనినే యేసు యొక్క రెండవ రాకడగా చెప్పుచున్నారు. మొదటి రాకడ ప్రభువుగా మన వద్దకు వచ్చినది. ఇప్పుడు సాధకుని స్థితులను బట్టి ఆయన తన హృదయములో ప్రవేశించి, పరలోక రాజ్య నివాసము స్థిరము చేయుటను రెండవ రాకడగా తెలియ వలెను. ఈ రెండవ రాకడకు సిద్థమైన వారికి, అనగా సంచకరువు ముద్ర నొందిన వారి హృదయములో అనుభవమగును. ఈ అనుభవమే యేసు స్థితి. ఇట్లుండటయే ''ఈ ఆత్మ పరిశుద్ధాత్మయే '' అని యుండుట. యేసు విశ్వశక్తి యందు సాదృశ్య పరచుకొనుటయే యెహోవా స్థితి.<br /><br />పరిశుద్ధాత్మ ధ్యానము<br /><br />దేవుడు ఉన్నాడు!<br /><br />ఆ దేవుడే మానవ రూప ధారియై అవతరించిన యేసు!<br /><br />చరాచరాత్మకమైన స్థూల, సూక్ష్మ, మానసిక దైవీ సృష్టి అంతా ఆ యేసే!<br /><br />అట్టి యేసుక్రీస్తు నే నేనుగా కలిగి ఉన్నాను!<br /><br />యేసు యందు ఉనికి గలిగి యున్నట్టి నాలో అట్టి యేసే అంతా తానై సత్యత్వ స్థితిగాను పరిశుద్ధాత్మగాను నిజ ఉనికి కలిగి ఉన్నాడు ఇదే సత్యము!<br /><br />ఈ సత్యానుభవ సంబంధమైన ఎరుకను అనుభవింపజేసేదే క్రీస్తు చైతన్యము!<br /><br />ఆ చైతన్యమే నేను!<br /><br />అది పరిశుద్ధాత్మయే!<br /><br />నేను అదే అయి ఉన్నాను!<br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-1943261702919200032014-02-28T05:12:00.001-08:002014-02-28T05:12:26.036-08:0012. హృదయము - అంత:కరణ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">12. హృదయము - అంత:కరణ<br /><br /> ప్రవచనము గైకొనిన వాని మనస్సు విశాల పరచ బడును. ప్రవచనము వినవలెననిన ముందుగా అతని అంత:కరణ సంకుచితత్వము నుండి విశాల పరచ బడవలెను. పౌలు అను అపొస్తలుడు ఈలాగు వచించు చున్నాడు. ''మా హృదయము విశాల పరచబడి ఉన్నది. మీ అంత:కరణ సంకుతమై ఉన్నది. మీయెడల మాకున్న అంత:కరణమునకు మీరును మీ హృదయము విశాల పరచుకొనుడి'' (2కొరింథి 6:11-13). నుక విశ్వాసుల అంత:కరణ విశాల పరచుకొనుట అనగా ఆత్మానుసారముగాను, ప్రేమతోను ఉండుట. అప్పుడే ప్రవచనములను గైకొనగలరు. ప్రవచించు వారు దైవజనులు కనుక, హృదయ విశాలము వలన విశ్వాసి క్రీస్తుగా పరిణామము పొందును. ఎందుకనగా సంకుచితమైన అంత:కరణ విశాలమైనచో హృదయ ద్వారమును తట్టి తెరిపించును (తట్టుడి తెరవబడును అను వాక్యము) మరియు తన శరీరమునకు సంబంధించిన స్వభావముచే యేర్పడిన వ్యక్తిత్వము నశించును. అట్టి విశాల పరచ బడిన అంత:కరణ దైవమునకు చోటు కల్పించును. <br /><br /> నీ హృదయములో ఆయన వశించుచున్నాడు. ''తనను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు(అంత:కరణ) యేర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు'' (అపొ||కా 17:27). హృదయ ద్వారము తెరవ బడినచో ఆయన మనలోనే ఉన్నాడను జ్ఞానము కల్గును. <br /><br /> నిజమైన క్రీస్తు స్థితిలో ప్రతిష్టితము కావలెనన్న విశ్వాసులు దేవుని విషయమై ఆయన అందరి హృదయములలో ఏకత్వముగా నున్నట్టి యేసుక్రీస్తుగా ఉన్నాడని ఎరుగ వలెను. దీనికి బోధ ఇట్లుండెను. <br /><br /> నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నడచుకొనుడి. ''అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే. మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను, అని ప్రభువు సెలవిచ్చెను'' (ప్రకటన 2:23). ''మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించు కొనుడి'' (2కొరింథి 13:5).<br /><br /> జనులు శరీరములుగా చూచినచో అనేకులుగా నున్నారు. ఒకడు తన హృదయమును తెలిసికొనినచో, అందు నివశించు దైవము సర్వవ్యాపకమై యున్నట్లు జ్ఞానమును పొందును. అందు వలన దేవుడు ఒక్కడే అందరి హృదయములలో ఏకత్వముగా వశించు చున్నాడడని తెలియును. కనుక హృదయములను పరీక్షించు కొనిని వాడు శోధకుడు. శోధకుడైన విశ్వాసి దైవమును తెలిసి కొన గలడు. దైవమును తెలియుటయే జ్ఞానము. జ్ఞానమనగా దైవము. జ్ఞాని యైన వాడును దైవమే. అట్టి దైవమే సత్యము, ఏకము, నిత్యము, సర్వము అయి ఉన్నాడు మరియు లక్ష్యమును, గమ్యమును, అనుభూతియు అయి కూడా ఉన్నాడు.<br /><br /><br /><br /><br /><br /><br /><br />దైవ ప్రార్ధన<br /><br />1.దయామయుడగు ఓ ప్రభువా! నామాట చేతను, క్రియ చేతను మరియు ఆలోచనలలో కూడా ఏ విధమైన హాని యెవరికిని కలుగనీయక, మెలుకవ లోను, కలలోను మరియు గాఢనిద్రలో కూడా నిన్ను ఆరాధించు వానిగా నుండు లాగున నన్ను అనుగ్రహించుము.<br /><br />2. కరుణామయుడగు ఓ ప్రభువా! నా మాట చేతను, క్రియ చేతను మరియు ఆలోచనలలో కూడా సర్వకాల సర్వావస్థలలో ప్రపంచములో ఏ జీవికైనను నా వలన ఉపకారము జరుగునట్లును, నేను అందరి యందును ప్రభువునే చూడ గల ప్రేమ స్వభావము నాకు లుగు లాగున నన్ను ఆశీర్వదించుము.<br /><br />3.జ్ఞాన స్వరూపుడవగు ఓ ప్రభువా! నా మెలుకువ లోను, కలలోను మరియు గాఢ నిద్రలోను ఈ మూడు అవస్థలకు మూలమైన నా యొక్క అవయవములలోను, ఇంద్రియములలోను, శరీరానుసారమైన మనస్సులోను ఏ విధమైన దోషములు, చెడు తలంపులు కలుగ నీయ కుండా, నేను సదా ప్రభువు నామమునే ధ్యానించు లాగున నన్ను ఆశీర్వదించుము.<br /><br />4. తండ్రికి ప్రియమైన ఓ ప్రభువా! నాపై ఎవరెన్ని నిందలు మోపినను, నాకు హాని చేసినను, అవి అన్నింటిని సహించగల సహనమును, ఓర్పును, నాకు దయ చేసి తిరిగి వారికి హాని కల్గించుటకు బదులుగా, వారిని క్షమించు హృదయమును నా కొసంగుము. ఏ పరిస్థితులలో నైనను సత్యస్వరూపియైన నిన్ను విశ్వసించుటలో నా మనస్సు కొంచమైనను చలింపకుండునట్లు నన్ను అనుగ్రహించుము! ఆశీర్వదించుము!<br /><br />ఉజ్జీవ ప్రార్ధన<br /><br />ఓ ప్రభువా! దైవ కుమారా! స్వర్గ రాజ్యములోనూ, భూమి పైన ఉన్న సత్య స్వరూపా ! నీ నామము వైభవో పేతముగా వెలుగొందుగాక! <br /><br />నీ ఉజ్జ్వల సామ్రాజ్య వైభవము వచ్చి యున్నది. <br /><br />స్వర్గ రాజ్యములో వలెనే భూమిపై కూడా నీ ఇచ్ఛ నెరవేరుతుంది!<br /><br />నన్ను ప్రలోభములోనికి నడిపించక చెడునుంచి మంచికిని మరియు మంచి చెడుల నుండి క్రీస్తు లోనికి నడిపించుము!<br /><br />ఈ సామ్రాజ్యము, శక్తి, వైభవము ఎప్పటికిని నీవే గనుక ఓ ప్రియతమా! కరుణామయా! నన్ను క్రీస్తు యేసుగా ఉజ్జీవింజేసి, నాలో నివశించు పరిశుద్ధాత్మగా నిన్ను నాకు వ్యక్త పరచుము ప్రభూ!<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-92178246914265738332014-02-28T05:10:00.000-08:002014-02-28T05:10:09.801-08:0011. పరిచర్య - ప్రవచనము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">11. పరిచర్య - ప్రవచనము<br /><br /> ''ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు (అపొస్తలులకు) అనుగ్రహించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనునట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బ్రతిమాలుకొను చున్నాము'' (2కొరింథి 5:18,20). దేవుని అనుగ్రహముతో విశ్వాసులు క్రీస్తుగా మారునట్లు అపొస్తలులు క్రీస్తు తరఫున పరిచర్య చేయుదురు. అయినను ఈ పరిచర్య అన్యజనులైన వారికి కూడా జరుపబడుచున్నది. విశ్వాసులలో నున్న భేదమును బట్టి పరిచర్య అనేక విధములు. ఈ పరిచర్య వేడుకొనునట్లు, బ్రతిమాలు చున్నట్లు, హెచ్చరించుచున్నట్లు, భాషించుచున్నట్లు, బోధించుచున్నట్లు, చివరిగా ప్రవచించుచున్నట్లు జరుగును. అపొస్తలులు ఈ విధముగా సమస్త జనులకు క్రీస్తు తరఫున రాయ బారులై ఉన్నారు. <br /><br /> ''ప్రవచన వరమైతే విశ్వాసపు పరిమాణము చొప్పున ప్రవచింతురు. పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువారైతే బోధించుటలోను , హెచ్చరించువారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందురు, పంచి పెట్టు వాడును శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయు వాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిపించ వలెను. పరిచర్య ప్రేమతో జరుప వలెను. పరిచర్య ప్రభువును సేవించుటయే. ఆత్మ యందు తీవ్రత కలవారై నిరీక్షణ కలవారౖౖె సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్ధనయందు పట్టుదల కలవారై ఉండవలెనని తెలుప బడెను.'' (రోమా 12:7,8,11,12). <br /><br /> పరిచర్య చేయు వారు అందరిని ప్రేమించు వారై ఉండ వలెను. జనులు చెడ్డ వారు, వివాదము రేపు వారు, అవిశ్వాసులు, సహనము లేనివారు అని అనేక విధములుగా నున్నప్పటికిని, వాటిని యెంచక ప్రేమ కలిగినవారై యుండ వలెను. పరిచర్యులు వారు చేయు సహవాస కార్యక్రమము దేవుని కొరకు జరిపించు చున్నట్లు ఉండ వలెను. తనకేమి జరిగినను ధైర్యముతోను, ఓర్పుతోను దైవ కార్యమగు పరిచర్యను విధేయతతో చేయ వలెను. శరీరానుసారులను ఆత్మానుసారులుగా మార్చుటకు చేయు పరిచర్య తాను ఆత్మ యందుండి జరుపునదిగా ఉండ వలెను. విశ్వాసి క్రీస్తుగా మారవలసిన పరిచర్య, తాను పరిశుద్ధాత్మగా నుండి జరుపవలెను. పరిచర్య చేయు వారు శరీరానుసారులు కాదు, ఆత్మానుసారులును కాదు, కనీసము ఆత్మయందున్న వారుగా నుండ వలెను.<br /><br /> ఇంను యీలాగు చెప్పబడినది. ''వాక్యముచేతను, క్రియ చేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలము చేతను, క్రీస్తు ద్వారా చేయించిన వాటిని గూర్చియేగాని మరిదేనిని గూర్చియు మాటలాడ తెగింప రాదు'' (రోమా 15:19). పరిచర్య కొరకు ఆధారమును ఋజువును చూపునట్లుగా వారు దేవుని వాక్యము ద్వారా సత్యమును తెలియ జేయ వలెను. ఆయన మార్గమును చూపించ గల ప్రేమ, కరుణలను విశద పరచుట ద్వారా సత్యము యొక్క లక్షణమును తెలియజేయ వలెను. మనకు తెలిసిన దేని నుండైనను ప్రారంభించి మూల కారణమైన సత్యమును నిరూపించ వలెను. అనగా శరీరానుసారమైన వారికి బాగుగా తెలిసిన స్ధూల , సూక్ష్మ శరీరములను వివరించి, అటులనే లోకములను వివరించి, వీటన్నింటికి ఆధారమైన దేవ దూతల కార్యమును, వారికి ఆధారమైన దేవుని గురించి తెలుపుట ద్వారా సత్యమును తెలియ జేయ వలెను. ఈ విధముగా సత్యము యొక్క ఉనికిని ఋజువు పరచగల గుర్తులను తెలియజేయ వలెను. ప్రభువు చూపించిన మహత్తులను చెప్పుచు, గొప్పదైన సత్యస్వరూప మెట్టిదో చెప్పవీలగును. చివరగా తాను చేయు పరిచర్య తనకు తానుగా జరుపుట లేదనియు, అది క్రీస్తు ద్వారానే జరుప బడుచున్నదనియు చెప్పి, దానిని ప్రమాణముగా స్వీకరించునట్లు ప్రయత్నించ వలెను. ఎందుకనగా క్రీస్తు యేసే సత్యమునకు ప్రమాణము మరియు ఎవరెన్ని బోధించినను, యేవిధముగా పరిచర్య చేసినను అవి అన్నియు క్రీస్తు ద్వారానే జరుప బడుచున్నవని తెలియ వలెను.<br /><br /> ''యెహోవా ఆత్మ నాద్వారా పలుకు చున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది.'' <br /><br />(2 సమూయులు 23:2) అని దావీదు అను దైవజనుడనెను. <br /><br /> ''ఒక్కడే బోధకుడు, మీరందరును సహోదరులు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు'' (మత్తయి 23:8,9,10). బోధకులందరు దైవముచే స్ఫురించిన వాక్యములనే చెప్పుచుందురు కనుక, మనము బోధకుల బోధను శరీరానుసార వాక్యముగా నెంచక, క్రీస్తు యేసు వాక్యమే మనకు అందించ బడు చున్నదని తెలియ వలెను. అందు వలన బోధకులు ఎందరైనను ఒక్కడేనని యెంచి, అతడు క్రీస్తు అను గురువని తెలియ వలెను. మనమందరమును దేవుని బిడ్డలమైనందున క్రీస్తు జ్యేష్ట కుమారుడనియు, మనము సహోదరులమనియు భావించుటయే సత్యము. బోధకుడైనను, క్రీస్తైనను, మనమైనను, హెచ్చు తక్కువలు లేక, తండ్రి విషయములో అందరికిని ఆయన ఒక్కడే, అతడే యెహోవా. పవిత్రమైన శరీరధారియైన క్రీస్తే మనలను తండ్రి యొద్దకు చేర్చగల అధికారియై నందున క్రీస్తు మనకు గురువు కూడా అయి ఉన్నాడు. తండ్రి వాక్యమే క్రీస్తు వాక్యము. క్రీస్తు బోధే తండ్రి బోధ. క్రీస్తు గురువు తప్ప మిగిలిన వారందరు ఆయన ప్రతినిధులు మరియు ఆయన స్ఫూర్తితో ప్రవచించు వారే గాని, వారికి వారే బోధకులు కాదు. క్రీస్తు బోధ యందు ''కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు ఉన్నవిగాని అందరిలోను అన్నీ జరిపించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించ బడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మమూలమునైన బుద్ధి వాక్యమును , మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, ఆత్మ వలననే విశ్వాసమును యింకొకరికిని, మరియొకనికి ఆ ఆత్మ వలననే స్వస్థ పరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును, యీలాగున ఒక్కొక్క బోధకునికి ఒక్కొక్క విధముగా అనుగ్రహించుచున్నాడు. అయినను ఆత్మ ఒక్కడే తన చిత్తము (దేవుని చిత్తము) చొప్పున ప్రతివానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ జేయుచున్నాడు'' (1కొరింథి 12:4-11). <br /><br /> బోధకులు అనేక విధములుగా నున్నారు. ఎందుకనగా సాధకులు కాని వారును, సాధనచే క్రీస్తు మార్గములో నడచుచున్న వారును కూడా అనేక విధములుగా నున్నారు. అట్టి జనుల స్ధాయిని బట్టి ఎవరికి ఏవిధమైన బోధ అవసరమై యున్నదో, దానిని అందించుటకు ఈ బోధకులు ముఖ్యముగా నాల్గు స్ధాయిలలో నియమించ బడిరి. అది యెట్లనగా అంధ మనస్సు కలిగి తమోగుణులుగా నున్న అన్య జనుల కొరకును, దైవము గురించి తెలిసి నప్పటికిని రజోగుణము వలన దేవుని నమ్మని అవిశ్వాసుల కొరకును, ఒక బోధకుడుండును. ఇతడు సత్వ గుణములో నున్న విశ్వాసిగా అనుభవించుచు, దైవ వాక్యమును అందించు చుండును. ఈ విశ్వాసియైన బోధకుని ద్వారా అన్యజనులును, అవిశ్వాసులును విశ్వాసులుగా మార గలరు. దీని కొరకు ఆత్మ మూలమైన బుద్ధి వాక్యము అందించ బడును.<br /><br /> విశ్వాసి అయిన వాడు ఆత్మానుసారముగా నడచుకొనును. అతనికి ఆత్మను అనుసరించుటకు అవసరమైన జ్ఞానము నిచ్చువాడు కాపరియైన బోధకుడు. బోధకుడు ఆత్మానుభవములో నుండును. ఇతడు చేయు బోధ క్రీస్తు అనుసరించిన జ్ఞాన వాక్యముగా నుండును. <br /><br /> క్రీస్తు యేసు స్థితి నందుండు వాడు ప్రవక్త. ఈ బోధకుడు జ్ఞానము నొందిన సాధకునికి క్రియా మూలమైన విశ్వాసమునకు బదులుగా ఆత్మ వలననే విశ్వాసి యగునట్లు మార్చును. అందు కవసరమైన దేవుని వాక్యము అందించ బడును. సాధకుడు క్రీస్తుగా మారును. <br /><br /> యేసు క్రీస్తుతో సమానమైన ఆయనతో ఐక్యత నొందిన వాడును, ఆయనచే నియమించ బడిన వాడు, అతడే అపొస్తలుడు. ఇతడు ప్రవచనము చేయ గలడు. తన అనుభవముతో క్రీస్తుగా మారిన వారిని క్రీస్తు యేసు నందు ప్రవేశఙంప జేయుటకు సమర్ధుడు. దీనినే ఆత్మ వలన స్వస్థ పరచుట అందురు. <br /><br /> యేసు క్రీస్తు ద్వారా జరుప బడిన అద్భుతములను తానును చేయ గలిగిన శక్తి కలిగిన బోధకులు కొందరు గలరు. వారు బాధలలో నున్న వారికి స్వస్థతను చేకూర్చుట ద్వారా అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చ గలరు. ఈ విధముగా బోధకులు ఎన్ని విధములుగా నున్నను, వారు అందించు వాక్యము ఎన్ని విధములుగా నున్నను, బోధకుడు ఒక్కడే. వాక్యము ఒక్కటే. తండ్రియు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే. ఎందుకనగా దైవ జనులైన బోధకులు అన్ని స్థాయిలలోను దైవము నుండి లభించు స్ఫూర్తి వలననే దేవుని వాక్యమునందించు చున్నారు. ఈ వాక్యము స్థాయిని బట్టి బుద్ధి వాక్యములు, జ్ఞాన వాక్యములు , స్వస్థత వాక్యములు మరియు పరిచర్యలుగా నున్నవి.<br /><br /> పరిచర్య అందరికిని ఉద్దేశించ బడినది. అన్యజనులు దీనిని నాలుగు విధములుగా స్వీకరించెదరు.<br /><br /> ''ఎవడైనను (పరలోక) రాజ్యమును గూర్చిన వాక్యము వినియు దానిని గ్రహింపక యుండగా దుష్టుడు వచి ్చవాని హృదయములో విత్తబడిన దానిని యెత్తుకు పోవును. త్రోవ ప్రక్కన విత్త బడినవాడు వీడే.<br /><br /> రాతి నేలన విత్తబడినవాడు వాక్యము వినిన వెంటనే సంతోషముతో దానిని అంగీకరించు వాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంత కాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగ గానే అభ్యంతర పడును.<br /><br /> ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచి వేయును గనుక వాడు నిష్పలుడగును. <br /><br /> మంచి నేలన విత్తబడిన వాడు సఫలుడై యొకడు నూరంతలుగాను, ఒకడు అరువదంతలు గాను, ఒకడు ముప్పదంతలుగాను ఫలించును.'' (మత్తయి 13:19-23). <br /><br /> అన్యజనులైన వారిలో దేవుని వాక్యమును స్వీకరించుటలోను, విన్న దానిని గ్రహించుటలోను, గ్రహించిన దానిని విచారణ చేయుటలోను మరియు వాక్యానుసారము నడచు కొనుటలోను కొందరు విఫలమగుచున్నారు. <br /><br /> ఒక విత్తనము త్రోవ ప్రక్క పడినచో అందరు దానిని త్రొక్కుటచేత అది మొలవదు, అటులనే వాక్యము కొందరి చెవులలో పడినను, ప్రాపంచిక విషయములు అతడిలో తిష్ఠ వేసి ఉన్నందున ఆ వాక్యము ఫలించదు. అట్లే దుష్టుని సహవాసము వలన విన్న వాక్యము నిరర్ధకమగును. <br /><br /> రాతి నేలపై విత్తబడిన విత్తనమునకు వేరు ఏర్పడదు. అందుచే వాక్యమును ఇతడు సంతోషముగా అంగీకరించును కాని వేరు కలగనందున అది అంకురించదు. ఈ వాక్యము కొంత కాల మతనిలో నుండును గాని, అతనికి వాక్యము నిమిత్తము శ్రమకలిగినను, ఇతరులచే కష్టనష్టములు కలిగినను ఆ వాక్యమును విడచి వేయును. <br /><br /> ముండ్ల పొదలలో నాటబడిన విత్తనమునకు బలము చేకూరక, బదులుగా ముండ్ల చెట్లు బలముగా పెరుగును. ఈ ముండ్ల చెట్లు, నాట బడిన విత్తనమును పెరగ నీయవు. అటులనే ధన వ్యామోహము, భార్యా బిడ్డలపై వ్యామోహము, కీర్తి ప్రతిష్ళలకై పాకులాడుట వంటివిని, వీటి కొరకై తాను ఏర్పాటు చేసికొన్న యితరులతో నిరంతరము వ్యవహరించు చుండుట వలన, వాక్యము అణచి వేయ బడి నిష్ఫలమగును.<br /><br /> మంచి నేల యనగా, వాక్యమును గ్రహించి, విచారణ చేసి, వాక్యానుసారము జీవించు బుద్ధి. ఇక్కడ వాక్యము అంకురించి, లోతైన వేరు కలిగి, మఱ్ఱి చెట్టు విస్తరించి నట్లుగా తాను విశ్వాసిగా మారి, క్రీస్తుగా మారి, ఆయన ప్రజలుగా నెంచ బడును.<br /><br /> మంచి నేల వంటి అంత:కరణను సంపాదించ వలెననిన (1) దైవమును తెలిసికొన వలెనను తలంపు కలిగినంతనే, ఆ తలంపును అణచు కొనరాదు. (2) వాక్య రహస్యములను తెలిసి కొనునప్పుడు దుష్ట సాంగత్యమును కొనసాగించక, సజ్జన సాంగత్యము కొరకు ప్రయాస పడ వలెను. (3) సాతాను సంబంధ స్వభావమును విడచి, దాని ప్రభావమునకు లోనవ రాదు. (4) లోక విషయములు, ధనాపేక్ష మొదలగునవి దైవానికి విరోధమని యెంచి, దైవము వైపుకు తిరగ వలెను. ఈ విధముగా తలపులలోను, మాటలలోను, చేతలలోను పాటించ వలెను. <br /><br /> ఇంను పరిమిత పరచ బడిన అంత:కరణము వలన కులము, బలము, యౌవ్వనము, ఆస్తి పాస్తులు, సంపద, తెలివి తేటలు, జ్ఞానము అనునవి ఇతరుల కంటె తన కెక్కువ అను అహంకారమును, లేదా ఇతరుల కంటె తనకు తక్కువ అను దీనత్వమును కలిగియుండ రాదు. మరియు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, సోదరులు, ధనము, మిత్రులు, తన శరీర సౌఖ్యము అను ఎనిమిది విధములైన పాశములచే బంధించ బడరాదు.<br /><br /> వాక్యము విను నప్పుడు తన దేహ సంబంధ, లోక సంబంధ ధ్యాసను విడచి మరియు యింతకు ముందు తాను వినిన విమత బోధలతో తనకు కలిగిన భావనను సైతము వదల వలెను. ఈ మూడు ధ్యాసలు సాధకుని సరిగా విన నీయవు, గ్రహింపనీయవు కనుక వీటిని విడచిన వాడే అంత:కరణ శుద్ధి కలవాడు, అనగా సారవంతమైన మంచి నేల. కనుక పరిచర్య ఫలించుట అనగా మంచి నేలపై విత్తబడిన వాక్యము. ఇతడే అచంచల విశ్వాసముతో క్రీస్తు స్థితినొందును. దీనిని క్రీస్తును సంపాదించు కొనుట అనబడును. <br /><br /> ''క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నీతిని గాక, క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి గలవాడై, ఏవిధము చేతనైనను మృతులలోనుండి పునరుత్థానము కలుగ వలెనని....., సమస్తమును (లోక సంబంధమైన వాటిని) నష్ట పరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొన వలెను.'' (ఫిలిప్పీ 3:9-11). అయినను, అతడు భాషణ వలన గాక, ప్రవచనము మూలముగానే క్రీస్తు యేసు నందు ప్రవేశించును. భాషించుటకును ప్రవచనమునకు భేధము తెలియ వలెను. <br /><br /> ''ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగ లేదు. కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించ బడినవారై దేవుని మూలముగా పలికిరి.''(2పేతురు 1:20,21) అపొస్తలులు మరియు పరిచర్య చేత , తన ఊహ వలన పుట్టినది భాష యగును. భాషించుట వేరు, ప్రవచించుట వేరు. <br /><br /> ''ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు సూచక మగును.'' ప్రవచనము క్రీస్తు లోకము నుండి దేవుని వలన అందింపబడును. ప్రవచనము వలన క్రీస్తుయేసు నందున్న విశ్వాసులు దైవత్వము నొందుదురు. ''భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమగును.'' భాషవలన అవిశ్వాసి సాత్వికుడగును. అవిశ్వాసి ప్రవచనము వినుట వలన తాను పాపినని (శరీరమే సత్యమని పొరపడితినని) తెలిసికొనును. దేవునిపై విశ్వాసము కలిగి విశ్వాసిగా మారును. ఇంను ''హృదయరహస్యము బయలు పడును. అందువలన దేవుడు నిజముగా తనలోనే ఉన్నాడని అతనికి ప్రచురమగును'' (1కొరింథి 14:22,23,25).<br /><br /> ప్రవచనము అందరిలోను తగిన మార్పు ననుగ్రహించునని స్పష్టమగు చున్నది. సువార్తయే ప్రవచనము. ఇది సమస్త జనులకు ఉద్దేశించ బడినది. <br /><br /> ''సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా నుంచ బడి, యిప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియజేయునదే ప్రవచనము'' (రోమా 16:25-27).<br /><br /> అనాది నుండి అనగా పాత నిబంధన కాలము. అప్పుడైతే విశ్వాసము అనునది దేవుని నామముపై నుండినది. అది భక్తితో అంతమైనది. అప్పుడు జ్ఞానము రహస్యముగా నుంచ బడినది. నూతన నిబంధన కాలమందు క్రీస్తు మార్గము తెలియ జేయ బడినది. దీని వలన జ్ఞానము కలుగును. ప్రాచీన కాలమందు క్రియా మూల విశ్వాసమే యున్నది. ఇప్పుడైతే ఆ విశ్వాసము అదృశ్యుడగు దేవుని తెలిసికొనదగిన విశ్వాసము, పిమ్మట అనుభవములోనికి చేర్చగల విశ్వాసము. ఇట్టి విశ్వాసమునకు విధేయత అనగా జ్ఞానము వలన ఎరిగిన దైవమునకు సర్వ సమర్పణ గావించు కొనుట. సర్వ సమర్పణ యనగా, తన శరీరమునకును, లోకమునకు సంబంధించిన వానిని అర్పణ చేయుట. అప్పుడైతే దైవమునకును విశ్వాసికిని అనుభవములో బేధము ఉండదు. ఇదియే అప్పటి నుండి రహస్యముగా నుంచబడిన మర్మము.<br /><br /> ఈ మర్మమును విప్పునదే సువార్త. దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ప్రవచింతురు కనుక వారి ప్రవచితములు దేవుని వాక్యములగును. ''దైవ జనులగుట ఎట్లనిన దైవజనులు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడవలెను'' (1తిమోతి 6:11-12).<br /><br /> ఏ నరుడైనను దైవ జనులగుట సాధ్య పడును. దీని కొరకు దేవుని నీతిని, దేవుని యందు భక్తి విశ్వాసములను, ప్రేమ, సహనము, ఓర్పు, త్యాగము, నిగ్రహించు సమర్థతలను సాధించ వలెను. ఇట్టి వారి అంత:కరణ విశాల పరచ బడి, సంకుచితమగు వ్యక్తిత్వము నశించును. అందువలన వీరిలో దైవము వాక్యముగా ప్రవేశించును. అప్పుడే దైవ జనుడు పరిశుద్ధాత్మకు తన యందు చోటు కల్పించు కొనును. పరిశుద్ధాత్మచే అభిషేకించ బడిన దైవ జనుల మనస్సును, మాటలును తనవి కాక, దైవమునకు సంబంధించినవే అగును. కనుక వీరు ఉచ్ఛరించు వాక్యములు భాషణ గాక ప్రవచనములగును. <br /><br /> దైవజనుని అధికారమేమనిన, ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజన కరమై ఉండును.'' (2తిమోతి 3:16,17). ఎందుకనగా ఇతడు భాషించుట లేదు. దేవుడు అందించునదే చెప్పు చున్నాడు. కనుక అంతయు దేవుని సంకల్పమైనందున, దైవ జనుడు యేసుక్రీస్తు వలె సర్వాధికారియగును. దైవ జనులు ఉచ్ఛరించు వాక్యములు అందరికిని, అన్ని విధముల అందించ బడును. కాని ప్రవచించ గల దైవ జనులు వేరుగా నున్నారు. <br /><br /> ప్రధాన యాజకుడైన ప్రభువుచే నియమించ బడిన దైవజనులు మాత్రము ప్రవచింపగలరు. ఎందుకనగా యేసే ప్రధాన యాజకుడు. '' దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకున్నాడు.'' (హెబ్రి 4:14) <br /><br /> యేసే ప్రధమ అపొస్తలుడు. ''అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి.'' (హెబ్రి 3:1). ''ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను.'' (ప్రకటన 1:6).<br /><br /> ''ఈయన నిరంతరము ఉండువాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను.'' (హెబ్రి 7:24). కనుక ఆయన వల్లనే దైవజనులు యాజకులై ప్రవచించ గలుగుచున్నారు. అందువలన అదృష్టవంతులైన విశ్వాసులు ప్రవచనము వలన ఆత్మను బల పరచుకొని శరీర భావము నుండి విమోచన నొందుదురు. కనుక ''ప్రవచన వాక్యము గైకొనువాడు ధన్యుడు'' (ప్రకటన 22:7). ఎందుకనగా ప్రవచనము ద్వారా దివ్యానుభవము లభించును. <br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-87220634908958956762014-02-28T05:07:00.002-08:002014-02-28T05:07:41.205-08:0010. వైరాగ్యము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">10. వైరాగ్యము<br /><br /> ప్రసంగిచేయు ప్రసంగములన్నియు వైరాగ్యమును సూచించుచున్నవి.<br /><br /> ''చీకటి కంటె వెలుగు ఎంత ప్రయోజన కరమో బుద్ధిహీనత కంటె జ్ఞానము అంత ప్రయోజన కరము. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటిలో నడచుచున్నాడు. అయినను జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిది'' (ప్రసంగి 2:13,14,16). చీకటి అజ్ఞానమునకు సంకేతము. వెలుగు జ్ఞానమునకు ప్రతీక. బుద్ధిహీనుడు చీకటిలో నడచుట యనగా సాతానుకు లోబడు అన్యజనులు. వీరికి మరణము తప్పదు. జ్ఞానికి కన్నులు తలలో నుండుట అనగా జ్ఞాన నేత్రము అని అర్థము. కాని అజ్ఞానులైనను, జ్ఞానులైనను మృతి నొందు విధము ఒక్కటియే. అయినను జ్ఞానులు మృతినొందినను, తిరిగి మరణమునకు తీర్చ బడరు. ధనికుడైనను, పేదయైనను, బుద్ధిహీనుడైనను , వివేకవంతుడైనను మరణమందు ఒక్కటే. ఎందుకనగా ఇవన్నియు శరీరాను సారమే. కాని వివేక వంతుడు జ్ఞానము కలుగుట వలన మరల మరణమునకు రాకుండునట్లు తీర్పునుండి తప్పించుకొనుటకు ఆత్మానుసారముగా నడచు కొనును.<br /><br /> ఇంకను మనుష్యులు వారు సంపాదించుకొనిన ధనమును లోభత్వముతో దాచుకొందురుగాని వారు అనుభవించక మిగిల్చిన దానిని లెక్కగా చూచుకొని మురిసిపోవు చుందురు. కొందరైతే ఙభార్యాబిడ్డలకై వెచ్చించి సంతోషించుచుందురు. మరి కొందరు అనారోగ్యము వలనను ఆహార వ్యవహారములలోను పరిమిత పరచ బడుదురు. అందు వలన వారి సంపదను వారు అనుభవింప లేరు. చివరకు మరణమును తప్పించు కొన లేరు. కనుక అంతయు ఈ భూమిపై విడచి వెళ్శిపోవుదురు. పిదప తన ధనమును ఎవరు ఏ విధముగా ననుభవించిరో లేక వ్యర్ధము చేసిరో తెలియదు. ''ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనినచో అతని కేమి ప్రయోజనము.'' (మత్తయి 16:2). కనుక ధనాపేక్షయు, భార్య యందపేక్షయు, పుత్రులయందపేక్షయు వ్యర్ధము. ఎందుకనగా యివన్నియు శరీరానుసారమైనందు వలన సుఖదు:ఖములును మరణమును కలిగించును.<br /><br /> ''పయాసపడి చేసిన పనులన్నింటిని నా తరువాత వచ్చువానికి నేను విడచి పెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడచినవాడనైతిని. ఒకడు జ్ఞానముతోను, తెలివితోను, యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దానికొరకు ప్రయాసపడని వానికి అతడు స్వాస్త్యముగా దానిని ఇచ్చి వేయ వలసి వచ్చును. ఇదియు వ్యర్థమును, గొప్ప చెడుగునై ఉన్నది. వాడు తల పెట్టు కార్యములన్నింటి చేతను, వానికేమి దొరకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రి యందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. దైవ దృష్టికి మంచి వానిగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికిచ్చుటకై ప్రయాస పడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్ధము''(ప్రసంగి 2:18,21,22,23,26). కఠిన శ్రమతోను, అత్యాసతోను సంపాదించు ధనమును, ఆస్తులను తన కొరకు కాక మమకార వ్యామోహములతో వారసులకైనను, మోసగించు వారికొరకైనను, వ్యాజ్యములకైనను, వ్యసనములకైనను వెచ్చించును. ఇట్లు విచారించగా తను శ్రమపడినదంతయు వ్యర్థమని తేలును. తన నిర్ణయముగా కాక, దైవ నిర్ణయముగా జరుగునని తెలిసి వైరాగ్యము నొందును. <br /><br /> ''ప్రతి దానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, చంపుటకు బాగు చేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దు:ఖించుటకు, నాట్యమాడుటకు వెదకుటకు, పోగొట్టు కొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. కావున సంతోషముగా (ఆత్మానుసారముగా) జీవితమును వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదు. (ప్రసంగి 3:1,11,12)<br /><br /> ఎందుకనగా ''ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. అప్పుడవన్నియు మీకును అనుగ్రహించ బడును. రేపటిని గూర్చి చింతింపకుడి.'' (మత్తయి 6:31 - 34). <br /><br /> ఆయన రాజ్యము అనగా పరలోక రాజ్యము. దానిని ఆయన ''నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు'' అని చెప్పెను. కనుక మనము లోక సంబంధమైన వాటి కొరకై ప్రయాస పడుట వ్యర్థము.<br /><br /> మనుష్యుడు సమయమునకు లోబడి తన లోక సంబంధమైన మంచి చెడుల ఫలితమును తన జీవిత కాలములో అనుభవించును. ఆ ఫలితము యెట్టిదై ఉన్నదో తెలియనందున, తాను కోరిన దానికి తక్కువగా లభించుటయో, వ్యతిరేకముగా లభించుటయో జరుగుచుండును. అందు వలన దు:ఖము కలుగు చుండును. మనకున్న అంచనాలు గాని, ఊహగాని దైవనిర్ణయము యేమై ఉన్నదో తెలుప జాలవు. కావున యే కాలమందు యేది ప్రాప్తించిన, దానితో తృప్తి పడి సుఖముగా ఉండవలెను. ప్రాప్తించని దాని కొరకు కలవర పడక ఉండవలెను. ఎందుకనగా ప్రాప్తి యింతకు ముందు మనము చేసిన లోక సంబంధమైన మంచి పనులకు అనుగుణముగా ఉండును. గతములోని క్రియలను మనము మార్చలేము కనుక, ఫలితములను అనుభవించక తప్పదు. కాని ముందు జరగబోవు దానికి, యిప్పుడు మంచి క్రియలు చేయుటకు ప్రయత్నించ వీలగును. చివరగా మరణమును తప్పించుకొనుటకు ఆత్మానుసారముగా క్రీస్తు మార్గమందు నడుచుకొన దగును.<br /><br /> ''కష్టార్జితము వలన (శాశ్వత) సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానము. దేవుడుచేయు పనులన్నియు శాశ్వతములు. దానికేదియు చేర్చ బడదు. దానినుండి ఏదియు తీయ బడదు.'' (ప్రసంగి 3:13,14) ఎందుకనగా దైవమనగా పూర్ణత్వము. పూర్ణత్వమంటే అంతకంటే ఎక్కువగాని, తక్కువ గాని, రెండవది గాని లేనిది. వాక్యమే పూర్ఱత్వము. వాక్యము దేవుడయ్యెను. దేవుని వలన సమస్తము కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగ లేదు. అందు వలన ఏదైనను పూర్ణమే. ఇందులోనుండి తీసివేయ వలసినది ఏదయినా ఉంటే అది కూడా దైవమే. ఏదైనా చేర్చ వలసి ఉన్నచో అదియూ దైవమే. కనుక దైవమును తీసి వేయలేము కదా! అందుకే దైవ కార్యమేదైనను అది శాశ్వతము. దాని నుండి తీసి వేయ వలసినది ఏది ఉండదు. అటులనే చేర్చవలసినది ఏదియు ఉండదు.<br /><br /> ''సకలజీవులకు ఒక్కటే ప్రాణము. మృగములకంటె నరులకేమియు ఎక్కువ లేదు. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగి పోవును'' (ప్రసంగి 3:19,20). <br /><br /> విశ్వ ప్రాణము ఒక్కటే మనుష్యులకు పంచ ప్రాణములుగా ఉన్నది. మృగములకు కూడా ప్రాణముగా ఉన్నది. అటులనే పంచ భూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్విలే నరులకును, మృగములకును శరీరములుగా నున్నవి.. అన్ని దేహములు శుక్ల శోణితముల వలన కలిగినవే. ఈ శుక్ల శోణితములు అన్నము వలనను, అన్నము ఓషధుల వలనను, ఓషధులు పృథ్వి వలనను కలిగినవి. పృథ్వి అనగా మన్నే కనుక అన్ని జీవులు మన్ను నుండే వచ్చినవి. మరణించిన జీవులు తిరిగి మన్ను నందే కలియు చున్నవి.<br /><br /> నరుని దేహము పశువుల దేహముల వలె మంటినుండి పుట్టి మంటిలోనె కలియుచున్నవి. నరులు చేయు క్రియలు పాపశరీరమును పుట్టించును కాని , ఆ క్రియలన్నియు మనుష్యుని ఇచ్ఛ బట్టి గాక నరుని పూర్వ క్రియలకు దేవుడిచ్చిన ప్రతిఫలమును బట్టి ఉండును. అజ్ఞానముచే దేవుని నిర్ణయమును తెలియనేరక మరల మరల శరీరానుసార క్రియలు జరుపుకొనుచున్నారు. నరులు తమ నిర్ఱయమే ననుకొను భావమే శరీరానుసారము. దేవుని నిర్ణయముగా ఎంచుటయే ఆత్మాను సారము. ''ధనము శాశ్వతము కాదు'' (సామెత 27:24). ''ఒక ఒంటరి, కుమారుడును, ఎవరును లేరు, అతనికున్న ఐశ్వర్యము చేత తృప్తి పొందక, సుఖమనునది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడని అతడు అనుకొనడు. ఇదంతయు వ్యర్థము, బహుచింత కలిగించును''. (ప్రసంగి 4:8)<br /><br /> ద్రవ్యమును, ధన సమృద్ధి నపేక్షించువాడు వాటిచే తృప్తి నొందడు. కష్ట జీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా సుఖనిద్రను పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన వృద్ధిచేత నిద్ర పట్టదు. <br /><br /> ''ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసికొనిన దానిలో ఏదయినను చేత పట్టుకొని పోడు. అతడా వచ్చిన ప్రకారము తిరిగి మరల పోవును'' (ప్రసంగి 5:10,12,15). ''ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము'' (మార్కు 10:25). <br /><br /> ఒంటెకెన్ని వంకరలో మనుష్యుని బుద్ధికి అన్ని వంకరలు. బుద్ధి దురాశ వలన తనకు అవకాశము ఉన్నదాని కంటే ఎక్కువగా కోరుచూ సన్నని రంధ్రము వంటి అవకాశములో ఒంటె వంటి పెద్దవైన కోరికలను తీర్చుకొన యత్నించును. ఇది అసాధ్యము కదా! ధనవంతుడు మొదట సంపాదించ వలెనని ఆశ పడిన వాడై, కలిగిన దానితో తృప్తి పడక సంపదను పెంచుకొన తృష్ణతో ప్రయాస పడును. కాని దానిని ఎవరికిని వెచ్చించడు. ఇట్టి లోభి వాంఛా పూరితుడై అక్రమముగా నైనను, దీనత్వముతో యాచించి యైనను ధనమే అన్నింటికి మూలముగా భావించుచు, మరింత శరీరానుసారమై పతనము చెందును. ఇట్టి వారు సాధనా మార్గములో దేవునికి చాలా దూరములో నుందురు.<br /><br /> ''ఒకడి విషయములో అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహించడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్ధముగాను , గొప్ప దురవస్తగాను కనపడుచున్నది'' (ప్రసంగి 6:2).<br /><br /> ఇట్టివన్నియు ప్రాప్తి అనబడును. ఆత్మానుసారముగా జీవించుటను సాధన చేయువారు రాబోవు కాలము గురించి జాగ్రత్త పడుదురు. శరీరానుసారులు మాత్రము వ్యర్థ క్రియల మూలమున అటులనే శ్రమయు, వేదనను పడుచుందురు. వర్తమాన జీవితమును నష్టపోవుదురు.<br /><br /> కనుక ''సుఖదినమందు సుఖముగా ఉండుము.. ఆపద్దినమందు యోచింపుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండు నట్లు దేవుడు సుఖదు:ఖములను జత పరచి యున్నాడు. దేవుడు నరులను యదార్ధవంతులుగా పుట్టించెను. గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. నరులు కల్పించుకొనిన దు:ఖమునకు హేతువేదోగాని , దేవుని సృష్టి అట్లు గాదు''(ప్రసంగి 7:14,29). ''దేవుడు సృష్టించిన ప్రతి వస్తువునూ మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్ర పరచ బడుచున్నది'' (1తిమోతి 4:4-5). <br /><br /> ''మన్నయినది వెనుకటి వలెనె మరల భూమికి చేరును. ఆత్మ దానిని దయ చేసిన దేవుని యొద్దకు మరల పోవును. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియకును అది మంచిదేగాని , చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును.'' (ప్రసంగి 12:7,14). శరీరమే మన్నుతో తయారయినది, కనుక ఆ శరీరము మన్ను లోనె కలిసిపోవుచున్నది. ఆత్మ ఎప్పటికైనను దానిని దయ చేసిన దేవుని ఆత్మలో కలిసిపోవును. శరీర విషయముగా చూచి నట్లయినచో అది శరీరమైనట్టి మీకు అశాశ్వతమనిపించును. ''రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనె మాయమగు ఆవిరి వంటివారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది, అది చేతుమని చెప్పుకొన వలెను. మీరు డంబముల యందు అతిశయ పడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగున చేయని వానికి పాపము కలుగును'' (యాకోబు 4:14-17). <br /><br /> కనుక శరీరాశయు, అత్యాసయు, దురాశయు తీర్పులోనికి తెచ్చును గాన ధనాపేక్ష లేక, అతిశయ పడక, ఆత్మానుసారముగా జీవించ వలెను. భూమి మీద ఉన్నవాటియందు వైరాగ్యము పొంది త్యాగముతో విడచుచు, శాంతి కొరకు ప్రయత్నించ వలెను. ప్రభువు నిర్ణయములే శాశ్వతములనియు, మంచి వనియు తలిచి ప్రార్థనతో కృతజ్ఞతా స్తుతులతో ప్రాప్తించిన వానిని స్వీకరించి తృప్తి నొంద వలెను. వివేచనతో , వివేకముతో జ్ఞానము కొరకు యత్నించ వలెను. <br /><br /> మనుష్యులు అజ్ఞానములో తిరుగుచు, సాతానుకు లోబడి యుండి దు:ఖములో పడుటయా మరియు మరణించుచుండటయా లేక పరలోక రాజ్యమందు శాశ్వతముగాను, ఆనందముగాను స్థిర నివాసము నొందుటయా యని ఒక తీర్మానము చేసుకొను సమయమాసన్నమయినది. పరలోక రాజ్యనివాసము కోరు వారు సాధకులు. వీరు ముందుగా ఆత్మానుసారముగావలెను. పిమ్మట అట్టి ఆత్మానుసారులు హృదయ పూర్వక విశ్వాసులగుటకు ప్రవచనము హృదయమునందు విన వలెను. క్రీస్తు బోధను విస్తరించుటకు ఆయన అపొస్తలులను నియమించెను. వారు సంఘములను ఏర్పరచి, బోధకులకు శిక్షణ యిచ్చి వారికి సువార్తలనందించుచు వారిని పరిచర్య కొరకు నియమించెను.<br /><br />తత్త్వం<br /><br /> చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా <br /><br /> కనులు మూసి తెరచునంతనే కలిమి లేములు మారురా ||<br /><br /> 1. మాయ లోకంబురా ఇది మనసునాకర్షించురా <br /><br /> నీది నాది యనుచు నరుడా వాదులాడ బోకురా ||చం||<br /><br /> 2. బంక మట్టి దేహము యిది మంటిలోనే కలియురా<br /><br /> ఆలు బిడ్డలు బంధు మిత్రులు అందరూ నిను విడచురా ||చం||<br /><br /> 3. ఉంది లేదు అనెడి భేదము దేహముండు వరకురా <br /><br /> ఈ కట్టె మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా ||చం||<br /><br /> 4. వాక్యమర్మము నెరుగరా మరి తప్పు మార్గము బోకురా <br /><br /> ఆత్మ యొక్కటే చావు లేక అంతటా వెలుగొందురా ||చం||<br /><br />తత్త్వం<br /><br />ఉన్నది ఒకటే సత్యమురా, అది ఎన్నటికీ నశియించదురా <br /><br />విన్నది కన్నది ఎన్నటికైనా సున్నా చుట్టుకు పోవును రా, అది సున్నా చుట్టుకు పోవును రా ||ఉ||<br /><br />1. ఆయువు స్థిరమని నమ్మకురా, అది కాలములో గతియించునురా<br /><br /> దేహ భావన అణచి వేయక ఆత్మ తత్త్వము తెలియదురా ||ఉ||<br /><br /><br /><br />2. అవివేకము, అజ్ఞానము రా , అది మనస్సును బంధించునురా<br /><br /> మనోబుద్ధుల చిక్కు తీయక విశ్వాసము నీలో పుట్టదురా ||ఉ||<br /><br />3. అహంకారమే మరణ హేతువు, ఎవ్వరికైనా తప్పదురా <br /><br /> అహంకారమును అణచి వేసిన క్రీస్తు స్థితి సిద్ధించునురా ||ఉ||<br /><br />4. యేసే దైవము నమ్ముమురా, విశ్వాసమె రక్షణ మార్గమురా <br /><br /> యేసు లేకను ఎంతటి వారికి పరిశుద్ధ తత్వము తెలియదురా ||ఉ||<br /><br />5. క్రీస్తే యేసని నమ్ముమురా, ఆ యేసే క్రీస్తని తెలియుమురా <br /><br /> ప్రభువు ద్వారానే తండ్రిని చేరుట తప్పని సరియని వాక్యమురా ||ఉ||<br /><br />తత్త్వం<br /><br />వస్తా ఉత్తదీ, పోతా ఉత్తదీ ఆశలెందుకే ఓ జీవా<br /><br />మంచి చేసినా, చెడ్డ చేసినా తీర్పు తప్పదే ఓ జీవా ||వ||<br /><br />1. పంచ భూతములు, సప్త ధాతువులు ఇంతే దేహము ఓ జీవా<br /><br /> ఉండీ, పుట్టీ, పెరిగీ, మారీ, కృశించి పోవునే ఓ జీవా ||వ||<br /><br />2. పంచ ప్రాణములు, ఉపవాయువులు ఇంతే ప్రాణము ఓ జీవా<br /><br /> ఉన్న ప్రాణములు వీడి పోయిన నీ వెవ్వరివే ఓ జీవా ||వ||<br /><br />3. పంచ కోశములు, మూడు శరీరములు నీవు కాదు కదా ఓ జీవా<br /><br /> ఇవి నిజమేనని భ్రమసి చేసేవు పాపక్రియలు ఓ జీవా ||వ||<br /><br />4. ఐదైదులును వాని క్రియలును నీవు కాదు కదా ఓ జీవా<br /><br /> బుద్ధి హీనమై, సాతాను మాయకు లోబడ బోకే ఓ జీవా ||వ||<br /><br />5. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమె ఓ జీవా<br /><br /> ప్రభువు ప్రేమను, ప్రభువు బోధను విశ్వసించవే ఓ జీవా ||వ||<br /><br />6. క్రీస్తు మరణము, పునరుత్థానము ఆమోదించవె ఓ జీవా<br /><br /> విశ్వాసముతో, సాదృశ్యముగా ఐక్యత నొందవే ఓ జీవా ||వ||<br /><br />7. క్రీస్తే యేసని, యేసే తండ్రని జ్ఞానము నొందవె ఓ జీవా <br /><br /> పరిశుద్ధాత్మ త్రిత్వము తెలిసి రక్షణ పొందవె ఓ జీవా ||వ||<br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-38480972927903109492014-02-28T05:04:00.002-08:002014-02-28T05:04:32.134-08:009. శరీరము - ఆత్మ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">9. శరీరము - ఆత్మ<br /><br /> సత్యము, మార్గము , పరిశుద్ధాత్మ , పరలోక రాజ్య నివాసముల గురించి తెలిసి కొంటిమి. తండ్రి, యేసుప్రభువుల సత్య స్వరూపము, మహిమల గురించి తెలిసినది. ఇక ఆయన జననము, జీవనము, మరణము, పునరుద్ధానములలో మనము ఐక్య పరచు కొనుటకు, సాధకులమైనట్టి మనము జీవించ వలసిన సాధన తెలియ వలెను. సత్యము, మార్గము, నిత్యజీవములనగా తెలిసినవిగాని విశ్వాసికి అవి క్రియా మూలమైనవి. ఆ తెలిసిన దానిని ఆచరణలో పెట్టినగాని అది హృదయ పూర్వక విశ్వాసము కాదు. హృదయపూర్వక విశ్వాసము కలిగినగాని క్రీస్తుగా మారి, ఆయన యందు ప్రవేశింప వీలుకాదు. ఇందుకొరకు శరీరాత్మల గురించి వివరముగా తెలిసినచో ఆత్మగా సత్క్రియలు జరుపవీలగును. ఆత్మయే దైవము. మనలో గల ఆత్మయే ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడుగా నున్న దేహమే దేవాలయము. ఇందుకు వాక్యమేమనగా '' మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు.'' (1కొరింథి 3:16) మరియు ''దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది. మీరు ఆలయమై యున్నారు.'' (1కొరింథి 3:17). ''ఆత్మయే జీవింప చేయుచున్నది కనుక శరీరము అనిత్యము'' (యోహాను 6:63)<br /><br /> ఆత్మ సత్తా వలన దేవ దూతలును, దేవ దూతల సత్తా వలన ఇంద్రియములును పని చేయు చున్నవి. ఆత్మ సత్తా ఎల్లప్పుడును ఉన్నది. ఇంద్రియముల వ్యవహారము ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది గాను , మరియు దాని వలన సుఖదు:ఖానుభవములు కూడా ఉన్నవి. అవి ఎక్కువ తక్కువలుగాను వచ్చి పోయేవిగాను ఉన్నవి. అటులనే యీ దేహము ఒకప్పుడు లేకనే గర్భములో కొంతకాలము ఉండి, తరువాత పుట్టి, పెరిగి, బాల్య యవ్వన, వృద్థాప్యములుగా మారుచు, క్షీణించి, నశించు చున్నది. కనుక శరీర ఇంద్రియములు, వాని వ్యాపారములు అనిత్యము కాని ఆత్మ నిత్యము. <br /><br /> శరీరము మానవ నిర్మిత గుడారము. ఆత్మ దేవునిచే నిర్మించ బడిన శాశ్వత నివాసము. భూమి మీద ''మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయినను (నరుని) చేతి పనికాక, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నది.'' (2కొరింథి 5:1) <br /><br /> ఆత్మయే నేను. అది శరీరమను వస్త్రమును ధరించి యున్నట్లు తెలియు చున్నది. కనుక శరీరములేని ఆత్మ దిగంబరము . దిగంబరాత్మయే సత్యము. మనము దిగంబరులముకాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము, అనగా శరీర ధారులుగా నున్నాము. ''కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై (దిగంబర ఆత్మపై) ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో (శరీరములో) మూల్గుచున్నాము.'' (2కొరింథి 5:2) నిత్యమైన పరలోక నివాసము ధరించుటకు గాను, యీ శరీరాత్మ దిగంబరాత్మగావలెను. శరీరమే నేననుచు స్వనీతికి తగినట్లు అవయవ(ఇంద్రియ) క్రియలు జరిపి నట్లయితే, మరణమునకు తీర్పు తీర్చబడును. అందు వలన శరీరము ఆత్మను కప్పియుంచుచునే ఉండును. కనుక శాశ్వత తత్త్వమైన దిగంబరాత్మనే నేను అను అనుభవముతో సత్క్రియల మూలముగా, ఆత్మానుసారము జీవించిన యెడల మరణమునుండి తప్పించ బడుటచే, ఆత్మ దిగంబరముగా ప్రతిష్ఠితమగును. మృతమైన శరీరము తీర్పు అనుసారము గా మరల మరల తన దుష్క్రియలకు ప్రతిఫలముగా వచ్చుచు, మరణించుచుండును. కనుక ఆత్మ దిగంబర మగుట యనగా తీర్పు నుండి తప్పించ బడుట ద్వారా నిత్యజీవము నొందుట. శరీరమందున్న ఆత్మ యనగా ఆంతర్య పురుషుడు, శరీరమనగా బాహ్య పురుషుడు. <br /><br /> బాహ్య పురుషుడనగా బయట ప్రపంచముతో సంబంధము పెట్టుకొనిన నేను. ఆంతర్య పురుషుడనగా బయటి విషయముల యెడ రాగ ద్వేషములు లేకను, ఇంద్రియ సుఖములకు లోబడకను, శరీరమును నేను కాదు అన్నట్లుండి అంతరాత్మగా మాత్రమే నున్నవాడు. యదార్థముగా ఆంతర్య పురుషుడే ఆత్మ. బాహ్య పురుషుడనగా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహమను మూడు దేహములతో కూడి ఉన్నవాడు. <br /><br /> స్థూల దేహమనగా రక్తము, మాంసము , ఎముకలు, మూలిగ, చర్మము, రసము, మొదడు అను ఏడు ధాతువులతో కూడి, సూక్ష్మ దేహము లేనిదే చచ్చి నట్లు పడి ఉండునది. సూక్ష్మ దేహమనగా అంత:కరణము(4), పంచ ప్రాణములు (5), పంచ జ్ఞానేంద్రియములు(5), పంచ కర్మేంద్రియముల (5) తో కూడినది. ఈ 19 తత్వముల వ్యవహారమే సూక్ష్మ దేహ వ్యవహారము. కారణ దేహమనగా, పూర్వ కర్మల ఫలితముగా మంచి చెడుల ఫలితముల యొక్క అనుభవమునకును, మరణమునకును చెట్టుకు విత్తనమువలె కారణమైనది. ఇది పాపము. ఇదియే (గర్భమును ధరించి) అంకురించి మనుష్యుని పాపిగా పుట్టించును. <br /><br /> ఇట్టి బాహ్య పురుషుడు గర్భస్తమై పుట్టుట, బాల్య యవ్వనములలో పెరుగుచు, మార్పు చెందుట, వృద్ధాప్యములో కృశించి మరణముతో నశించుట యను అవస్థలను పొందును. <br /><br /> ''బాహ్య పురుషుడు కృశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు'' (2కొరింథి 4:16).<br /><br /> తాత్కాలికముగా డేరా వేయుచు తీయుచు మరొక చోటికి తరలించుచు నాటకములు ఆడుచున్నట్లు, ఈ డేరావంటి శరీరము ఆత్మను కప్పుచు, క్రియలు జరుపుచు, శ్రమయు వేదనయు పొందుచు, మృతమగుచున్నది. కాని దిగంబర ఆత్మ దినదినము నూతన పరచ బడుట వలన ఇది నిత్యజీవము. అయినను ఆత్మ అదృశ్యము, శరీరము దృశ్యము. కావున ''దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు'' (2కొరింథి 4:18) అని ఎరుగవలెను.<br /><br /> ''మర్త్యమైనది జీవము చేత మ్రింగి వేయబడునట్లు, ఆ నివాసము దీనిపై ధరించు కొనగోరుచున్నాము'' (2కొరింథి 5:4). పరిశుద్ధాత్మను ధరించుటకు ఆత్మ మర్త్యమైన శరీరమునుండి విమోచనము కావలెను. ఇదియే జీవము చేత మర్త్యమైనది మ్రింగివవేయ బడుట. శరీరము సత్యమను భావము అజ్ఞానము. ఆత్మ నేను మరియు నిత్యము అనునది జ్ఞానము. కనుక భావన మారి జ్ఞానము కలిగినచో, అది అజ్ఞానమును మ్రింగి వేయును. ఎట్లనగా జ్ఞానమను వెలుగు అజ్ఞానమను చీకటిని మ్రింగివేసినట్లు. ''దీని నిమిత్తము మనలను సిద్థ పరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువును మనకు అనుగ్రహించి యున్నాడు. వెలి చూపుల వలన కాక విశ్వాసము వలననే నడచుకొను చున్నాము'' (2కొరింథి 5:5,6). సంసిద్ధులమైనచో ఆ సంచరువు మనలను పరిశుద్దాత్మగా అభిషేకించును. వెలిచూపు అనగా శరీరానుసారము, విశ్వాసమనగా ఆత్మానుసారము. ఆత్మానుసారులు సంసిద్దులగుటకు అది హృదయ పూర్వక విశ్వాసము కావలెను. వెలి చూపు వలన అసత్యమైన ఈ దేహము సత్యమని అనిపించును. కాని ''ఈ దేహమును విడచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము'' (2కొరింథి 5:8). వెలిచూపు మారి అంతర్ముఖమైనచో ఆత్మానుభవము నొందుదుము.. <br /><br /> దీనికి నాలుగు విధములైన సాధనములు గలవు. అందులో ఈ నిత్యానిత్య వివేకము మొదటిది. నా యందును, జగత్తు యందును ఈ విచారణ చేసినచో ఆత్మ నిత్యమని తేలు చున్నది. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు అనిత్యములని తేలు చున్నది. అటులనే మెలకువలో అనిత్యమైన అనుభవములు (సుఖ దు:ఖములు) వచ్చుచు, పోవుచున్నవి. స్వప్నములో కూడా అసత్యమైన అనుభవములు కలిగి, మెలకువలో అవి లేనివిగా తెలియబడుచున్నవి. గాఢ నిద్ర యందు ఏమి తెలియని స్థితి ప్రతి దినము వచ్చి పోవు చున్నది. ఈ మూడు అవస్థలు అనిత్యము. ఈ మూడు అవస్థలకు సాక్షిగా నున్న ఆత్మ మనకు కల విషయమును, నిద్రానుభవమును, మెలకువ వచ్చినపుడు జ్ఞప్తికి తెచ్చు చున్నది. అనగా ఆత్మ అన్ని అవస్థలలోను ఉన్నదనియు, అది లేని సమయము లేదని ఋజువగుచున్నందున ఆత్మ నిత్యము. <br /><br /> అన్నము వలన పురుషులందు శుక్లమై, స్త్రీలందు శోణితమై వాటి వలన శరీరము పుట్టి, అది అన్నముతోనే పోషించ బడుచున్నది. అన్నము లేనిచో కృశించి నశించి పోవుచున్నట్టి యీ శరీరమును అన్నమయ కోశమందురు. ఇది మారుచు చివరికి నశించు చున్నందున అనిత్యము కనుక నిత్యమైన ఆత్మ ఈ శరీరము కాదు. దీని ధర్మములు చావు పుట్టుకలు. <br /><br /> అట్లే ప్రాణమునకు రాక పోకలును, ఉన్న చోటనే చలనము ఉన్నందున ఇది పరిమితము, అనిత్యము. మనస్సు వాయు రూపమున ఉన్నది కనుక చంచలము అందు వలన అనిత్యము. బుద్ధి యందు నిర్ణయములు కలిగి జ్ఞాపకముల ననుసరించి మారుచుండును. బుద్ధితో ధ్యానము చేయుదురు, దేవుని ప్రతిష్ఠించుకొని ధారణచేయుదురు మరియు నిశ్చల మనస్సుతో సమాధి నొందుదురు. ఇవన్నియు బుద్ధి యొక్క అనిత్యమైన స్థితులు. . చిత్తము యొక్క బీజ స్థితి యందు మూర్ఛ, నిద్రలు ఉండును గావున ఇది పరిమితము, అసత్యము. ప్రియ, మోద, ప్రమోదము అనెడి లోక సంబంధమైపన విషయముల యందు ప్రీతి లేక వృత్తి బీజములైన ఆనందము కూడా పరిమితము, అనిత్యము. ఈ విధముగా విచారించి చూచిన నేను అన్నం, ప్రాణం, మనస్పు,బుద్ధి, ఆనందమయములైన పంచకోశములు కాదు, మూడు శరీరములు కాదు. అందు వలన పరిమితమైన అనిత్యమైన బాహ్య పురుషుడను కూడా కాదు. నిత్యమై సత్యమై యున్న, సర్వ వ్యాపకమై యున్న ఆంతర్య పురుషుడను నేను అని గ్రహించ బడుచున్నది.<br /><br /> అయినను శారీరక, మానసిక బాధలు నన్ను ఆత్మగా నిశ్చయించనీయక అజ్ఞానములోనికి లాగుచున్నవి. కనుక ఈ బాధలను వైరాగ్యముతో అధిగమించ వలెను. ముందుగా ఇంద్రియములను శమింపజేసి నిగ్రహించవలెను. మనస్సును నిదానింప జేయవలెను. బుద్ధిని విశ్వాస బలముతో దేవుని చిత్తమునకు లోబడునట్లు చేయ వలెను. ఈ విధముగా సుఖ దు:ఖములందు చలింపక సమముగా నుండ వలెను. దీని కొరకు ప్రభువునందును క్రీస్తు మార్గమునందును, దైవీ ప్రేమ యందును శ్రద్ధ విశ్వాసములనుంచ వలెను. శ్రద్ధయనగా దేవునియందును, దేవుని వాక్యమందును విశ్వాముండుట మరియు అపొస్తలుల ప్రవచనముల యందు ఆసక్తి కలిగి యుండుట. ఆయన పై భక్తి ప్రేమలతో నుండ వలెను. అన్ని పనులును దైవము చేత, దేవ దూతల ప్రేరణ వలన జరుగుచున్నవి గాన, తాను దేనికిని కర్త కాదని యెంచు చుండ వలెను. కనుక తను జరుపు క్రియల ఫలితములు తనవి గాదని యెరిగి ఎట్టి ఫలితమును ఆశింపక క్రియల జేయు చుండ వలెను. లోక విషయాను రక్తి నుండి మరలి దైవముపై ప్రేమానురక్తి కలిగి యుండ వలెను. అనగా దైవార్పణగా వ్యవహరించ వలెను. ఈ సాధన వలన తన క్రియా ఫలితముల యందు సమత్వమును పొందును. కావున సుఖ దు:ఖముల నొందడు. ఇందులకు కావలసిన శ్రద్ధతో దైవమును నెరిగి, దైవమందు మునిగి, క్రీడించుటయే సమాధానము. ఇందుకు ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగము, భక్తి, విశ్వాసము అను సద్గుణములు అత్యంత అవసరము. వైరాగ్యము కలుగుటచే మనలను మరింతగా బాహ్య పురుషుని నుండి వేరు చేయగలదు. భూలోక సంబంధమైనవి గాని, స్వర్గలోక సంబంధమైనవి గాని అనుభవింప నిశ్చయించినచో అది బాహ్య పురుషుని కర్మగా యేర్పడును. కావున మరణమునకు తీర్పు తీర్చ బడును. అందు వలన బాహ్య పురుషునికి సంబంధించినవియును, లోకమునకు సంబంధించినవియును అనిత్యములని వైరాగ్యముతో విడువ వలెను. అనగా శరీరాపేక్ష, ధనాపేక్ష విడువ వలెను. ఈ కష్ట తరమైనది సాధించుటకు మనకు వివేకమును , వివేకముతో విచారించిన ఫలితముగా వైరాగ్యమును కలుగ వలెను. అప్పుడు ఈ దేహమును నేను కాదని, క్రీస్తు యేసు నందు ప్రవేశింప గలవారము. ఆమేన్||<br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-38831266244721538802014-02-28T05:02:00.000-08:002014-02-28T05:02:10.956-08:008. మార్గము-సత్యము-జీవము <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">8. మార్గము-సత్యము-జీవము <br /><br /> యేసు యీలాగు చెప్పెను ''నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారా తప్ప యెవరును తండ్రి యొద్దకు రాడు'' (యోహాను 14:6). మార్గమును బోధించుటకు తన జననమును, మరణమును, పునరుత్ధానమును మనకు సాదృశ్యముగా చూపించుచు మనలను కూడా అట్లే జీవించుమని తెలిపెను. తన ప్రతి అంశముతోను మనలను ఐక్యత పరచు కొనుమని ప్రకటించెను. మరియు అపొస్తలుల ద్వారా ప్రవచింపజేసెను. '' నేను చేసిన ప్రకారము మీరును చేయ వలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని'' (యోహాను 13:15) అని చెప్పబడును కను క్రీస్తు మార్గమే మనలను క్రీస్తుగా మార్చి, ఆయన వలె క్రీస్తు యేసు నందు ఉంచును.''కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళవాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను, బలిగాను అర్పించు కొనెను. ఆలాగుననే మీరును నడచుకొనుడి'' (ఎఫెసి 5:1,2). పరిమళ వాసన యనగా దివ్యానుభూతి. ప్రేమ యనగా దైవమే. దైవము అనుభవములో ఆనంద స్వరూపుడు. ఆయన అంశయైన యేసు కూడా ఆనంద స్వరూపుడే. అయినను మనకు మార్గముగా ఉండుట కొరకు మన వలె శరీరధారి యైనందున ఆయనకు శారీరక బాధలు శరీర ధర్మముగా సంక్రమించెను. అందు వలన ఆయన త్యాగమునకు గుర్తు. బాధలను అనుభవించుట ఆయనకు శరీరానుసారమైన క్రియల వలన వచ్చినది కాదు. అయినను మనకొరకు అనేక శ్రమలను పొందెను. ఇదియే బలి యర్పణ. ఇట్టి బలియర్పణను. ప్రేమను బోధించుటకు ఆయన తనను సాదృశ్యముగా యెంచుకొనెను. మనలనూ అట్లే ప్రేమ, త్యాగము, సాత్వికము, సహనములను అలవరచుకొనుమని తెలుపుచూ, ఆయన యొక్క ప్రతి విషయమందును, సాధనచే ఐక్యత పరచుకొనుమని బోధించెను. అనగా ప్రేమతో, త్యాగ బుద్ధితో ఆయన వలెఉండుటకు సాధన చేయ వలెను. ఆయనను ప్రతి అంశములోను సహృదయముతో వెంబడించ వలెను. యేసు యీలాగున చెప్పెను ''నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించు వాడు చీకటిలో (అజ్ఞానములో) నడువక, జీవపు వెలుగు(స్వరూప జ్ఞానము) కలిగి ఉండును. నేను ఎక్కడ నుండి వచ్చితినో (పరలోకము నుండి వచ్చెను) , ఎక్కడికి వెళ్ళుదునో (మరల పరలోకమునకే వెళ్ళుదును) నేనెరుగుదును. మీరు ఎరుగరు, నన్ను ఎరిగి యుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి యుందురు'' (యోహాను 8:12,14,19). ఈ విధముగా ఎరిగినచో అది సత్యము. సత్యమనగా మీరే దైవము అని ఎరుగుట. అది తెలియని వాడు అజ్ఞాని. యేసు బోధ యీలాగు ఉండెను. ''నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచి యుందును ..... ఎవడు నాయందు నిలిచి యుండునో నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును.'' (యోహాను 15:4,5). మీరు దైవములు... లేఖనము నిరర్థకము కానేరదు కదా! దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు...నేను తండ్రి క్రియలు .... చేసిన యెడల .... తండ్రి నా యందును, నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడి'' (యోహాను 10:34-38). ఈ సత్యమును ఎరుగుటయే జ్ఞానము. జ్ఞానవంతులైన వారు దైవము కంటె వేరు కాదు. ఈ అనుభవమును పొందక మునుపు అజ్ఞానము వలన నీవు వేరు దేవుడు వేరు అను కొనుచుండిరి. ఇప్పుడు విశ్వాసము వలనను, సాధన వలనను నీవు దేవుని కంటె వేరు కాదను జ్ఞానమును పొంద వలెను. ముందుగా దేవుని గురించియు, సత్యమును గురించియు తెలిసికొని హృదయ పూర్వకముగా విశ్వాసము నొందవలెను. ఎందుకనగా ''మనము ఆయన యందు బ్రతుకు చున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగి ఉన్నాము'' (అపొ||కా.17:28). ఆయన ఆజ్ఞలేనిదే చీమయైనను కదలదు.<br /><br /> తండ్రియైన యెహోవాయే అద్వితీయుడైన సత్య దేవుడు. ''అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'' (యోహాను 17:3). నిత్య జీవమై ఉండుటయే జ్ఞానము. ''యేసు క్రీస్తు నిన్నను , నేడును ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును'' (హెబ్రి 13:8). ఆయన శాశ్వతుడు, నిత్యుడు, మార్పులేని వాడు ఆదియును, అంతమును లేని వాడు. ''సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును''(యోహాను 16:13). అనగా జ్ఞానములో మనము ఆయనతో సత్య స్వరూపముగా, ఒక్కటిగా ఉందుము. ''దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింప వలెను తనను ఆరాధించు వారు అట్టి వారే కావలెను'' (యోహాను 4:23,24). ఇట్టి ఆరాధన వలన దేవుని కృపచేే, నీకంటె వేరు అని భావించుచున్న దైవమును నీతో ఐక్యత పరచుకొందువు. యేసు ఇట్లు చెప్పు చున్నాడు. ''మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా మీరు నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను సర్వ స్వతంత్రులుగా చేయునని చెప్పెను'' (యోహాను 8:31). దేవుని ఎరుగువాడు దేవుడే, సత్యమును గ్రహించినవాడు సత్యమే అగు చున్నాడు. దేవుని వాక్యము దేవుడే అయి ఉన్నది. యేసు ప్రభువు పలుకు ప్రతి వాక్యము తండ్రి చేతనే పలికించ బడినది. కనుక వాక్యము సత్యమును తెలుపును. సత్యత్వానుభవము ఉన్న అపొస్తలుల వలన, శిష్యులును సత్యమును గ్రహించెదరు. అట్టి శిష్యులు ఆత్మ శుద్ధిచే పాపము నుండి విమోచనము నొంది, ఆత్మగా స్వతంత్రులగుదురు.<br /><br /> ''ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సత్యస్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయనయందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను , ఆయనను బట్టియు సృజింప బడెను. ఆయన అన్నింటి కంటె ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధార భూతుడు'' (కొలస్సి 1:15-17). ''నేనును తండ్రియు ఏకమై యున్నామని వారితో చెప్పెను.'' <br /><br />(యోహాను 10:30).శరీరముగా నున్నప్పటికిని ఆయన తండ్రి యొక్క అంశ కలిగి యుండుట వలన, ఆ తండ్రి వలననే సత్యస్వరూపియై ఉన్నాడు. సర్వసృష్టి కంటెను ముందుగానే నున్నవాడును, సనాతన పురుషుడును అయి ఉన్నాడు. ఆకాశమునుండి భూమి వరకు సృఙష్టింప బడక ముందు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఉండెను. వాటికంటె ముందు జీవ శక్తియు, అంత కంటెముందు విశ్వ శక్తియు ఉండెను. వీటన్నింటి వలన జగత్తు , జీవులు ఉద్భవించెను. ఆయన మాత్రము వీటన్నింటి కంటె ముందుగానే ఉండి, సర్వ సృష్టికిని ఆధార భూతుడుగ నుండెను. ఆయన వలన జీవులు అనేక వ్యాపారములు జరుప శక్యమాయెను. వారి వారి వ్యాపారములను వారి ఇంద్రియములు జరుపు చుండగా, ఆ ఇంద్రియములు వెలుగే దేవుడైన వాని వలన ఏర్పడిన దేవ దూతల ద్వారా ప్రేరణ పొందుచున్నవి. <br /><br /> మనస్సు, బుద్ధి, చిత్తము , అహంకారము అను అంత:కరణమును(4), సమాన వాయువు ,ఉదాన వాయువు, వ్యాన వాయువు, ప్రాణ వాయువు, అపాన వాయువు అను పంచ ప్రాణములును (5), చెవులతో వినుట , చర్మముతో స్సర్శ తెలిసికొనుట, కళ్ళతో చూచుట, నాలుకతో రుచి చూచుట, ముక్కుతో వాసన చూచుట అను పంచ జ్ఞానేంద్రియములును (5), మాట్లాడు నోరును, పని చేయు చేతులు, కాళ్ళు, ఆనదించు గుహ్యము, మల విసర్జన చేయు పాయువు అను పంచ కర్మేంద్రియములును(5) కలిసి ఈ 19 ఇంద్రియములతో మనుష్యుడు క్రియలు జరుపుచు, గ్రహించుచు, అనుభవించుచు నుండును. ఈ 19 తత్వములతో కూడిన దేహము సూక్ష్మ శరీరము అనబడును.. <br /><br /> శరీరానుసారమైన మనుష్యుడు తన ఇంద్రియములే స్వతంత్రముగా పని చేయుచున్నవని తలంచును. సాధకుడైన వాడు విచారణచే తాను జరుపు క్రియలు దేవ దూతల ప్రేరణచే జరుగు చున్నవని తెలిసికొనును. అందుచేత అతడు దేవుని మూలముగా, ఆ దేవ దూతలే జరుపు క్రియలు తనవి గావను జ్ఞానము పొందును. అట్లు జీవించుట ఆత్మాను సారమైనది. ''సకల యుగములకు రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు దేవుడు, అట్టి దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును'' (1తిమోతి 1:17). సృష్టి ఆవిర్భవించక మునుపు దైవము మాత్రమే ఉండెను. అందువలన సృష్టిలో నుండు వారికందరికి ఆయన యుగయుగములకును, సర్వసృష్టికిని రాజాధిరాజుగా తలంచ వలెను. అక్షయుడనగా క్షీణఙించని వాడు మరియు నశించని వాడు. అదృశ్యుడనగా దృశ్యము కాని వాడు మరియు మనస్సుకును జ్ఞానేంద్రియములకును తెలియ బడని వాడు. త్రికాలములు లేని వాడు. అందు వలన అట్టి కాలములకు అతీతుడై,ఆ ఆయా కాలములను తన స్వాధీనమందుంచు కొనిన వాడగును. మెలకువ సమయము, స్వప్న సమయము, గాఢ నిద్ర సమయము, ఈ మూడు సమయములు మనుష్యులందరికి సామాన్యము. కాని ఆత్మ అన్ని సమయములలో నుండి , ఆయా సమయముల కంటె వేరుగాను, సాక్షిగాను ఉండును. ఆత్మయనగా దేవుడే !<br /><br /> ''కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమునందుంచు కొనియున్నాడు '' (అపొ||కా.1-7). ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్న అక్షరములన్నియు ఆయనే అయి ఉన్నాడు కనుక అక్షరుడుగా నున్నాడు. అక్షరుడనగా క్షరముగాని వాడు. ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్న అక్షరములన్నియు చేరి వివిధ పదములుగా యేర్పడి మార్పు చెందు అర్ధములు కలిగి ఉన్నవి. అటులనే క్రియలందును , సుఖ దు:ఖములందును అనుభవ భేదము కనబడుచున్నది. కాని దేవుని వాక్యము ఎట్టి మార్పులు లేక, ఒక్కటైన సత్యము ను, జ్ఞానమును, ఆనందమును అయి ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ''ఆల్ఫాయు ఓమెగయు నేనే (సర్వము నేనే) వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండు వాడను నేనే'' ప్రకటన 1:8 ( సర్వ కాలములలో మార్పు చెందని సత్యము నేనే). ''మొదటి వాడను , కడపటి వాడను, ఆదియు అంతమునై యున్నాననెను'' (ప్రకటన 1:18). మొదటివాడు అనగా దేవుని వాక్యమును అతిక్రమించక వున్న ఆదాము. కడపటి వాడనగా క్రీస్తుయేసు నందు ప్రవేశించి పరిశుద్ధాత్మగా మారినవాడు. మొదటి వాడైనను, కడపటి వాడైనను, మధ్యస్థితులలో నున్న అన్యజనులు మొదలు క్రీస్తు వరకు ఎవరైనను ఆత్మగా చూచిన యెడల ఒక్కడే గాని పాపపు శరీరములుగా చూచినచో అనేకము. ఒక్కడే అయినది సత్యము. కనుక ''అ'' నుండి ''క్ష'' వరకు ఉన్నవాడు అక్షరుడైన దేవుడే. ''దేవుడొక్కడే తప్ప మరిఎవడును సత్ పురుషుడు కాదు'' (లూకా 18:19). <br /><br /> సత్ పురుషుడు అనగా శాశ్వతముగా ఉన్నవాడు, పుట్టుక, చావు లేని వాడు, ఉత్పత్తి నాశనములు లేని వాడు, ఆది అంతములు లేని వాడు, మార్పు చెందని వాడు, పరిణామము లేని వాడు. దీనికి వ్యతిరేకమైన అసత్ కాని వాడు. దేవుడు తప్ప ఏదయినా ఉన్న యెడల అవి అన్నియు చావు పుట్టుకలు, మార్పు చెందు గుణములు కలవి మరియు అశాశ్వతమైనవి. సర్వములో సర్వావస్థలలో ఒక్క తీరుగా నున్నది సత్ అన బడును. అందు వలన దేవుడు సత్ పురుషుడు.<br /><br /> ''ఆయన (యేసు క్రీస్తు) దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొన లేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను'' (ఫిలిప్పి 2:6). యేసు క్రీస్తు దైవమే తానుగా ఉండుట వలన, తాను మనుష్యుని పోలిక నున్నప్పటికిని, తాను దైవము కంటె వేరని భావించ లేదు. అందు వలన యేసుకు తండ్రి వలె నుండుట క్రొత్తగా సంభవించగల ఉన్నత పదవి కానే కాదు. కనుక అది తన భాగ్యముగా యెంచనే యెంచడు. శరీర ధారిగా రిక్తుడు, అనగా శరీరానుసారమైన యే సంకల్పమును కర్తవ్యమును లేనివాడు. అయినప్పటికిని తండ్రి సంకల్పించిన పనులకు తాను దాసుడై యుండెను శారీరక క్రియలను తండ్రి కార్యములుగా చేయు చుండెను. అందువలన ఆయన తండ్రికి ప్రతినిధియు, తండ్రిని చేరుటకు మార్గమును ఆయ్యెను. ఈ విధముగా ఆత్మాను సారులకు సాదృశ్యమయ్యెను.<br /><br /> ''ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాప విషయములో శుద్ధీకరణ తానే చేసి... ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను ''(హెబ్రి 1:2-4). <br /><br /> యెహోవా ప్రపంచములను నిర్మించలేదు గాని, ఆయన లేకుండా ఏదియు సృజించ బడలేదు. ఆయన సత్తావలన యేసుచే అన్నియు నిర్మించ బడెను. ఇందుకు మహత్తు అను తేజస్సు , దేవుని సత్తా యొక్క క్రియా రూపమై సమస్తమును నిర్వహించ బడుచున్నది. కనుక క్రీస్తు స్థితిలో అందరును గుర్తించునట్లుగా నుండి యేసు స్థితిలో తండ్రి వలె జ్ఞానమై ఉండెను. తండ్రి చేయు క్రియలకు రూపునిచ్చునది దైవకుమారుడే. అందు వలన దైవకుమారుడు జ్ఞానమునందును, స్వరూపమునందును సత్యమై, సత్తాయై మరియు అధికారియై సమస్తమును సృష్టించుచు, పోషించుచు, లయము చేయుచు, తన ద్వారానే తండ్రి సంకల్పములను నెరవేరు నట్లు చేయును. ఈ యేసు క్రీస్తు స్థితి అజ్ఞానులకు క్రీస్తుగా కనబడుటకును, జ్ఞానులలో యేసుగా ప్రతిష్ఠితుడై ఆ జ్ఞానమును అందరికి అందించ గలుగుటకును ఉపయోగ పడును. ఎందుకనగా జ్ఞానమైన తండ్రి కన పడడ్ష్ము అజ్ఞానియైన వాడెవడైనను మన అజ్ఞానమును తొలగించ సామర్ధ్యము లేని వాడగును. అందు వలన యేసుక్రీస్తు ఒక్కడే ఈ రెండు స్థితుల కలయికతో ఉన్నందు వలన మనకు జ్ఞానోదయము కలిగించగలవాడు మరియు సద్గురువుతో సమానము. అందుకే యీ దైవకుమారుడు రక్షకుడు, ఆదరణకర్త, పోషకుడు, యజమాని, స్నేహితుడు, ప్రేమ గల సహోదరుడు, జ్ఞాన నేత్రమును తెరిపించువాడు, మారుమనస్సును అనుగ్రహించు వాడు, ఎట్టి పాపులనైనను వారి పశ్చాత్తాప మూలమున క్షమించి, రక్షించు ప్రియతముడును, కరుణామయుడును. ఇట్టి వానిని మనకు అనుగ్రహించుటలో తండ్రికి మన యెడల సహజమైన ప్రేమ ఉన్నది. అందు వలననే ఎవడైనను యేసు క్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు అని వాక్యము. యేసు క్రీస్తు గురు స్వరూపమై అంత:కరణములను శుద్ధీకరణ చేయుట ద్వారా జ్ఞానమును నొసంగుచున్నాడు. ఆయన (యేసు) యందు దైవత్వము స్వరూపముగా నున్నది, అయినను, ఆయన మూర్తిమంతమై (క్రీస్తుగా) శిష్యుల శుద్ధి కొరకు వచ్చెను.<br /><br /> ఈ విధముగా తండ్రి లోను కుమారునిలోను క్రీస్తుగా మారినట్టి తనలోని దేవుని మహిమను, ఘనతను దర్శించ వలెను. అనగా క్రీస్తైన సాధకుడును, కుమారుడైనట్టి యేసును, తండ్రియైనట్టి యెహోవాను ఒక్కటేయని అనుభవము కలుగ వలెను. ఈ ముగ్గురిలో నున్న పరిశుద్ధాత్మ ఒక్కడిగా నుండి యీ మూడు స్థితులను పోషించుట ద్వారా దీనిని త్రిత్వమందురు. ఇదియే పరిపూర్ణమైన జ్ఞానము. ''మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా నుండెదరు'' (మత్తయి 5:48). కుమారుని ద్వారానే పరిపూర్ణ జ్ఞానము కలుగును కనుక ఆ కుమారుడే సత్యమైయుండి మార్గముకూడా అయ్యెను. పరిపూర్ణమైనది జ్ఞానము. పరిపూర్ణము కానిది అజ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము ఉండజాలదు. ఎట్లనిన వెలుగు ఉన్నచోట చీకటి ఉండనేరదు. ''పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును'' (1కొరింథి 13:10). యేసు వాక్యము సత్యవాక్యమే అగును. ఆయనచే నియమించ బడిన అపొస్తలుల వాక్యముకూడా సత్యవాక్యమే. ఎందుకనగా అపొస్తలులు క్రీస్తు యేసు స్థితియందుండి యేసు ప్రేరణచే ప్రవచింతురు గాని, వారికై వారు భాషించరు. <br /><br /> కనుక ''మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముంద్రింప బడితిరి. దేవుని మహిమకు కీర్తికలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్త్యమునకు సంచకరువుగా ఉన్నాడు'' (ఎఫెసి 1:13-14). ఆయన సంపాదించుకొనిన ప్రజలనగా క్రీస్తుయేసుగా ఉన్న ఆయనచే సంపాదించు కొనబడిన వారు, అనగా క్రీస్తుగా మారిన విశ్వాసులు. ఆ విశ్వాసులు క్రీస్తుయేసు నందు ప్రవేశించి ఆయన ప్రజలైరి. ఆయనలో చేర్చుకొన బడినవారు శారీరక క్రియలు చేయుచున్నను, క్రీస్తు నందుండుట వలన వారు ఆ క్రియలను చేసియు చేయని వారగుచున్నారు. ఎందుకనగా వారి అంత:కరణములు విశాల పరచబడినవి. వారి హృదయములు పరిశుద్ధ పరచబడినవి. అందు వలన వారి యొక్క శ్రమలు మరియు వేదనలనుండి విముక్తులగుచున్నారు.. ఇదియే వారికి లభించిన స్వాస్త్యము. దేవుని మూలమైన విశ్వాసముతో క్రీస్తుగా మారిన వారు ఆయన యందు చేరి ప్రతిష్ఠితులగుదురు. అప్పుడు వారనుభవించు ఆనందమే వారికి స్వాస్త్యము. ఎందుకనగా వారి జ్ఞాన నేత్రములు వెలిగించ బడును. ఆయన యొక్క మహిమైశ్వర్యములను పొందుదురు. క్రీస్తు శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యము ఎట్టిదో మీ హృదయ పూర్వకమైన విశ్వాసము మూలమున మీరు తెలిసికొన్నచో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన, మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసి కొనుట యందు మీకు జ్ఞానమును, ప్రత్యక్షతయును అనుగ్రహించును. ఈ అనుగ్రహమే సంచ కరువు. అజ్ఞానమువైపుగా ఉన్న జీవము తండ్రి మహిమ వలన ఉజ్జీవమై జ్ఞానము కలిగినందున నిత్యజీవముగా మారును. ఇదియే సంచకరువు. ఆత్మాను సారుల హృదయ పూర్వక విశ్వాసము వారిని క్రీస్తుగా మార్చును. క్రీస్తైన వారు క్రీస్తుయేసు నందు ఉండెదరు. అక్కడ వారు వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మచే(యేసుక్రీస్తుచే) ముద్రింపబడుదురు. ముద్రింప బడిన వారు జ్ఞానముతో స్వస్థత నొందుదురు. స్వాస్త్యమైన వారికి ఆయన సంచకరువై ఉన్నాడు. ఆ సంచకరువు మూలముగా క్రీస్తుయేసు అయిన వాని ఆత్మ దేవుని ఆత్మచేత పరిశుద్ధ పరచ బడి పరిశుద్ధాత్మగా అనగా యేసుగా మారును. పరిశుద్ధాత్మగా అభిషిక్తులైన వారికి పరలోక నివాసము (యెహోవా నందు) శాశ్వత నివాసముండును. ఇదియే సత్యమును వెంబడించి సత్యముగా మారుట. ఈ పరలోక రాజ్య నివాసమందు క్రీస్తు న్యాయస్థానము ఉండదు కనుక యిక మరణమునకు తీర్పు తీర్చ బడదు. ఇదియే నిత్యజీవము.<br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-55199575734552982762014-02-28T04:59:00.002-08:002014-02-28T04:59:43.385-08:007. దేవుని చిత్తము<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;">7. దేవుని చిత్తము</span><br /><br /><span style="font-size: large;"> ''జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.'' జారత్వమనగా ఆజ్ఞను అతిక్రమించుట., ఆదాము అవ్వలు దేవుని చిత్తమును వ్యతిరేకించి పాపమునకు జారి పోయిరి.'' కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును, ఘనతయందును తన ఘటమును (శరీరమును) ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలచెను గాని, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.'' (1థెస్స 4:3-5,7).</span><br /><br /><span style="font-size: large;"> ఘటమనగా శరీరము. ఈ శరీరమును పాపేచ్ఛలకుగాక ఆత్మానుభవమునకు సాధనముగా వినియోగించుటయే దేవుని చిత్తము. అందువలననే ఈ శరీరము మనకు వచ్చినది. కామాభిలాష ఉన్నచో తిరిగి తీర్పునకు లోబడి దేవుని ఉగ్రతకు లోనగును. దీనిని ఎప్పుటికైనా నివారించు కొనక తప్పదు. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి, ఆత్మానుసారము, ప్రేమ పూరితమైన హృదయమును సంపాదించు సాధన అత్యంత అవసరమై యున్నది. దేవుడు ''తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసు క్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును, నిర్దోషులమునై యుండ వలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను'' (ఎఫెసి 1:6). దేవుని యందు భూతవర్తమాన భవిష్యత్తులు లేవు. కర్మలు జరుపుకొను చున్న మనకు యీ కాలము లున్నవి. ఏకాలమునందైనను సృష్టించ బడుచున్న నరులందరును ఆయన వద్దకు చేర వలసిన వారే. అట్టి ప్రణాళిక దేవునిచే ఎప్పుడో చేయబడెను. అన్నియు ఆయన వల్లన,ే ఆయన మూలముగానే జరుగుచున్నవి. చివరకు ఆయన యందు చేర్చుకొనబడుట కూడా ఆయన ఇచ్ఛయే. కనుక మనము చేయునది ఏమియు లేకయే అన్నియు దైవచిత్త ప్రకారము జరుగుచున్నవి. ఇది యెరిగి ఉన్నవాడు తన శరీరము కొరకు శ్రమించడు. ఆయన సంకల్పమునకు సర్వము విడచి పెట్టి తాను ప్రశాంతముగా ఉండును.'' ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమి మీద ఉన్నవే కాని, సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో నిర్ణయించుకొనెను'' (ఎఫెసి 1:10). ''నీ చిత్తము (దేవుని చిత్తము) ను పరలోకము నందు నెరవేరు చున్నట్లు భూమియందును నెరవేరును'' (మత్తయి 6:10). భూలోకమందు జరుగు ప్రతి క్రియను పరలోకమందు దైవీ ప్రణాళిక ననుసరించియే జరుగుచున్నది. అందువలన ఇచ్చట జరుగుచున్న వన్నియు పరలోకమందు ముందుగా నిర్ణయించి నట్లుగానే జరుగుచున్నవి.ఙ</span><br /><br /><span style="font-size: large;"> కనుక మన నిజస్థితి క్రీస్తులోనే యున్నది. క్రీస్తుగా ఉండుటయే సత్యము. సత్యమును మరచి పాపము చేయుట వలన మనము అన్యజనులమైతిమి. అన్యజనులైన వారిని క్రీస్తుగా మార్చుటకు మొదట మనము విశ్వాసులుగా మారుటయే దేవుని చిత్తము. భ్రష్టులైన నరులను విశ్వాసులుగా మార్చుటకు యెహోవా తనను గురించియు , తన మహిమ, ఉగ్రతల గురించియు ప్రవచనముల ద్వారా తెలియ పరచెను. </span><br /><br /><span style="font-size: large;"> దేవుని చిత్త ప్రకారము అప్పటి జారులు, మూర్ఖులు, అవివేకులు , బుద్ధిహీనులు వారి భ్రష్ట క్రియలనుండి పరివర్తన చెంది యెహోవా యందు విశ్వాసులైరి. అయినను మంచివి గాని, చెడ్డవి కాని క్రియలు జరుపుట వలన వారు యింకను క్రియల వరకే విశ్వాసులైరి. కాని నీతిమంతులగుటకు ఆ విశ్వాసము హృదయ పూర్వకమును, పూర్ణ వివేకముతో గూడినదై యుండవలెను. కనుక వీరికి సత్యమును తెలియ పరచి, అట్టి సత్యములో ప్రతిష్ఠించుటకు మార్గమును తెలియ పరచ వలెను. ఈ సత్యమును, మార్గమును, జీవమును బోధించుటకును, సాదృశ్యముగా జీవించి, ఆయన జీవనమును విశ్వాసులైన వారు అనుసరించుటకుగాను దైవకుమారుడు అయిన యేసు క్రీస్తు పవిత్రమైనట్టి మనుష్యశరీరమును ధరించి క్రీస్తుగా మరణించెను. మరల తండ్రి చేత యేసుగా లేప బడెను. దయామయుడైన దేవుడు పతనమైన నరులను క్రీస్తు మార్గమున నడిపించుటకు అనేక విధములుగా ప్రయత్నించెను. చివరగా తనను పోలిన క్రీస్తును నరుల కొరకు పంపెను. ఆయన అన్నింటి యందు, తనను మనలకు సాదృశ్యపరచుచు బోధించెను. ఇందు కొరకు ఆయన శరీరముగా అనేక శ్రమలు పొంది, సహనము, శాంతి, ప్రేమను కన పరచుచు, చివరికి, సిలువపై క్రీస్తుగా మరణించెను.</span><br /><br /><br /><br /><span style="font-size: large;">దేవుని చిత్తము(సాధన):-</span><br /><br /><span style="font-size: large;">1. నీకు సంబంధించి, నీ శరీరావసరములకును, కుటుంబ అవసరములకును, సమాజమునకును, నీకున్న బాధ్యత నుండి తప్పించుకొనవద్దు. అయినను శరీరము నీవు కాదు గాని ఆత్మవే అయి ఉన్నావని మరువ వద్దు.</span><br /><br /><span style="font-size: large;">2. లోక సంబంధమైన వానిలో నీకున్న సమస్త ధర్మములను తప్పక నెరవేర్చుము. కాని వీటిని విశ్వాస పూర్వకముగా చేయుము మరియు ఇదంతయు ''ప్రభువు యొక్క ఆజ్ఞయే'' యని నిరంతర భావన మనస్సులో కలిగి ఉండుము.</span><br /><br /><span style="font-size: large;">3. నీకు ఆనందము కలిగినప్పుడు ''ప్రభువు నన్ను ఆనందింప గోరుచున్నాడు'' అను కొనుము. నీకు బాధ కలిగి నప్పుడు ''ప్రభువు నన్ను బాధ పడగోరు చున్నాడు'' అనుకొనుము. కాని ఇదంతయు నన్ను క్రీస్తులోనికి నడిపించుటకే యని నిరంతరము భావించు చుండుము.</span><br /><br /><span style="font-size: large;">4. నీవు యే పరిస్థితిలో నున్నను ''ప్రభువు నన్ను యీ పరిస్థితిలో నుంచెను'' అని విశ్వాస పూర్వకముగా చలించక ఉండుము. కాని మంచి చెడు క్రియలు చేయుటకు యీ పరిస్ధితిని కారణముగా నెంచకుము. అంతయూ ప్రభువుచిత్తము మేరకు జరుగుచున్నది యని తెలిసి జీవించుము.</span><br /><br /><span style="font-size: large;">5. ''ప్రభువే ప్రతి ఒక్కరిలోను కలడు'' అనెడి యదార్ధ భావమును నిరంతరము నీ యందు నిలుపుకొని పరోపకారము చేయుము. పొరుగు వానిలో అతని స్వభావమును గాక, ప్రభువుని మాత్రమే చూడుము. అప్పుడే నీవు చేయు మంచి పని యైనను నీలో అహంకారము కలుగ నీయదు. అన్నింటనూ అంతటనూ సర్వవ్యాపక దైవమే ఉనికిని కలిగి ఉన్నదని దర్శించుము.</span><br /><br /><span style="font-size: large;">6.నిన్ను నీవు యెంతగా ప్రేమించు కొను చున్నావో నీకు తెలియును కనుక పొరుగు వానిని ప్రేమించుటలో అంతకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావో లేదో పరిశీలించుకొనుము. అందరిలోనూ ప్రభువునే చూడ గలిగిన వానికి మాత్రమే ఇది సాధ్యము. విశ్వజనీన ప్రేమకు ఆధారమే నీలో నున్న దేవుని ఆత్మకనుక. ''నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము''.</span><br /><br /><span style="font-size: large;">7. నీవు ఏమి చేసినను, ఏది అనుభవించినను, అది అంతయు నీవును, నీ ఇంద్రియములకును, నీ మనో బుద్ధుల వలన గాదని, దైవ నిర్ణమమే జరుగు చున్నదని గ్రహించుము. కనుక అన్నియు ''ప్రభువు పేరిట జరుగుచున్నవని'' విశ్వాసముతో నుండుము.</span><br /><br /><span style="font-size: large;">8. దేవుడు సకల జీవులను మంచి చెడులెంచక ప్రేమించును. అటులనే దేవుడు మనలను ప్రేమించి నట్లు, మనమును సకల జీవులను నిస్వార్ధముగా ప్రేమించ వలెను. నేను మిమ్ములను ప్రేమించుచున్నట్లు మీరు నన్ను ప్రేమించుడి! </span><br /><br /><span style="font-size: large;">9.''పభువా!ప్రభువా!అని నన్ను పిలుచు వాడును పరలోకరాజ్యమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.''(మత్తయ 7ః21)</span><br /><br /><span style="font-size: large;">10. దేవుని చిత్తము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలకు నిలయము. సహృదయులైన విశ్వాసుల జీవితమే దేవుని చిత్తమందలి ప్రణాళిక. సద్గురులైన యేసు కృపావరముచే దేవుని చిత్తానుసారము అనగా ఆత్మానుసార జీవితముతో పరిశుద్ధాత్మ యగుదుము. ఆమెన్!</span><br /><br /><br /></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-53428536236520718812014-02-28T04:57:00.000-08:002014-02-28T04:57:06.083-08:00 6.ధర్మశాస్త్రము - నీతి <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<span style="font-size: large;"> 6.ధర్మశాస్త్రము - నీతి </span><br /><br /><span style="font-size: large;"> ''మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్ధమైన ఫలములను ఫలించుటకై ధర్మ శాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను'' (రోమా 7:5). ధర్మశాస్త్రము మంచి చెడులను అందుకు తగిన ప్రతి ఫలమును నిర్ణయించును. మన అవయవములుగాని, ఇంద్రియములుగాని మంచి చెడు క్రియలు చేయుచున్నవి కాని అవి మనలో నున్న పాపేచ్ఛ వలన నడిపించ బడుచున్నవి. మనము ఆత్మాను సారులమైతిమా పాపేచ్ఛల వలన జరుగు దుష్క్రియలు ఆగి పోవును. సత్క్రియల ఫలితముగా ధర్మశాస్త్రము మనకు వర్తించదు. అందు వలన మరణమునకు తీర్పు ఇవ్వబడదు. అయినను ధర్మశాస్త్రము చెడ్డది కాదు. దాని వలననే మనకు గుణ పాఠము కలిగి దేవుని వైపునకు తిరుగు చున్నాము. </span><br /><br /><span style="font-size: large;"> ''ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా నెట్టిదో తెలియక పోవును. ఆశించ వద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో తెలియక పోవును. అయితే అజ్ఞానము, (అవిద్య) దేవుని ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను మనయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిమి గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను.'' (రోమా 7:7-9). అజ్ఞానము ద్వారా (ఆదాము ద్వారా) పాపమును, పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే ఆదాము వారసులమైనట్టి యీ మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిన్నీ సంప్రాప్తమయ్యెను. </span><br /><br /><span style="font-size: large;"> ఆదాము అవ్వలు ఆయన ఆజ్ఞను అతిక్రమించక మునుపు ధర్మశాస్త్రము లేదు, పాపమును లేదు. తరువాతనే పాపమునకు జీవము కలుగునట్లు దేవుడు ఆజ్ఞ యిచ్చెను. ఈ జీవము శరీరమునకు హేతువు గాని, ఆత్మ నిత్యజీవమై యున్నది. తిరిగి తాను దేవుని పోలిన వాడనని తెలిసికొనుటకు సాధన జేయ వలసి ఉన్నది. ఆత్మానుభవమునకు శరీర మనస్సులు అవసరమని, అవి మనకు దేవునిచే దయ చేయ బడెను. కనుక ''తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు అనగా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు. ''(రోమా 4:7-8). ప్రాయశ్చిత్తమనగా శరీరానుసార జీవితము అసత్యమని యెంచి, వైరాగ్యమునొందుట. ఆత్మానుసారుడు తుదకు క్రీస్తు అగును, అనగా పవిత్రుడగును. మంచి చెడు క్రియల మూలమైన వృత్తి నుండి విమోచన నొందును. కనుక అట్టి క్రియలకు తీర్పు ఇవ్వబడదు. ఆ విధముగా ధర్మశాస్త్రము క్రీస్తుకు వర్తించదు మరియు ప్రభువుచే నిర్దోషి యని యెంచ బడును. కనుక క్రీస్తయిన వాడు క్రీస్తు యేసు(నిర్వాణము) నందు ప్రవేశించును. అట్టి వాడు ధన్యుడు. ఇది ఆత్మానుసారునికి కలుగబోవు ఫలితము.</span><br /><br /><span style="font-size: large;"> ధర్మశాస్త్రమునకు తెలిసి లోబడుటయే సాధన, లేక విధేయత. తెలియక పోయినను, ధర్మశాస్త్రము శరీరానుసారులకు యివ్వవలసిన ఫలితముల నేర్పరచి యుంచు చుండును. ఇవన్నియు దేవుని ఉగ్రత దినమందు తీర్పులోనికి తీసికొని రాబడును. సాధకుడు ధర్మశాస్త్రమునకు విధేయుడు. ''ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదును. అయితే పాపమునకు, శరీర సంబంధియై యున్నాను. ఏలయన, నేను చేయునవి నేనెరుగుదును, నేను చేయ నిచ్ఛయించునది చేయక, ద్వేషించునది చేయు చున్నాను. ఇచ్ఛయింపనిది చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేనుకాదు ''(రోమా 7:14-20). ఆత్మ చే నడిపించబడుచున్న నేను ధర్మశాస్త్రము అనుసరించు వాడను, మరియు మేలైన క్రియలు చేయ నిచ్ఛయించువాడను. కాని నాయందు నివసించు పాపమే నా చేత స్వార్ధపరమైన క్రియలను జరిపించుచున్నది.</span><br /><br /><span style="font-size: large;"> ''మేలైనది చేయ వలెననెడి కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయ గోరు మేలు చేయక చేయ గోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపము గాని యిక నేను కాదు. '' (రోమా 7:17,19,20) .'' నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుదును.'' (రోమా 7:18) ఈ వాక్యముల అర్థము నేను వేరు, నా యందు నివసించు పాపము వేరు అని గోచరించుచున్నది. పాపమే త్రిగుణముల వలన శరీర సుఖమును, ఇంద్రియముల సుఖమును కోరుచున్నది మరియు క్రియలను తన స్వార్ధము కొరకు అజ్ఞానముచే జరుపుచున్నది. ఈ పాపము అనగా శరీరమే నేను అనబడునది ఆత్మ ప్రబోధమునకు విరుద్ధముగా స్వతంత్రించుచున్నది. పాప క్రియలన్నియు దుష్క్రియలు. ఆత్మ కోరునది సత్క్రియలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనప్పటికిని, యీ మనస్సు పాప క్రియలు జరుపు అనుభవముతో ఏకమైనట్లున్నది. ఈ భావమే శరీరానుసార క్రియలకు హేతువు. యీ భావము నుండి వేరై, నిస్వార్థముగా ఉండుటకు సహనము, ఓర్పు , సాత్వికము, దీర్ఘశాంతము అను సత్క్రియలు జరుపు చుండ వలెను మరియు పాప ప్రేరిత క్రియలను సహనము, శాంతము అను సాత్విక గుణముతో ఎదిరించి జీవించుటయే ఆత్మాను సారము. ఆత్మానుసారముగా జీవించుట అనగా, నా యందున్న అంతరంగ పురుషునిగా నేనే సత్యమని యుండుట, మరియు బాహ్య పురుషుడైన పాపము అను శరీర అభిమానము నడిపించునది మరణమునకే గాని , దీర్ఘశాంతమైన సత్యమునకును, నిత్యజీవమునకును మాత్రము కాదు. </span><br /><br /><span style="font-size: large;"> ''అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములలో నున్నట్లు కనబడు చున్నది. అది నామనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచూ నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెర బట్టి (బంధించి) లోబరుచు కొనుచున్నది. ఇది ఎంత దౌర్భాగ్యము! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.'' (రోమా 7:22-25).</span><br /><br /><span style="font-size: large;"> కనుక మనస్సాక్షికి లోబడుట జ్ఞానము. పాప నియమమునకు లోబడుట అజ్ఞానము. అజ్ఞానము బంధించును. జ్ఞానము బంధమునుండి తప్పించి నిత్యజీవమునకు గొని పోవును. కనుక పాపమే మన నిత్యజీవమునకు అవరోధము. శరీరేచ్ఛయు, దురాశతో జరుపు క్రియలు పాపమును పుట్టించును. ''విశ్వాసమూలము కానిది పాపము.'' (రోమా 14:23).</span><br /><br /><span style="font-size: large;"> ఎందుకనగా విశ్వాసమూలము కానిది శరీరానుసారమైనది. శరీరేంద్రియ స్వార్థమునకై జరుపు మంచి చెడు క్రియలు మరణమునకు చేర్చును. మరణము కొరకు శరీరమును, సుఖదు:ఖములను అనుభవించుటకు డంబమును పుట్టించును. డంబము అనగా నేను నాది అను అహంకారము. అందుకే ''దురాశ గర్భము ధరించి పాపమును కనగా , పాపము పరిపక్వమై మరణమును కనెను.'' (యాకోబు 1:15). ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్ను ఎవరు విడిపించును? మరణమునకు తీర్పు ఎట్లు వచ్చును? ఎవరు తీర్పు నిచ్చెదరు?</span><br /><br /><span style="font-size: large;"> </span><br /><br /><span style="font-size: large;"> ''తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగాని తీర్పు తీర్చు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు''. (యోహాను 5-22,23). ''కుమారుని యందు విశ్వాసము కలవాడే నిత్యజీవము కలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును'' (యోహాను 3-36). యేసు యిలాగు చెప్పెను '' నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచు వాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' (యోహాను 5-24).</span><br /><br /><span style="font-size: large;"> యేసు క్రీస్తును పంపిన వాడు తండ్రియైన యెహోవా. ఆ దేవుని యందు విశ్వాసము నుంచువాడు తప్పక క్రీస్తుగా మారును. మరియు వాడు క్రీస్తుయేసుగా నిత్యజీవము కలవాడగును. నిత్యజీవమనగా యేసు నందు ప్రవేశించిన వాడగుట. వాడు యిక మరణమునకు తీర్పు తీర్చ బడడు. </span><br /><br /><span style="font-size: large;"> క్రీస్తు న్యాయస్థానములో ఉగ్రత దినమందు తీర్పు యివ్వబడును. ''ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొను చున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వానికి నిత్యజీవము నిచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. </span><br /><br /><span style="font-size: large;">(1) ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు.</span><br /><br /><span style="font-size: large;">(2) ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.</span><br /><br /><span style="font-size: large;">(3) ధర్మశాస్త్రముననుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.'' (రోమా 2:5-13).</span><br /><br /><span style="font-size: large;">ఒక్కసారి నీతిమంతులైనచో ధర్మశాస్త్రము వారికి ఏమాత్రము వర్తించదు. ''మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్పు తీర్చ బడునట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అయినను విశ్వాసము వెల్లడి ఆయెను కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.''(గలతీ 3:24-26) ఎందుకనగా ''క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు '' .రోమా (10:4) క్రీస్తు స్థితిని పొందినవాడు నీతిమంతుడై ఉండును. నీతియనగా దేవుని నీతి.కనుక ఈ నీతి ధర్మశాస్త్రమునకు అతీతమైనది. </span><br /><br /><span style="font-size: large;"> కనుక శరీరానుసారులకే ధర్మశాస్త్రము. వారు క్రీస్తు దినమందు మరణమునకు తీర్పు తీర్చ బడుదురు. ఆత్మానుసారులు యేసు ప్రభువు నందు హృదయ పూర్వక విశ్వాసముచే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని నీతిని స్థిర పరచుటకు ధర్మశాస్త్రమును సమాప్తము చేయుచున్నాడు. ఆపై ''రెండవ దానిని స్థిర పరచుటకు మొదటి దానిని కొట్టి వేయుచున్నాడు.'' </span><br /><br /><span style="font-size: large;">-(హెబ్రి 10-9).</span><br /></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-74950052033214610392014-02-28T04:53:00.002-08:002014-02-28T04:53:55.622-08:005. శరీరానుసారమును నిరసించుట<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">5. శరీరానుసారమును నిరసించుట<br /><br /> శరీరమనగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములని మూడు విధములు. స్థూల శరీరము రక్తము, మాంసము, రసము, ఎముకలు, మూలిగ, చర్మము, మేధస్సు అను సప్త ధాతువులతో కూడినది. ఇది కంటికి స్థూలముగా గోచరించునది. ఇది అన్నము వలన పుట్టి, అన్నము వలన వృద్ధి చెంది, అన్నము లేనిచో కృశించి, నశించు ధర్మము కలది. ఇది బాల్య, కౌమార, యౌవ్వన, వృద్ధాప్య పరిణామములు పొంది, ఒకప్పుడు లేక, మధ్యలో వచ్చి మరల లేక పోవునది. ఇది ప్రాణము లేనిచో శవముగా మారును. కనుక స్థూల శరీరము తానుగా వ్యవహారము చేయలేదు. కనుక స్థూల శరీరము నేను కాదు, ప్రాణమును నేను అని ఉండవలెను. <br /><br /> కాని నిద్రించు చున్నప్పుడు ప్రాణమున్నను లోక వ్యవహారము లేదు మరియు ఇంద్రియములు పని చేయుట లేదు. ప్రాణమే సత్యమైనచో దాని వలన జరుగు క్రియలు ఒకసారి ఉండి మరియొకసారి లేకుండుట జరుగ రాదు. ఎందుకనగా సూర్య కిరణములు సూర్యుని నుండి ఎల్లప్పుడు ప్రకాశించు చున్నట్లు, ప్రాణము ఎల్లప్పుడును ఇంద్రియముల నంటియుండవలెను. కాని అట్లు జరుగుట లేదు. రాజుండగా భటులు రాజు యెదుట నిద్రించరు కదా, కాని ప్రాణమున్నను ఇంద్రియములు విశ్రమించు చున్నవి. కనుక ప్రాణము సత్యము కాదు. కనుక నేను అను యజమాని శరీర ప్రాణములు కాదు.<br /><br /> ఈ విచారణనను మరింత లోతుగా కొనసాగించినచో ప్రాణము ఉన్నను మనస్సు లేనిచో నేను చేయు క్రియలకు నాకు అనుభవము వచ్చుట లేదు. ఎందుకనగా గాఢ నిద్రలో నా మనస్సు పని చేయుట లేదు. అక్కడ నాకు ఏమియు తెలియుట లేదు. గాఢనిద్రలో వ్యవహారము లేదు. అనగా మనస్సు ఉన్నప్పుడే వ్యవహారము జరుగుచున్నది. అందువలన మనస్సే నేను అయి ఉండ వలెను. నేను అనునది సత్యమైనచో, మనస్సు కూడా సత్యమే. సత్యమనగా సూర్య ప్రకాశము వలె నిరాటంకముగా ప్రసరించ వలెను. భూమి తిరుగుట వలన రాత్రియందును, మేఘములు అడ్డు పడుట వలన పగలును చూచు వాని దృష్టికి కనుపించదు గాని, సూర్య కిరణ ప్రకాశము ఎల్లప్పుడును ఉండును. కాని మనస్సు విషయములను, ఇంద్రియములను గాఢ నిద్ర యందు ప్రకాశింప జేయుట లేదు. అనగా తెలియపరచుటలేదు. అందు వలన మనస్సు సత్యము కాదు. కనుక మనస్సు నేను కాదు. ఇంను మనస్సు ఆలోచించునే గాని యే పని చేయుటకు నిర్ణయించదు. నిర్ణయమైన పిదపనే అనుభవముగాని కేవలము ఆలోచించు చున్నందు వలన వ్యవహారము జరుగుట లేదు. బుద్ధిచే నిర్ణయమైన పిదపనే కర్మము, ఫలితము అనుభవములోనికి వచ్చుచున్నవి. అందువలన నేను అను అనుభవమునకు నిర్ఱయము చేయు బుద్ధియే కారణమగుచున్నది. <br /><br /> బుద్ధి నిర్ఱయములన్నియు, తన సుఖ సంతోషముల కొరకే గాని, దు:ఖమునకును, నష్టమునకును, వేదనకును ఏ నిర్ఱయము జరుగుట లేదు. కనుక బుద్ధి తాను నిర్ఱయించుటకు మరియొక యజమానిపై ఆధార పడి ఉన్నది. కాని అది దైవము వలన కలుగు ఆనందమును ఆనభవించక విషయముల ద్వారా అట్టి సంతోషమును ప్రియము, మోదము, ప్రమోదము అను మూడు స్థితులలో పొంద ప్రయత్నించుచున్నది. ప్రియమనగా వస్తువుపై యిష్టత, మోదమనగా అది లభించినందుకు కలుగు సంతోషము. ప్రమోదమనగా ఆ వస్తువును అనభవించుటవలన కలిగిన తృప్తి. ఈ విధముగా చిత్తము వ్యవహార భేదము లేకుండా ప్రియ, మోద, ప్రమోదములను ఆమోదించుచూ నిరంతరము ప్రవాహరూపమున ప్రేరణనిచ్చుచూ త్రిగుణశక్తికి మూలమై యుండును. నేను అనెడి ఈ యజమాని చిత్తములో వృత్తి రహితమైన చోట వశించుచున్నాడు. కాని వృత్తుల ద్వారా వర్తించ ప్రయత్నించు చున్నాడు. కనుక చిత్త వృత్తులు ఆగినచో నిజమైన ఆనందము లభించ గలదు. కాని చిత్త వృత్తులు శరీర సంబంధమై నందు వలన అట్టి నిజమైన ఆనందము లభించుట లేదు. <br /><br /> అందు వలననే శరీరానుసారమైన క్రియలకు మూలమైన స్థూల శరీరము నేను కాదనియు, ప్రాణము నేను కాదనియు, మనో బుద్ధులు, చిత్తము నేను కాదనియు, యెంచి నా శరీరము యెడల అభిమానమును నిరసించినచో నాకు యదార్ధమైన ఆనందము కలుగుచున్నది. ఇట్టి ఆనందము కొరకు శరీరానుసారముగా కాక, ఆత్మయే లక్య్షముగా , నేను ఆనంద స్వరూపముగా గల యజమాని ననియు భావించుచు జీవించ వలెను, అనగా తానే దైవమని ఆత్మానుసారము గావలెను.<br /><br /> చిత్తవృత్తులే శరీరానుసారమైన అనుభవములకు మూలము. ఇవి తప్పనిసరిగా అంకురించును. అందు వలన మనస్సు వృత్తి సంబంధ ఆలోచనలను విడువ జాలదు. అందుకే మనస్సు చంచలమనియు, ఏకాగ్రత చెందించుట కష్టమనియు చెప్పుదురు. శరీరానుసారమైన అభిమానముతో అనుభవమును పొందు ''నేను'' ను అహంకారమందురు.<br /><br /> చిత్తవృత్తుల క్రమమేమనగా తాను పూర్వమందు చేసిన శరీరానుసార క్రియలకు కలిగిన మంచి చెడుల ఫలితములే మరల మరల తన అనుభవములోనికి సుఖదు:ఖ రూపముగా అంకురించుట. ఈ విధముగా వృత్తులు బయలు పరచు చిత్తము, తదనుగుణముగా ఆలోచించు మనస్సు, అనుభవముల కొరకు నిర్ణయించు బుద్ధి మరియు అనుభవించు అహంకారము, యీ నాలుగును కలిసి అంత:కరణ చతుష్టయ మందురు. చిత్తవృత్తులను నిరోధించినచో అంత:కరణము శుద్ధమగును. ఆత్మానుసార జీవితము చేతనే అంత:కరణ శుద్ధి జరుగును. <br /><br /><br /><br />ఆత్మానుసారుడు<br /><br />మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు<br /><br />చిత్తము కాదు నేను, నేను అహంకారమును కానే కాదు <br /><br />విను చెవిగాని, చూచు కన్ను గాని నేను కాదు<br /><br />జిహ్వయైన, నాసికయైనను నేను కాదు.<br /><br />భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు నేను కాదు.<br /><br />నన్ను బ్రతికించు ప్రాణము నేను కాదు.<br /><br />సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు నేను కాదు.<br /><br />అన్నమువలన పుట్టిన అవయవములు కాదు నేను. పుట్టి, పెరిగి, నశించు దేహమును నేను కాదు. రక్త, మాంస చర్మములు కాదు, అస్తి మజ్జ రసములు కాదు, మెదడు కానే కాదు. శరీరమే నేను కాదు. మంచి చెడులు చేయు చున్న ఇంద్రియములు నేను కాదు.<br /><br />అందు వలన నాకు లేవు రాగ ద్వేషములు, మంచి చెడు ఫలితములు, అరి షడ్వర్గము లేదు నాకు, సుఖదు:ఖములు శరీరానుసారులకే గాని నాకు లేవు. మాన అవమానము లేదు, అభిమానము నాకు లేదు. శరీరానుసారమైన తల్లి లేదు, తండ్రి లేడు అందుకని బంధుమిత్రులు లేరు, జన్మ లేదు, మరణము లేదు. ఎందుకంటే అవి శరీరానుసారులకే గాని ఆత్మకు కాదు.<br /><br />ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ శాశ్వతము. నాకున్నది నిత్యజీవము, నేనున్నది యేసులోనే. <br /><br />నేను ఆత్మను, నేను ఆత్మను, పరిశుద్థాత్మను.<br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-37107410957519560302014-02-28T04:50:00.002-08:002014-02-28T04:50:13.877-08:004.విశ్వాసులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">4.విశ్వాసులు<br /><br /> ''విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును , అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఋజువై ఉన్నది.'' - (హెబ్రి 11:1)<br /><br /> దృశ్యమైనవి అందరికి ఎరుకే గాని, అదృశ్యమైనవి లేవనుట అవివేకము. దైవము అదృశ్యము కనుక, తెలిసిన దాని నుండి విచారణ సాగించి, తెలియని దానిని వివేకముతో అనుభవ పూర్వకముగా తెలిసికొన వలెను. ముందుగా పెద్దల వలన తెలిసిన దానిని ప్రమాణమనియు, సత్యము అనియు నమ్మి విశ్వాసము కలిగి ఉండ వలెను. దైవము ప్రత్యక్షతగా ఉండడు. కాని అనుభవము ద్వారా పొందవలసినది మాత్రమే. అయినను, తండ్రియైన దేవుడు విశ్వాసులమైన మనకు ఋజువు చేయుటకై యేసుక్రీస్తును ప్రత్యక్ష పరచెను. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు జేరు మనెను. ఇది దైవ వాక్యమైనందున వేద ప్రమాణము. <br /><br /> ''విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము.'' -(హెబ్రి 11:6). <br /><br /> దేవుడు ఆత్మ స్వరూపమున మనకంటే వేరు కాదు గనుక ప్రేమ స్వరూపుడైన దేవుడు మనలో నిజమైన ప్రేమగా ప్రతిష్ఠితుడయ్యెను. అందువలన ఆయనకు మనపై ఇష్టము కలిగి ఉండెను. కాని అది మన విశ్వాసము వలన అనుభవ పూర్వకముగా తెలియ బడును.<br /><br /> ''మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.'' (1తిమోతి 4:12). <br /><br /> శరీరానుసారులు మాటలలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను తండ్రిని ఎరిగినట్లుండ జాలరు. ఆత్మానుసారులు విశ్వాసములో తమ పూర్ణత్వమును సంపాదించు కొని నందున దైవమునకు ప్రతినిధు లగుదురు. ఎందుకనగా తండ్రి యొక్క కృపావరముచే మనము విశ్వాసము ద్వారా తండ్రితో ఐక్యత పరచు కొనుచున్నాము. ''కనుక విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయతను కలిగి యదార్ధ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము.'' - (హెబ్రి 10: 22). <br /><br /> హృదయమనగా సత్యముండు చోటు లేక దైవముండు మందిరము. కావున యదార్ధ హృదయమనగా అజ్ఞానమైన మనస్సుగా కాక, సత్యత్వముతో నిండిన హృదయము. కనుక యదార్ధ హృదయము గల విశ్వాసికి గాని క్రీస్తు యేసు మార్గము తెలియదు. అందుకని అన్యజనులు మొదట విశ్వాసులుగా మార వలెను. విశ్వాసులగుటకు యీలాగు చేయవలెను. <br /><br /> ''ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి. మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైన దానిని ఎన్నుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి. యెడతెగక ప్రార్థన చేయుడి. ప్రతివిషయము నందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుటయే యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.'' (1ధెస్స 5:15-18). ప్రార్ధన , కృతజ్ఞతా స్తుతులనగా తెలియ వలెను. <br /><br /> ప్రార్థన :- ప్రార్ధన చేయుట అనగా శరీరమే నేనను భావము నుండి విడుదల కాబడి, ఆత్మయే నడిపించుచున్నదను భావన కలుగునట్లు మారుమనస్సు నొందుటకు దేవుని ఆశీర్వాదమును కోరుట. యబ్బేజు చేసినట్లు ప్రార్ధన చేయవలెను. <br /><br /> యబ్బేజు యితర సహోదరుల వంటి వాడు కాదు. యబ్బేజు అనగా వేదన వలన కలిగిన వాడు. శరీర, లోక సంబంధ విషయములలో అమితముగా వేదన పొంది, ఫలితముగా వాటి నుండి విడుదల పొందినవాడు. ఆత్మగా భావించుచున్నట్టి వాడు. ఇతడు వేదన వలన నూతనముగా జన్మించిన శోధన పుత్రుడు. అందువలన అతని ప్రార్ధన ఈ విధముగా ఉండెను. <br /><br /> ''నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా సరిహద్దులు విశాల పరచి, నీ చేయి నాకు తోడుగా ఉండునట్లు చేసి, నాకు కీడు రాకుండ దాని నుండి నన్ను తప్పించుము. '' - (1 దిన వృత్తాంతము 4-9,10).<br /><br /> పాపేచ్ఛ వలన ప్రతిఫలముగా కలిగినట్టి శరీరమే నేను అను పరిమిత భావముతో ఉన్నాను. ఈ విధముగా నేను ఏర్పచుకొనిన సరిహద్దును విశాల పరచి అందువలన ఆత్మయే నేను అని మారు మనస్సు నొందుటకు దేవుని సహాయమును, ఆశ్వీర్వాదమును కావలెనని యబ్బేజు ప్రార్ధించెను. ''దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసెను. '' అనగా ప్రార్ధన ఫలించెను. ఇట్లు ఫలించగల ప్రార్ధన హృదయ పూర్వక విశ్వాసము వలననే సాధ్యమగును. <br /><br />కృతజ్ఞతాస్తుతులు :- కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా తనకు తానై ఏపని చేయుచున్నాడనుట అసత్యమనియు దేవుని చేతనే అన్ని పనులు జరుగుచున్నవని యెంచి నేను ,నాది అనునది లేకుండగ ఊరకుండుట. ''మాటచేత గాని, క్రియ చేత గాని మరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు, సమస్తము ఆయన పేరిట(ఆయన నామమున) చేయుడి.'' - (కొలస్సి 3:17). ఈ విధముగా చేసిన సర్వము ఆయనకు అర్పించినట్లగును , ఆయన పేరిట పనులు జరుపువాడే విశ్వాసి మరియు ఆత్మానుసారుడు.</span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;"><br /><br />పశ్చాత్తాప నివేదనము<br /><br /> ఓ దైవమా <br /><br /> యెహోవా!<br /><br /> ప్రేమ స్వరూపా<br /><br /> కరుణామయా!<br /><br /> ఓ గాడ్! ఫాదర్ ఇన్ హెవెన్!<br /><br /> పరమదయానిధివగు ఓ ప్రభువా !<br /><br /> మా పాపములన్నిటికిని<br /><br /> మేము పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> అసత్యము, అధర్మము,<br /><br /> అపవిత్రము నగు<br /><br /> మా ప్రతి తలంపుకునూ<br /><br /> మేము పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> పలికి యుండరాని <br /><br /> పలికిన ప్రతి మాటకును,<br /><br /> చేసియుండరాని<br /><br /> చేసిన ప్రతి చేతకునూ,<br /><br /> మేము పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> స్వార్థముచే ప్రేరేపింపబడిన<br /><br /> ప్రతి పనికిని, ప్రతి మాటకునూ,<br /><br /> ప్రతి తలంపునకునూ<br /><br /> ద్వేషముచే ప్రేరేపింప బడిన<br /><br /> ప్రతి పనికిని, ప్రతి మాటకునూ<br /><br /> ప్రతి తలంపునకునూ,<br /><br /> మేము పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> ముఖ్యముగా కామముతో కూడిన<br /><br /> మా ప్రతి తలంపునకూ,<br /><br /> కామ ప్రేరితమగు మా ప్రతి చేతకూ,<br /><br /> పలికిన ప్రతి అనృతమునకూ,<br /><br /> సమస్త కపట వర్తనమునకూ,<br /><br /> ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకూ,<br /><br /> సమస్త పరనిందలకూ<br /><br /> పరోక్ష నిందలకూ<br /><br /> మేము పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> ఇంకనూ ముఖ్యముగా కూడ,<br /><br /> పరులకు నాశన మొనగూర్చినట్టి<br /><br /> మేము చేసిన ప్రతి పనికినీ:<br /><br /> ఇతరులకు బాధ కలుగ జేసిన<br /><br /> మేమాడిన ప్రతి మాటకునూ,<br /><br /> చేసిన ప్రతి చేతకునూ, <br /><br /> ఇతరులకు బాధ కలుగ వలెనని<br /><br /> మేము కోరిన ప్రతి కోర్కెకునూ,<br /><br /> మిక్కిలి పశ్చాత్తాప పడుచున్నాము.<br /><br /> అపార దయానిధివగు ఓ ప్రభువా!<br /><br /> మేము చేసిన యీ పాపములన్నిటికిని <br /><br /> మమ్మును క్షమించమని వేడుకొను చున్నాము.<br /><br />తలపులలో గాని, మాటలలో గాని, చేతలలో గాని<br /><br /> నీ ఇచ్ఛానుసారము నడచుకొన జాలక<br /><br /> నిరంతరము విఫల మగుచున్న<br /><br /> మమ్ములను క్షమింప వేడుకొను చున్నాము.<br /><br /> ------ ఒ -----<br /><br /><br /><br /><br /><br /><br /><br />ప్రియ దైవమా!<br /><br /> నిన్ను అధికాధికముగా ప్రేమించుటకునూ ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యమగు నంతటి అర్హత గలవారమగునంత వరకునూ, నిన్నింకనూ అధికతరముగా ప్రేమించుటకునూ, చిట్టచివరి వరకూ నీ కొంగును గట్టిగా పట్టుకొని ఉండుటకునూ మా కందరకు సహాయము చేయుము.<br /><br /> మనుష్యులమైన మనము అన్ని పనులు ఆయన పేరిట చేయుట ద్వారా మన ఇంద్రియములకును, మనస్సుకును మంచి చెడు క్రియల ఫలితములు అంటకుండును. ఈ విధముగా శరీరేచ్ఛ నిగ్రహించ వీలగును. ఎందుకనగా దేవుని పేరిట ఎవడును దుష్ట కార్యములు చేయడు కదా!<br /><br /> అజ్ఞాన కాలమందు నుండి తన పితరుల ద్వారా సంక్రమించినది ప్రాచీన స్వభావము. ఇది మనలను శరీరానుసారులుగా చేసినది. శరీరవిషయములలో మంచి చెడులను నిశ్చయించుచు, తన స్వార్దమును నెరవేర్చుచుండును. దేవుని యందు నిజమైన విశ్వాసము తన హృదయములో కలుగ వలెననిన, ఇట్టి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచ బడుచున్న నవీన స్వభావమును ధరించు కొన వలెను. విశ్వాసులు , అవిశ్వాసులు అను బేధములేక ''కీస్తే సర్వము మరియ ఆ క్రీస్తే అందరిలో ఉన్నవాడై యున్నాడు'' అని విశ్వసించ వలెను. - (కొలస్సి 3:11). <br /><br /> ప్రాచీన స్వభావము అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము , అవ్వలకు కలిగిన స్వభావము. అది మనకు సంక్రమించినది. ఆదాము సంతానమైన మనము ఇప్పుడు జ్ఞానము కలుగు నిమిత్తము ఆ ప్రాచీన స్వభావమును విడువ వలెను. సృష్టించిన వాని పోలిక చొప్పున అనగా సాతాను మాట వినక పూర్వము ఆదాము అవ్వలు దేవునితో సమానులై , ఆయన పోలిక చొప్పున ఉండిరి. శరీర భావము లేక ఆనందముగా ఉండిరి. ఈ కాలములో నైతే క్రీస్తు యేసను దైవ కుమారుడు మృతులలో నుండి యేలాగు లేపబడెనో అట్టి సాదృశ్యముగా నడచుకొను కాలము. నవీన స్వభావము అనగా మారు మనస్సు నొందుట వలన యేర్పడినది. ఇది జ్ఞానమునకు త్రోవ చూపును. ఎందువలన అనగా దేవుడు నరులను మొదట తన పోలికగా సృష్టించెను. మరల దానిని గుర్తుచేసి, ఋజువు పరచుటకు ప్రభువైన యేసు క్రీస్తును పంపెను. దీనిని యెరుగుటయే జ్ఞానము. క్రీస్తే సర్వముగాను, అందరిలో నున్న వాడిని గాను హృదయ పూర్వకముగా విశ్వసించి యెరుగుటయే జ్ఞానము. కనుక జ్ఞానము విశ్వాస మూలముగా కలుగును. విశ్వాసము మరియు జ్ఞానము వలన శరీరానుసారమైన క్రియలు విడువ బడును. ఎందుకనగా విశ్వాస జ్ఞానములకు శరీరానుసారమైనవి విరుద్ధము.<br /><br /> శరీరానుసారమనగా అవయవములతో గూడిన స్థూల దేహమే నేనని జీవనమును జరుపుట మరియు తన ఇంద్రియములతో లౌకిక విషయములపై ఆకర్షణకు, ఇచ్ఛకు లోబడి తన శరీర, ఇంద్రియ సుఖముల కొరకు జీవనము జరుపుట. శరీరము పాపము వలన తన పూర్వక్రియలకు ఫలితములను అనుభవించుట కొరకై ఏర్పడి, చివరకు మరణించునదే. కావున పాపమనగా సుఖ దు:ఖములతో గూడిన జీవితము మరియు అజ్ఞానపూర్వక మరణము. ఈ మరణమును, మరణ భయమును పోగొట్టు కొన వలెను. శరీర సంబంధ క్రియలు చేయకను, ఆత్మయే నేనను భావముతో స్వార్థము లేకుండాను శరీర, ఇంద్రియ సుఖములకు ప్రాధాన్యత నివ్వకను దైవీ భావముతో జీవనము జరుప వలెను. ఇదియే ఆత్మాను సారము.<br /><br /> ఆత్మానుసారముగా జీవించ వలెననిన శరీరమును, దాని వ్యవహారము నందు ఆసక్తిని నిరసించ వలెను. తుదకు ఆత్మానుభవమును పొంద వలెను. ఇందు కొరకు శరీర ధర్మములను ఆత్మ ధర్మములను వివరముగా తెలిసికొని శరీరానుసార జీవనమును మాని ఆత్మానుభవమునకు వలసిన సాధనమును నిజజీవితమునందు చేయ వలెను. <br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-6839268008052082912014-02-28T04:43:00.003-08:002014-02-28T04:45:13.208-08:003.శరీరానుసారులు - ఆత్మానుసారులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">3.శరీరానుసారులు - ఆత్మానుసారులు<br /><br /> ''శరీరము మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీరమూలముగా జన్మించిన మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆత్మ మూలముగా జన్మించినవాడు ఆలాగే(నూతనముగా) యున్నాడనెను.'' <br /><br /> - (యోహాను 3-6,8)<br /><br /> తల్లితండ్రుల (శరీరముల) కలయిక వలన కలిగినది శరీరము. అనగా పురుషుని శుక్లము మరియు స్త్రీ శోణితముల కలయిక చేత యేర్పడిన పిండమే శరీరమగును. ఇట్టి శరీరమునకు ఆధారమైన చైతన్యమును (శక్తి) అందించునది ఆత్మ. ఈ ఆత్మ అనునది ముందుగా దేవుని యందు వాక్యముగా నుండెను. తదుపరి అన్ని శరీరములందు ఆంతర్య పురుషుడై యున్నది. ఆత్మ ఏకమై ఉన్నదని తెలియుటయే జ్ఞానము.<br /><br /> ఆత్మ మూలముగా జన్మించి, జ్ఞానమై యున్న మానవుని యందున్న (ఆత్మ) దీనికి మరణము లేనందున నిత్య నూతనము. ఇట్టి జ్ఞానము పొందిన వాడు ఆత్మ స్వరూపుడగును. అందుకని అతడు శరీరానుసారమైన మనస్సును మార్చుకొని తాను ఆత్మను అనుస్థితి(ధ్యాస) విడువక యుండవలెను. ఇది సాధించిన వాడు క్రొత్తగా జన్మించిన వాడగున్ష్ము మారుమనస్సు పొందిన వాడగును.<br /><br /> మారుమనస్సు పొందిన శరీరానుసారులు ఆత్మానుసారులగుదురు. ఇంను శరీరానుసారులకును ఆత్మానుసారులకును భేదమేమనగా ''శరీరానుసారులు శరీరవిషయముల మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును , సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధియై యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావ వలసిన వారైయుందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలు చంపిన యెడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించ బడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.'' - (రోమా 8-5,6,7,13,14). కావున '' మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయము అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవము అను పంటను కోయును. (గలతి 6:7,8).<br /><br /> జీవము అనగా మరణమునకు తీర్పులేనప్పుడు కలుగు నిత్యజీవము. నిత్యజీవము నొందిన వారు మరల పాపమును చేయరు. కనుక అజ్ఞానముచేత వారు శరీరమును పొందరు. ఏమైనను శరీరమునకే మరణముగాని, నిత్యజీవమైన వానికి మరణమునకు తీర్పు ఉండదు.ఎందుకనగా ''ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయ పడకుడి. ఆత్మ దేహమును కూడా నరకములో నశింపచేయు వారికి భయపడుడి.'' (మత్తయి 10:2) రక్షకుడైన ప్రభువు మాత్రమే తీర్పు చెప్పును కనుక ఆయనకు భయపడుడి.<br /><br /> శరీరానుసారముగా జీవించుట అనగా శరీరమే నేనని జీవించుట. దీని వలన మరణమునకు తీర్పు తీర్చ బడును. ఆత్మానుసారముగా జీవించుట అనగా తాను ఆత్మనని భావించుచు, పాపము వలన శరీరము ఇక రాకుండుటకు గాను ప్రవర్తించుట మరియు యిప్పటి శరీరమును పవిత్ర కర్మలకై వినియోగించు కొనుట. నిత్యజీవములో అజ్ఞాన సంబంధమైన భయమును వేదనలతో కూడిన మరణమును ఎప్పుటికిని కలుగవు. ఆత్మానుసార జీవనము ఫలితముగా ఆత్మగా నిత్యజీవమై ఉండును. జ్ఞానము వలన అవిద్య నశించును. తిరిగి శరీరమే తానను అజ్ఞాన సంబంధమైన పాపముతో కూడిన మరణము ఉండదు. ఎందుకనగా శరీరమునకే మరణము కాని ఆత్మకు ఎప్పుటికిని మరణము సంభవించదు.<br /><br /> ఆత్మానుసారముగా నడచు కొనినచో వారు స్వార్ధమును, కోరికలను నెరవేర్చరు. శరీరము ద్వారా ఆత్మయు, ఆత్మ-శరీరమునకు ఆధారమైయున్ననూ భౌతిక వ్యవహార భేదముచేత ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి అజ్ఞానముచే నిశ్చయింతురో వాటిని చేయకుందురు. తలచిన మేలు, క్రియలలో జరుగదు. కీడు చేయ వద్దను కొన్నను కీడు చేయ ప్రేరణ కలిగి కీడు చేయ బడును. ''శరీరకార్యములు స్పష్టమై యున్నవి. అవియేమనగా అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మోహము, అభిచారము, క్రోధము, కక్ష, బేధములు, విమతములు, అసూయ, మత్తత మొదలగునవి. వీటిని చేయు వారు దేవుని రాజ్యమున స్వతంత్రించు కొనరు. అయితే ఆత్మ ఫలమేమనగా సంతోషము, ప్రేమ, సహనము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము (అనాసక్తత) మొదలగునవి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడచుకొందుము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరియందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము.'' - (గలతీ 5:19-22,25).<br /><br /> దేవుని నెరుగుటకు అడ్డుగా నిలచిన కార్యములు అపవిత్రము. కాముకత్వమనగా లోక సంబంధ విషయములతో శరీరేంద్రియ సుఖములు పొంద వలెనని తీవ్రమైన కాంక్ష మరియు అన్ని విధముల తన స్వార్ధమునకై ప్రయత్నించుట. రాగ ద్వేషములు, అరిషడ్వర్గము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారములతోగూడిన ప్రతిక్రియలు సాతాను వలన కలిగినందున, అట్టి క్రియలు, ఆలోచనలు, భావములు శరీరానుసార క్రియలగును. సర్వవ్యాపకమైన తండ్రి అన్ని వస్తువులలోను, సర్వజీవులయందును ఉండెను. ఎందువలన అనగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగ లేదు. అయినను సృష్టి పదార్థములు శరీరాను సారులకే గాని జ్ఞానులకు కాదు. అందున్న సర్వవ్యాపకుడైన దేవుని తమయందును, సృష్టియందును ఎరుగుట జ్ఞానులకే వీలగును. విగ్రహమందే గాక, సర్వమునందు ఆయనయే ఉన్నాడన్న అనుభవము జ్ఞానమై ఉన్నది. పైగా యెహోవా గాక యితర దేవతా విగ్రహారాధన మూర్ఖము మరియు అంధ విశ్వాసము. ఇట్టి విశ్వాసములు పెరుగునట్లు ప్రచారము చేయునవి విమతములు. ఆత్మ ఫలము ఏదనగా ఆత్మానుభవము. ఈ అనుభవము శరీరముండునంత వరకు శాంతమును కలుగ జేయును. తదుపరి వారు యేసుక్రీస్తు నందు చేర్చుకొన బడుదురు. దీనికి క్రమ మార్గమును అవలంబించ వలెను. మానవులందరికి దేవునిచే నిర్ణయించ బడిన మార్గము ఆత్మానుభవము కొరకేగాని దీనిని అజ్ఞానులు గ్రహింపకుండిరి. <br /><br /> అందరు స్వతంత్రులుగా ఉండుటకు క్రీస్తుచే పిలువ బడితిరి. అయితే ఆ సాతంత్య్రమును శారీరక క్రియలు జరుపుటకు హేతువు చేసికొంటిమి. ఈ శరీరము వలన ''నేను'' అనునది కలిగినది. ఈ నేను అను అహం వృత్తి వలననే సుఖదు:ఖములు అనుభవించ బడుచున్నవి. కాని దేవుడు ఈ శరీరమును క్రీస్తుగా మారుట కవసరమైన సాధనముగా వినియోగించుట కొరకు మాత్రమే మనకిచ్చెను. ఈ ''నేను'' దైవమే అను అనుభవము కొరకు వచ్చెను. ఇది గ్రహించిన వారు ఆత్మానుసారముగా జీవించి, తండ్రి ఆజ్ఞను నెరవేర్చెదరు. కాని అజ్ఞానులు ఈ శరీరమును హేతువు చేసుకొని క్రీస్తుగా మారుటకు బదులు భ్రమచేత లోక సంబంధ విషయములలో తిరుగాడుచు సుఖదు:ఖముల నొందుచు, శరీరానుసార జీవనము ద్వారా మరణమునకు తీర్పు తెచ్చుకొను చున్నారు. కాని మనము ప్రేమ కలిగిన వారమై యొకనికొకడు దాసుడై యుండినచో అది ఆత్మానుసారమగును. దైవేచ్చ ప్రకారమైతే యీశరీరాత్మలలో తాను ఆత్మయే కాని శరీరము కాదని తెలిసి కొనుటకు ప్రయత్నము చేయవలెను. అట్టి ప్రయత్నము కొరకే ఈ శరీరము కలిగినది. కాని యీ కలిగిన శరీరమును ఆత్మ జ్ఞానము నొందుటకు బదులుగా శరీరేచ్ఛలను నెరవేర్చు కొనుటకు నరులు వినియోగించుచున్నారు. అందువలన వారు (అజ్ఞానముచే) పాపులగు చున్నారు. మనము ప్రేమ కలిగిన వారమైతే ఇతరుల కొరకు త్యాగమును, తన శ్రమలను ఓర్చు కొనుటకు సహనమును , వేదనను భరించుటకు శాంతమును అలవరచుకొందుము. క్రీస్తు మార్గమనగా ప్రేమ మార్గము. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ అభిషేకము దేవుని ఆత్మచే జరిగినది. అందు వలన క్రీస్తుచే పిలువ బడినవారు అభిషిక్తులె,ౖ వారును క్రీస్తు లగుదురు. కాని శరీరానుసారులు తమ మనస్సుకు సంతోషకరమగు క్రియలు చేయుదుదు. ఆత్మ ప్రభోదము వలన ప్రేరేపింపబడిన మేలైన క్రియలను చేయకుందురు. <br /><br /> కనుక ఆత్మానుసారులు యిక శరీర, లోక సంబంధమైన వాటికి వారి ఇంద్రియముల ద్వారా ఆకర్షింపబడరాదు. వీరికి యోహాను చెప్పినదేమనగా <br /><br /> ''ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయూ అనగా శరీరాశయు, నేత్రాశయు , జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించు వారు నిరంతరమును నిలుచును'' - (1యోహాను 2: 15-17).<br /><br /> మన మనస్సు తనకు ఆకర్షింప జేసికొను పదార్ధములే లోకము. అనగా కోరికతో వాటిని పొందగోరుట. లోకములో నున్నవి అనగా అనుభవించుటకు ప్రేరణ నిచ్చునవి, అనగా అవి కనబడుట వలన కోరిక పుట్టించునవి. ఈ విధముగా మనలో నున్న మోహము వలన గాని, క్రొత్తగా పుట్టిన కోరికల వలన గాని, భూ లోక సంబంధమైన వాటిని ప్రేమించిన యెడల వారు దైవమును ప్రేమించ లేరు. ఎందుకనగా లోకములో అనుభవింపబడున దేదైనను శరీర సౌఖ్యమునకు గాని, ప్రియం మోదం ప్రమోదములతో విషయానందముగా ఇంద్రియ తృప్తికే జరుగును. కాని ఆంతర్యపురుషుడైన ఆత్మకు ఇవి ఎన్నడును లేవు. ఆత్మకు సర్వుల యందు ప్రేమ తత్త్వమున్నది. కనుక శరీరేంద్రియములు ఇచ్చునది ఆత్మ సంబంధమైన ప్రేమ కానేరదు. అవి మనస్సు వరకే చేరునుగాని ఆత్మకు చేరవు. జీవపు డంబమనగా జీవుడనే నేనను జన్మార్జితమైన బలీయమైన భావము. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. మనుష్యుడు చేయు మంచి చెడులక్రియల ఫలితమును జ్ఞాపకములుగా తిరిగి అనుభవించునదే జీవపు డంబము. జీవపు డంబమనగా నేను నాది అనునది. ఇది శరీరానుసారము వలన కలిగినది. దీనిని ఆత్మానుసారముగా మార్చుకొనినచో జీవపుడంబము (అహంకారము) నశించును. అప్పుడు తాను ఆత్మను అను యదార్ధ నేను లేక సత్యము అనుభవములోనికి వచ్చును. కనుక జీవపు డంబము మనలను బంధించు జైలు వంటిది. ప్రభువు కృపావరముచే మరణమును జయించ వలెనన్న క్రీస్తు మార్గము తప్పని సరియై ఉన్నది. ఇది త్యాగమయ జీవనము ద్వారా కల్గును. <br /><br /> ''మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లి తండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు. పైకి భక్తి కలవారై ఉండియు, దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పాపభరితులై నానావిధములైన దురాశలచేత నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేకులు.'' చెడిన మనస్సు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. <br /><br /> - (2తిమోతి 3:2-6,8)<br /><br /> మనుష్యులు దైవేచ్ఛ ప్రకారము జీవించ వలెననిన శరీర ఇంద్రియములకు సుఖము కావలెనను పిపాస లేక కోరిక అడ్డు పడుచున్నది. ఇట్టి కోరికను నిగ్రహించ వలెననిన కొన్ని మంచిక్రియలను పాటించుచు, ఇంద్రియములను నిగ్రహించు కొనుచు, తన స్వభావమును బాగు చేసుకొన వలెను. గర్వమును, అహంకారమును విడచి దేవుని యందు నిజమైన భక్తి విశ్వాసములు పెంపొందించు కొన వలెను. సత్యమును ఎదిరించక, సత్యవిషయమైన అనుభవ జ్ఞానమును పొందుట కొరకు క్రమ సాధన, త్యాగ వైరాగ్యములను అభ్యాసము చేయ వలెను. యేసు క్రీస్తు చూపిన ప్రేమ మార్గములో సాధన చేయ వలెను. సాధన అనగా మెలకువ, కల, గాఢనిద్ర అను మూడు అవస్థలలోను ఆత్మానుసార జీవనమే పాటించవలెను. ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింప వలెను.'' ( మత్తయి 16:24) . తనను తాను ఉపేక్షించుకొనుట యనగా శరీరానుసారమైన భావమును విడచుట మరియు ఆయనను వెంబడించుట యనగా ఆత్మానుసారముగా నడచుకొనుట. తన సిలువనెత్తికొనుట యనగా ఆయన సిలువపై మరణించి పునరుత్థానమైన సాదృశ్యముతో ఐక్యత పరచుకొనుటను మార్గముగాను, లక్ష్యముగాను ఎంచుకొని సాధన చేయుట. అనగా శరీరముగా మరణిఙంచి, ఆత్మగా మేల్కొని, నిత్యజీవమగుట. (మరణమును జయించిన క్రీస్తుగా మారుట).</span></b><br />
<b><span style="font-size: large;"><br /></span></b>
<b><span style="font-size: large;"><br /><br />మంచినడతకు మార్గము<br /><br />1. యే ప్రాణఙకి కోరి హాని చేయకుము. - అహింస<br /><br />2. కలయందైనను అబద్ధమాడకుము, పితూరీలు చెప్పకుము. - సత్యము.<br /><br />3. పరుల సొమ్ము ఆశించకము, పరుల శ్రమను దోచకుము. - అచ్చియుండకు.<br /><br />4. దైవ చింతన మానకుము, ఆత్మానుసారముగా జీవించుము - క్రీస్తు <br /><br />5. సర్వజీవుల యందు కనికరముతో నుండుము. - దయ<br /><br />6. మానవత్వములోను, భక్తి విశ్వాసములలోను కాపట్యము లేక నిజాయితీ కలిగి ఉండుము. <br /><br /> - సత్ప్రవర్తన <br /><br />7నీకు కీడు చేసిన వానిని క్షమించుము. - క్షమ<br /><br />8. ఆత్మానుసారముగా జీవించు నప్పుడు కలుగు అడ్డంకులను ధైర్యముతో ఎదుర్కొనుము. - ధీరుడు<br /><br />9. దైవ సాధనకు వీలుగా సాత్వికాహారమును మితముగా భుజించుము. - మితాహారము<br /><br />10. దేవుని ధ్యానించుటకు మనస్సును సిద్ధపరచుటకు, నీ దేహమును, పరిసరములను శుభ్రముగా <br /><br /> నుంచుకొనుము. - శుభ్రత.<br /><br />ఆత్మానుసార మార్గము<br /><br />1. దేవుని వాక్యమును గ్రహించి, లోతైన విచారణతో ఉండుము. - తపస్సు<br /><br />2. ఏది ప్రాప్తించినను విచార పడక సంతోషముగా ఉండుము. - సంతోషము<br /><br />3. దేవుడున్నాడను విశ్వాసముతో నుండుము. - యెహోవా<br /><br />4. పరోపకారము చేయుము - దానము<br /><br />5. ప్రభువును నీ హృదయమందు యెడతెగక ధ్యాస యందుంచు కొనుము - ఆరాధన<br /><br />6. దేవుని వాక్యమును విశ్వాసపూర్వక మనస్సుతో గ్రహించుము - వాక్య శ్రవణము<br /><br />7. నీ బలహీనతలను అంగీకరించుటకు మార్పు చెందుటకు సిగ్గు పడకుము - విధేయత<br /><br />8. విన్న వాక్యమును గ్రహించి, ఆచరించి తిరిగి స్పష్టముగా ఇతరులకు బోధించే చురుకైన బుద్ధిని కలిగి ఉండుము. - తెలివి.<br /><br />9. దేవుని గురించి స్పష్టముగా యెరిగిన దానిని భావముగా నిరంతరము నీ ధ్యాసలో నుంచు కొనుము. - ధ్యాస.<br /><br />10. ఆత్మాను సారము జీవించుటను విడనాడని దీక్ష కలిగి ఉండుము. - దీక్ష.<br /><br />11. సర్వము దైవమే అని స్థిరపడి సాక్షిగా ఆశ్రయించి జీవించుము. - జీవము<br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-74515637350177645692014-02-28T04:38:00.000-08:002014-02-28T04:38:24.926-08:002.అన్యజనులు<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">2.అన్యజనులు<br /><br /> ఇంకను అన్యజనులనగా '' జారత్వము, అపవిత్రత , లోభత్వము కలిగిన వారు. కృతజ్ఞతావచనము లుచ్ఛరించనివారు. పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్ఛరించువారు. తగవు, వ్యభిచారము, విగ్రహారాధన చేయువారు. వీరు వ్యర్థములగు మాటల వలన మోస పోవుదురు. అందువలన అన్యజనులు క్రీస్తు యొక్కయు , దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాదు. వీరు చీకటియై ఉండిరి. నిష్ఫలమైన అంధకార క్రియలతో పాలివారై ఉందురు. అజ్ఞానముతో అవివేకముతో దేవుని చిత్తమేమిటో గ్రహింప కుందురు. - (ఎఫెసి 5: 3-8)<br /><br /> జారత్వమనగా మంచి నుండి చెడుకు దిగజారుట, అనగా దుర్గుణములు కలిగి, దుష్ట కార్యములు జరుపు స్వభావము. అపవిత్రత అనగా దేవుని కిష్టమగు కార్యములు చేయక, శరీరానుసారమగు క్రియలను అత్యాశతో జరుపుట. లోభత్వమనగా తనకున్న వస్తువులను,. ధనమును తనకొరకు మాత్రమే ఉంచుకొనుచు, ఇతరులకును, దైవ కార్యములకు వెచ్చించ యిచ్చ లేకుండుట. సహాయము చేసిన వారికి కృతజ్ఞత తెలుపు సంస్కారములేని వారు యీ అన్యజనులు. వీరు చేయు క్రియలు తనకును, యితరులకును సుఖము నివ్వవు. పైగా హాని కల్గించును. వ్యభిచారమనగా తానైన ఆత్మగా కాక, తాను కాని శరీరముగా జీవించుట. (వ్యభిచారము అనగా శారీరకముగా భావించ రాదు).చీకటియై యుండుట అనగా అజ్ఞానములో నుండుటయే గాక, తమోగుణము ఆవరించిన వారై ఉందురు. అంధకార క్రియలు అనగా దుర్బుద్ధితో చేయు క్రియలు. ఇవి పాపమును మూట గట్టి మరణమును కల్గించును. <br /><br /> అన్యజనులైన వారు దేవుని విశ్వసించక శరీరేచ్ఛతో స్వార్థ పరులై ఉందురు. ''అంధమైన మనస్సు (తమో గుణము) కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరు పరచ బడిన వారు. వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్ధతను అనుసరించి నడుచు కొనువారు. నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే మోహము, కాముకత్వమునకు అప్పగించు కొనువారు. మోసకరమైన దురాశల వలన చెడిపోవుదురు. ప్రాచీన స్వభావము గలవారై దేవుని ఆజ్ఞలను తిరస్కరించి అజ్ఞానము వలన (దేవుని) మరచిన వారై యున్నారు.'' - (ఎఫెసి 4: 18-24).<br /><br /> మోహము తమోగుణము వలన కలుగును. రజోగుణము కోరికలను పెంచును. కోరికల వలన దురాశ పుట్టును. కాముకత్వమనగా రజోగుణమునకు సంబంధించినది. ఈ కాముకత్వమే కామము, మోహము, లోభములను పుట్టించును. కోరికలు తీరనిచో క్రోధము కల్గును. తనకు అడ్డు తగిలిన వారిపై ద్వేషము వ్యక్తము చేయును. ఇతరులు తన కంటే ఎక్కువయని భావము కల్గినంత మాత్రమున ఈర్ష్య , అసూయ, మత్సరములు కలుగును. తానే ఎక్కువన్న భావము వలన మదము, గర్వము కల్గును. ఇవన్నియు జనులను ఆవరించిన అవిద్య వలన కలుగుచుండును. అవిద్య అనగా సాతాను ప్రేరణ. <br /><br /> సాధారణముగా జనుల స్వభావము జ్ఞానమునకు వ్యతిరేకము. కాని జ్ఞానమును గూర్చిన వివేకము, మార్గము మరియు దేవుని ఎరిగి, దేవుడగుటను భోదించుచున్నది నూతన నిబంధన గ్రంథము మాత్రమే. అయినను పాత నిబంధన గ్రంథము కొందరిని దైవము వైపు మరలించుటకు తోడ్పడును. అట్టి వారు విశ్వాసులై జ్ఞానము నొందుటకు నూతన నింబంధన మార్గదర్శకమై ఉన్నది.<br /><br /> కనుక అన్యజనులు మూఢ విశ్వాసము గలవారై పరిమిత పరచబడిన వారై యుందురు లేదా దేవుని అస్తిత్వముపై విశ్వాసము లేని వారై ఉందురు. వీరికి విశాల భావము ఉండదు.<br /><br /> అట్టి అన్యజనులు తమోగుణులై కఠిన హృదయము కలిగినవారుగా ఉందురు. వారికి దయ, కరుణకు బదులు స్వార్ధము, అధర్మము, నీచత్వము ఉండును. ఇంద్రియముల సుఖమును, శరీర సౌకర్యమును కోరుచూ, దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడచుకొనుచుందురు. వీరు శరీరానుసారులే కాని ఆత్మను ఎరుగరు.</span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-40230707108310010972014-02-28T04:30:00.003-08:002014-02-28T04:35:21.657-08:001.రక్షణ<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: justify;">
<b><span style="font-size: large;">క్రీస్తు యేసుగా ప్రకటితము</span></b><br />
<br />
<b><span style="font-size: large;">(సాధన క్రమము)</span></b><br />
<br />
<b><span style="font-size: large;">1.రక్షణ</span></b><br />
<b><span style="font-size: large;"><br /> తండ్రియైన యెహోవా తనకిచ్చిన అధికారముతో యేసుక్రీస్తు సత్యము, జీవమునై ఆయన ద్వారానే తండ్రియొద్దకు చేరు మార్గమయ్యెను. అందు వలన నిరాశ నిస్పృహ, శ్రమ, వేదన నొందుచున్న జనులకు ఒక ఆశాకిరణమై ఆలంబనయై యేసుప్రభువు మన ముందుకు వచ్చెను.<br /><br /> ''నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.'' <br /><br /> - (విలాప వాక్యములు 3 - 26)<br /><br /> మనుష్యులు అజ్ఞానముచే శారీరకముగా, మానసికముగా అనేక శ్రమలు పడుచు భ్రమ చేత వేదనలను పొందుచు శరీర సంబంధ బాధలను, మనస్సుకు సంబంధించిన దు:ఖములను ఓర్పుతో అనుభవింప జాలక దైవము యొక్క అనుగ్రహము కొరకు నిరీక్షించు చున్నారు. దైవము పై భారముంచినందున కొందరు శాంతి నొందుచున్నారు. కాని శాశ్వతమైన శాంతి, సుఖము, ఆనందము దొరకుట లేదు. అయినను అన్యజనులైన నరులు రక్షణ కొరకు ఎదురు చూడకయు వారికి దేవుడైన యెహోవా యందు విశ్వాసము లేకుండిరి. విశ్వాసులైన వారైనను దేవుడు వాగ్దానము చేసినట్లు నడుచు కొనక వ్యర్ధ క్రియలు జరుపు చున్నారు. రక్షణ పొందు మార్గము తెలియక అన్యదేవతల విగ్రహారాధన జరుపుచు లోక సంబంధ విషయములందు సుఖము కొరకై ప్రయాస పడుచు, వేదన పడుచు మరణమునకు తీర్పు ఇవ్వ బడుచున్నారు.<br /><br /> మానవులు దేవుని పోలి యుండియు దేవుని మరచి కష్టాల పాలగుచున్నారు. వారు మరల దేవుని ఎరిగి జ్ఞానమును పొందుటకు తగిన మారు మనస్సు పొంద వలెనని దేవుని ఆజ్ఞయై యున్నది. ఒక్కడేయైన దేవుడు సర్వోన్నతుడు, సత్యస్వరూపి. కాని నరులు అన్యదేవతలను ఆరాధించుట వలన జ్ఞానమును పొందజాలరైతిరి. సర్వసాక్షి, అద్వితీయుడు అయిన యెహోవాను అజ్ఞానముచే మరచి యుండుట వలన వారి దు:ఖము నశించుట లేదు. అందు వలన వారు చేయు శరీరానుసార క్రియలకు ప్రతిఫలముగా వారికి తీర్పు ద్వారా మరణము కలుగుచున్నది.<br /><br /> ప్రాచీన కాలమున యెహోవా యందు భక్తి విశ్వాసములు మాత్రమే కలుగులాగున ఆనాటి ప్రవక్తల ద్వారా బోధించుట జరిగినది. జ్ఞానమును ప్రబోధించినను వారు అందుకొన జాలిరైరి. ''ఆ అజ్ఞాన కాలమందు (పాత నిబంధన కాలమందు) దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు నొంద వలెనని మనుష్యులకు ఆజ్ఞాపించు చున్నాడు.'' - (అపొ.కా. 17 - 30). ఈ వాక్యము నూతన నిబంధనను అనుసరించి చెప్పబడెను.<br /><br />''దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు''.(కీర్తన 14ః1) <br /><br /> దేవుని నమ్మని అన్యజనులు, దేవుని గురించి తెలిసినప్పటికి , ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచు కొనని వారు మొదలగు శరీరాను సారులను జీవము గల దేవుని వైపునకు త్రిప్పుట అను ఆవశ్యకత యేర్పడెను. అపొస్తలుల ప్రకటన యీలాగున ఉన్నది. ''జీవము గల దేవుని వైపునకు తిరగ వలెనని మీకును సువార్త ప్రకటించు చున్నాము.'' - (అపొ.కా. 14 - 15).<br /><br /> ఈ విధమైన అవసరమును నెరవేర్చుట కొరకు తండ్రియైన దేవుడు క్రీస్తు యేసు అను నరుని తనకు ప్రతినిధిగా పంపెను. అతడే దైవ కుమారుడు. ''ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను.'' (1ధెస్స 5-9). ''దేవుడు ఒక్కడే , దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు.'' (1తిమోతి 2 - 5).<br /><br /> కనుక యేసుక్రీస్తును విశ్వసించి ఆయన చూపిన త్రోవలో నడచిన మనకు జ్ఞానము కలుగును. అందువలన మరణమును తప్పించు కొందుము. ఇదియే తండ్రి చేత అనుగ్రహించబడుచున్న రక్షణ. అందరును ''జన్మము వలన యూదులమే(విశ్వాసులమే) గాని అన్యజనులలో చేరిన పాపులు కాదు.'' (గలతీ 2 - 15). కనుక అందరును రక్షణ పొంద వలెనని దేవుని చిత్తమై యున్నది. ''యేసు మన ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించ బడుదువు.'' - (రోమా 10 - 9). యేసు ప్రభువు తన శరీరము సిలువ వేయ బడగా, తండ్రి అనుగ్రహమున మృతులలో నుండి లేచి పరలోక సామ్రాజ్యము సుస్థిరమై యిక యెన్నటికిని మరణము లేని స్థితిని పొందెను. కనుక యేసు క్రీస్తు జీవనము, బోధ, మరణము తెలిసిన నరులకు ఆయన మృతులలో నుండి యేలాగు లేపబడెనో తెలియును, మరియు అట్టి మార్గమును మనమును అనుసరించ వలెను. <br /><br /> ''తొట్రిల్లకుండ మిమ్ములను కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిల బెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును.'' - (యూదా1- 25). అందు వలన తండ్రియైన యెహోవా నరులపై ప్రేమగలవాడై అవసరమైన జ్ఞానమును మనకు ప్రసాదించుటకై తగిన మహిమయు అధికారమును యేసుక్రీస్తుకిచ్చి యుండెను. ఆయన ద్వారా మనకు కలుగు మహిమ, మహత్మ్యము తండ్రికి సంబంధించినవే. మనకు కనబడుచు, మనలను ప్రేమించుచు, మనలకు బోధించుచు , మనను అనుగ్రహించునట్లు కనుపించునది యేసు ప్రభువైనను, ఆయన ద్వారా జరుగు ప్రతి కార్యము తండ్రి జరిపించునదియే అయి ఉన్నది. మనము ''తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువ బడిన వారము'' - (యూదా 1-1).<br /><br /> జ్ఞాన పరముగా మనమందరమును యేసు క్రీస్తు నందు భద్రము చేయ బడిన వారమే. ఈ సంగతి మనకు తెలియక పోవుట మన అజ్ఞానము. అటులనే మనము తండ్రి యొక్క ప్రేమలో ఎప్పుడును మునిగిన వారమే. ఆ విషయము ఆయనకు తెలియును కాని మనము సాతాను అనెడి అజ్ఞాన పూర్వకముగా శరీర సంబంధముగా అభిమానమునకు లోబడినవారమై నందున శరీరానుసారులమైతిమి. అందు వలన తండ్రి ప్రేమకు తగిన రీతిగా తిరిగి మన ప్రేమను పరులకును మరియు ఆయనకును అందించు జ్ఞానము మనకు లేకుండెను. శ్రమలు వేదనలు పొందు నరులు వారివారి మరణముల నుండి రక్షించ బడుటకు ముందుగానే దేవుని ఆశీర్వాదము మనకు ఉండెను. అట్టి రక్షణ కొరకు దేవుని మార్గమున నడచు కొనవలెనని,మారు మారు మనస్సు పొంద వలెనని ఆయన ఆజ్ఞయై ఉండెను. మనమందరమును ఆయన బిడ్డలమే. ఆయన ప్రజలము. యేసు క్రీస్తు, తండ్రిచే పంపబడినందున దైవ కుమారుడు. మన వలె శరీరేచ్ఛ, పాపేచ్ఛల వలన గాక ఆయన పవిత్రాత్మగా జన్మించెను. తల్లి తండ్రుల వలన కలిగిన జన్మము కాదు, శుక్ల శోణితముల కలయిక వలన యేర్పడిన పిండము కాదు. దేవుని మహిమ వలన కన్యక గర్భమందు నుండి జన్మించెను. అందు వలన ఆయన క్రీస్తు అను యేసుగా పిలువ బడుచున్నాడు. ఆయన పవిత్ర జననమే అందుకు సాక్ష్యము. ఏలయనగా అమాయకపు మనస్సునకు సంకేతమే కన్యగర్భము, సృష్టికి ఆదియైన జ్ఞానస్థితికికూడా సంకేతము కన్యక గర్భమే. ఇట్టి కన్యక గర్భమందు దేవుని వెలుగు ప్రవేశించుటకు సాధ్యపడును. మనమునూ మారు మనస్సు పొందినచో మన హృదయములోనూ దేవుని వెలుగు ప్రవేశించును, అనగా మనము క్రీస్తు స్థితిని పొందగలము. <br /><br /> మరణమునకు తీర్చ బడు తీర్పు నుండి రక్షణ పొందుటకు మనకు సత్య స్వరూపియైన దేవుని గూర్చియు, ఆయన యొద్దకు చేరు మార్గమును గూర్చియు తెలియ వలెను. తండ్రియైన దేవుడు అదృశ్యుడు కనుక దైవ ప్రతినిధిగా తన పవిత్ర కుమారుని పంపవలసి వచ్చెను. కనుక ఆయన ద్వారానే రక్షణ కలుగ వలెను. అందుకు యేసు ఈలాగున చెప్పెను. ''నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు''. - (యోహాను14-6). ఆయనను అనుసరించమని మనకు బోధించుచూ, ఆయన కూడా అటులనే జీవించెను. అందు వలన ఆయనయే మార్గమయ్యెను. యేసు క్రీస్తు సత్యదేవుడైన తండ్రిని పోలియున్నందున, తండ్రికిని కుమారునికిని భేదమే లేదు. అందువలన ఆయన కూడా సత్యము అయి ఉన్నాడు. మరణమును జయించి నిత్యజీవము గల వాడగుటచే ఆయనే జీవము అయి ఉన్నాడు. మనకు సాదృశ్య పరచుటకు క్రీస్తుగా మరణించెను గాని, ఆయన ముందుగానే నిత్యజీవమై యుండెను మరియు ఎప్పుడును నిత్యజీవమే! ఆ జీవమే సృష్టియందంతటను నిండి ఆధారమై ఉండెను. యేసు క్రీస్తు ''తన దాసులకొరకు కనపరచుట కొరకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత''. -( ప్రకటన 1-1). కనుక అదృశ్యుడైన తండ్రి యొక్క కార్యములు యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్ష పరచబడెను. మనకు (ముఖ్యముగా ఆయన దాసులైన వారికి) గోచరమై, మొదట విశ్వాసమును, పిమ్మట జ్ఞానమును ప్రసాదించును.</span></b><br />
<b><span style="font-size: large;"><br /></span></b>
<b><span style="font-size: large;"> రక్షణ నొంద వలసిన జనులు అన్య జనులనియు , క్రియల మూలమైన విశ్వాసులనియు, దేవుని మూలమైన విశ్వాసులనియు , వారికి అవసరమైన బోధను బట్టియు , ప్రవచనమును బట్టియు విభజింపబడి యున్నారు.<br /><br /> సాధారణముగా నరులు ఎవరికి వారుగా అజ్ఞానముతో స్వభావమును కలిగి యుందురు. ఈ స్వభావము మూడు గుణములతో కూడి ఉండును. వీరి చిత్తములలో వారి స్వభావమునకు సంబంధించిన విధముగా చేయుటకు నిరంతరము ఇచ్ఛ కలుగు చుండును.<br /><br /> దీనిని చిత్త వృత్తి అందురు. ఈ వృత్తులు ప్రాణశక్తినుపయోగించి బుద్ధి యందలి జ్ఞాపకముల ద్వారా మనస్సున కందించ బడును. పిదప ఆ మనస్సు పరిస్ధితుల అనుకూలత వ్యతిరేకతల ననుసరించి వాటిని గురించి ఆలోచించును. ఈ ఆలోచనలు మూడు గుణములైన తమస్సు, రజస్సు, సాత్వికము అను స్వభావముతో కలిసిపోయి యుండును. ఎప్పటికప్పుడు ఆయా గుణ ప్రధానముగా వీరి బుద్ధి అనేక విధములుగా వారి స్వభావములను పోషించుచు నిర్ణయించుచుండును. ఒక గుణము ప్రధానముగా ఆలోచనగాని, పని జరుగుటగాని అయినప్పుడు మిగిలిన గుణములు అణిగి ఉండును. ఈ విధముగా అతడు జరుపు క్రియలలో తమోగుణము గాని, రజోగుణము గాని లేక సత్వ గుణముగాని కనబడును. ఈ గుణములను బట్టియే అన్యజనులుగా గాని , విశ్వాసులుగా గాని నిర్ణయించ గలము. అది యెట్లనగా <br /><br />1. తమస్సు (అన్యజనులు)<br /><br /> తమోగుణ ప్రధానముగా వ్యవహరించువారు అన్యజనులు. అన్యజనులనగా అవివేకులు, బుద్ధిహీనులు, మూఢులు, అన్యదేవతారాధకులు, సోమరులు, తిండిపోతులు, బద్ధకస్తులు, క్రమ శిక్షణ లేని వారు, అతి నిద్ర పోవు వారు, వీరు సమాజములో ఏ బాధ్యతను నిర్వహించరు మరియు తనకు తాను ఉపయోగ పడరు.<br /><br /> తమోగుణ లక్షణమే మనగా తనను తాను మరియు భగవంతుని మరచి యుండును. <br /><br />2. రజస్సు (అవిశ్వాసులు)<br /><br /> రజోగుణ ప్రధానముగా వ్యవహరించువారు భగవంతుని యెడల అవిశ్వాసులుగా నుందురు. వీరు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, దంభ, దర్ప, అహంకారములతోను, రాగ ద్వేషములతోను వ్యవహరింతురు. వీరు స్వార్థపూరితులు, వివాదములు రేపెదరు. వీరు ఇతరులకు హాని కల్గింతురు. మరియు తనకు తాను సుఖమును కోరుచు హాని కల్గించు కొనును. <br /><br /> రజోగుణ లక్షణమేమనగా వస్తువును యథాతథముగా గుర్తించడు మరియు దానిని వేరొక విధముగా గుర్తించి దాని వలన తొందర పాటుతో భ్రమలో మునిగి ప్రమాదములో పడును. <br /><br />3. సత్వము (విశ్వాసి)<br /><br /> సత్వ గుణ ప్రధానముగా వ్యవహరించువారు ఇతరులకు మేలు చేయు స్వభావము కలవారు. సహనము, ఓర్పు, దయ, శాంతము, ప్రేమ, త్యాగము కలిగి యుండి, సమాజమునకు సుఖ శాంతులు కలుగ జేయుదురు మరియు తానుకూడా సుఖ శాంతులతో నుండును. వీరు చేయు కర్మలు దైవార్పణ భావముతో నుండును. భగవంతుని యందును, పెద్దల యందును విధేయత, విశ్వాసములు కలిగి యుందురు. వస్తువును, నిష్పక్షపాతముగాను, యథాతథముగాను గుర్తించి వివేకముతో వ్యవహరింతురు. వీరు క్రీస్తు నందు ప్రవేశించుటకు అర్హత కలవారై యుందురు. <br /><br /> వీరందరును క్రీస్తు న్యాయస్థానము నందు వారి వారి క్రియలకు తగిన తీర్పులను అనుసరించి నడచుకొందురు. పై మూడు గుణముల వలన వీరు వేరు వేరు ఫలితములను అనుభవింతురు. ఇవన్నియు సాతాను ప్రేరణ ఫలితమే. ఇట్టి శరీరానుసార వృత్తులన్నియు అంత:కరణ వృత్తులన బడును.<br /><br /> <br />తీర్పు నుండి రక్షణ<br /><br />1. సాతాను వలన పాపేచ్ఛ <br /><br /> పాపేచ్ఛ వలన శరీరేచ్ఛ<br /><br /> శరీరేచ్ఛ వలన శరీరానుసారం<br /><br /> శరీరానుసారం వలన మరణం<br /><br />2. దురాశ వలన దు:ఖం <br /><br /> తమస్సు వలన మోహం<br /><br /> రజస్సు వలన కామం<br /><br /> సాత్వికము వలన శాంతం<br /><br />3. సాత్వికము వలన ప్రేమ<br /><br /> ప్రేమ వలన త్యాగం<br /><br /> త్యాగము వలన తృప్తి <br /><br /> తృప్తి వలన సంతోషము <br /><br />4. భక్తి వలన ప్రార్థన <br /><br /> ప్రార్థన వలన పశ్చాత్తాపం<br /><br /> పశ్చాత్తాపం వలన రక్షణ<br /><br /> రక్షణ వలన దీర్ఘశాంతం<br /><br />5. క్రీస్తు వలన కరుణ <br /><br /> ప్రభువు వలన ప్రేమ <br /><br /> ప్రేమతోనే ఆరాధన<br /><br /> ఆరాధనతోనే మారు మనస్సు<br /><br /> మనస్సు మారి క్రీస్తు లోకి<br /><br /> క్రీస్తు నుండి క్రీస్తు యేసుకు <br /><br />6. తండ్రి వలన యేసు<br /><br /> యేసు ద్వారా పరిశుద్ధాత్మ<br /><br /> పరిశుద్ధాత్మ వలన సంచ కరువు<br /><br /> సంచ కరువుతో పరలోక రాజ్యము.<br /><br /><br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-41355345907853711382014-02-28T04:25:00.000-08:002014-02-28T04:25:11.067-08:00 ప్రభు స్తుతి<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="font-size: large;"><b> ప్రభు స్తుతి<br /><br /> ఓ ప్రభువా!<br /><br /> సర్వపోషకా! <br /><br /> సర్వ రక్షకా!<br /><br /> నీవు ఆదియును <br /><br /> అంతమును లేని వాడవు:<br /><br /> అద్వయుడవు. <br /><br /> నిరుపమానుడవు: <br /><br /> నీ ప్రమాణ మెవ్వరును <br /><br /> యెఱుంగ నేరరు.<br /><br /> నీవు వర్ణము <br /><br /> నామము <br /><br /> రూపము <br /><br /> గుణములు, లేని వాడవు.<br /><br /> నీవు అపరిమితుడవు<br /><br /> గంభీరుడవు<br /><br /> ఊహాతీతుడవు<br /><br /> భావనాతీతుడవు <br /><br /> శాశ్వతుడవు<br /><br /> నాశనము లేని వాడవు.<br /><br /> నీవు అవిభాజ్యుడవు<br /><br /> దివ్య చక్షువులతో గాని <br /><br /> నిన్నెవరునుచూడ జాలరు<br /><br /> నీవు ఎల్లప్పుడు నుంటివి<br /><br /> నీవు ఎల్లప్పుడు నున్నావు<br /><br /> నీవు ఎల్లప్పుడు నుందువు<br /><br /> నీవు అంతట గలవు<br /><br /> నీవు అన్నింట నున్నావు<br /><br /> మరి నీవు అంతటికి, అన్నింటికి<br /><br /> ఆవల కూడా నున్నావు.<br /><br /> నీవు ఆకాశమున గలవు<br /><br /> పాతాళమున గలవు<br /><br /> నీవు వ్యక్తుడవు<br /><br /> అవ్యక్తుడవు<br /><br /> నీవు అందరిలోను ఉన్నావు<br /><br /> అందరూ నీలో నున్నారు.<br /><br /> నీవు పరలోక రాజ్యమందే కాక<br /><br /> సర్వ లోకాలలో నున్నావు.<br /><br /> నీవు అగోచరుడవు<br /><br />స్వతంత్రుడవు<br /><br /> నీవు సృష్టి కర్తవు <br /><br /> ప్రభులకు ప్రభుడవు<br /><br /> అందరి మనస్సులను<br /><br /> హృదయములను ఎరిగిన వాడవు<br /><br />నీవు సర్వ శక్తి మంతుడవు<br /><br /> సర్వవ్యాపివి<br /><br /> నీవు అనంత జ్ఞానము <br /><br /> అనంత శక్తియు <br /><br /> అనంత ఆనందమును <br /><br />నీవు జ్ఞాన సాగరుడవు<br /><br /> సర్వజ్ఞుడవు<br /><br /> అనంత జ్ఞానివి<br /><br />నీవు భూతభవిష్యద్వర్తమానములు <br /><br /> ఎరిగిన వాడవు <br /><br /> జ్ఞానమే నీవు<br /><br /> నీవు సర్వదయాళుడవు<br /><br /> నిత్య శుభంకరుడవు<br /><br />నీవు ఆత్మల కెల్ల నాత్మవు<br /><br /> అనంత గుణ విశిష్ణుడవు<br /><br /> నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి<br /><br />నీవు సత్యమునకు మూలము<br /><br /> ప్రేమ మహాసాగరుడవు<br /><br /> నీవు సనాతన పురుషుడవు<br /><br /> సర్వోత్తముడవు<br /><br /> నీవు ప్రభుడవు <br /><br /> పరిశుద్ధుడవు.<br /><br />నీవు పరుడవు<br /><br /> పరాత్పరుడవు<br /><br /> నీవు సర్వుడవు<br /><br /> సర్వసాక్షివి<br /><br /> నీవు సత్య స్వరూపుడవు<br /><br /> సత్య సాక్షివి<br /><br /> నీవే మార్గమును సత్యమును జీవమును<br /><br /> ప్రియతముడైన భగవంతుడవు<br /><br /> నీవు యెహోవా అనబడు ఏకైక పూజ్యుడవు</b></span></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-1739161916193202712014-02-28T04:22:00.000-08:002014-02-28T04:22:40.024-08:00ముందుమాట<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="font-size: large;">ముందుమాట</span></b></div>
<div style="text-align: justify;">
<br /><b><span style="font-size: large;"> తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ </span></b><br /><b><span style="font-size: large;"><br /> ప్రభువు ఆజ్ఞచే నిర్ణయించ బడిన '' నా కృప నీకు చాలును'' రీతిగా అందించిన స్ఫూర్తిని వ్యక్తీకరించిన యీ చిన్న ప్రయత్నము ''కీస్తు యేసుగా ప్రకటితము''.<br /><br /> దైవము ఒక్కటే. సృష్టి ఆది నుండి దైవకుమారుడు యెహోవాతో ఐక్యమగు స్థితి వరకూ గల సమస్తము పరిశుద్ధగ్రంథము నందు యదార్ధ జ్ఞానముగా నున్నది. ప్రతి మనిషి పరలోక సామ్రాజ్యమునందు సుస్థిరతను పొందుటకు జీవనము ఏ రీతిగా జరుగ వలెనో ఆత్మానుసార జీవితముగా వర్ణించ బడిన సమస్త వాక్యములను ప్రోగుచేసి సాధనా క్రమముగా కూర్చి అందించ బడిన ఆశీర్వాదమిది.<br /><br /> పరిశుద్ధ గ్రంథమును జ్ఞానపరముగా పఠించగా నద్దానిని వివరించుటకు గాను జ్ఞాన వాక్యములను యెంచి ఒక వరుస క్రమములో పేర్చుట జరిగినది. ఆ వాక్యములను అర్థవంతముగా చేయుటకు గాను ఆ గ్రంథములోనే నున్న మరికొన్ని వాక్యములను వివరణాత్మకముగా మార్చి కూర్చడమైనది. ఈ విధముగా యేర్పడిన పాఠమును ఒక చార్టు ద్వారా తెలియపరచుటకు ప్రయత్నము జరిగినది. ఆ తెలియ పరచుటకు దైవము నుండి దిగి వచ్చిన సృష్టిని, మానవుని, అటులనే యేసుక్రీస్తు అను నరుని మరియు యోహాను అను సాక్షిని చార్టు ద్వారాను, బొమ్మల ద్వారాను వివరించ బడినది. <br /><br /> ఈ క్రమమును అందించుటకు అవసరమైన అనుసంధాన విషయములను జత పరచుట జరిగినది. ఈ విధముగా బయలు పరచ బడిన పాఠమును ఒక సారి పరిశీలించిన పిదప అవసరమైన చోట వాక్యములలోని పదములను మరింత స్పష్టముగా వివరించుట జరిగినది. ముందు వివరించిన వాటికి సరి అయిన దృక్కోణము లభించగా అనేక మార్పులు జరిగినప్పటికిని, మూలమైన పవిత్రగ్రంథ వాక్యములను, వాటి భావములను మార్పు చెందకుండు నట్లు జాగ్రత్త వహించట మైనది. <br /><br /> ఈ విధముగా తయారైన గ్రంథ విషయముననుసరించి, ప్రభుస్తుతి, ప్రార్ధన సాధన, తత్త్వములు మొదలైన వానిని తగినచోట అనుసంధించడమైనది. ఇందుకు సహకరించిన విశ్వాసులందరికి కృతజ్ఞతాస్తుతులు అందజేయడమైనది.<br /><br /> పలువురు అనుభవజ్ఞుల సహాయ సహకారములతో చేర్పు కూర్పులను చేపట్టుట జరిగినది. యదార్ధవిషయములు అనుభవస్థితులన్నీ సత్యానుభవముగల మహనీయుల పర్యవేక్షణ యందు పరిశీలించ బడినవి. దైవ కృపచే అంతయూ సమర్థవంతముగా నిరాటంకంగా నెరవేర్చ బడినది. <br /><br /> దేవుని చిత్తము నెరవేర్చబడుటలో అవకాశము కలిగిన వారందరూ ధన్యులు.<br /><br /> ఆమెన్!!<br /><br /> <br /><br /> <br /><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3942424163732532241.post-77241094865539976542014-02-28T04:19:00.006-08:002014-02-28T04:19:57.428-08:00విషయ సూచిక<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;">విషయ సూచిక</span></b></div>
<b><span style="font-size: large;"> ముందు మాట<br /> ప్రభు స్తుతి<br />1. రక్షణ<br />2. అన్యజనులు<br />3. శరీరానుసారులు - ఆత్మానుసారులు<br />4. విశ్వాసులు<br />5. శరీరానుసారమును నిరసించుట<br />6. ధర్మశాస్త్రము - నీతి<br />7. దేవుని చిత్తము<br />8. మార్గము - సత్యము - జీవము<br />9. శరీరము - ఆత్మ<br />10. వైరాగ్యము<br />11. పరిచర్య - ప్రవచనము<br />12. హృదయము - అంత:కరణ<br />13. విశ్వాసము వలన దైవము<br />14. సాధన క్రమము<br />15. ప్రేమ మార్గము<br />16. ధైర్యము - శోధన<br />17. ఆశీర్వాదము<br />18. కొండ మీద ప్రసంగము<br />19. అదృష్టవంతులు<br />20. మౌక్తికము</span></b><div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
</div>
Unknownnoreply@blogger.com